What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 June 2014

ఇరవై ఏళ్ళుగా సాధన చేస్తున్నాను. కానీ మనోవాసనలను జయింపలేకున్నాను?

ఇరవై ఏళ్ళుగా సాధన చేస్తున్నాను. కానీ మనోవాసనలను జయింపలేకున్నాను? 

ప్రతి మనిషికీ ఆరు జన్మల వాసనలు మనస్లో నిల్వ వుంటాయి. క్రిందటి 7వ జన్మలోని వాసనలు ప్రారబ్ధంగా మారి ఈ జన్మలో అనుభవిస్తాడు. లేక పూర్వ వాసనలలో ఫలాన్నివ్వడానికి సిద్ధంగా ఉన్న సంస్కారాల వల్ల ఈ జన్మ కలుగుతుంది. ఇదంతా పురాణాల ఆధారంతో చెప్పింది. దీనినే "ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్" అని గీతలో (2-55) అన్నారు. కనుక వివేక, వైరాగ్య ఏకాగ్రతలు కలగడానికి మనసులో ఉన్న అన్ని వాసనలూ క్షయం అవాలి. ఉదాహరణకు ఒక పెద్ద బండరాయిని సుత్తితో బ్రద్దలు కొట్టే వ్యక్తి నలభై దెబ్బలు కొట్టిన తరువాత రాయి పగులుతుంది. నలభయ్యో దెబ్బకే రాయి పగిలిందని చెప్పలేం. ముప్ఫైతొమ్మిది దెబ్బలు సహకరించి నలభయ్యో దెబ్బ ద్వారా ఫలితం కలిగిందని చెప్పవచ్చు. అలాగే సాధకుడు చేస్తున్న సాధన ఫలితం బాహ్యంగా కనిపించకపోయినా అంతరంగంలో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతూనే వుంటుంది. శుద్ధ మనస్సు కలవానికి స్వప్నంలో కూడా నిరంతరం ఇష్టచింతనయే కలుగుతుంది. చెడు స్వప్నాలు రావు. అందరిలోనూ పరమాత్మను చూస్తూ, నిష్కామ కర్మ చేసేవారికి సర్వత్రా ఇష్ట దర్శనం జాగ్రదావస్థలో కలుగుతుంది. అంతవరకూ సాధన చేస్తూండాలి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML