జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియున్ గూర్చి, నే
దండంబుంగొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు, మూకన్ చెండు చున్నప్పుడొ-
క్కండున్ నీ మొర లాలకింపడు, కురుక్ష్మానాథ! సంధింపగన్.
దండంబుంగొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు, మూకన్ చెండు చున్నప్పుడొ-
క్కండున్ నీ మొర లాలకింపడు, కురుక్ష్మానాథ! సంధింపగన్.
శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో తన ఆఖరిమాటగా జరుగబోయే యుద్ధాన్ని చిన్న-చిన్న మాటలతోనే ఎంతో శక్తివంతంగా దూతగా వచ్చిన కృష్ణుడు ధ్రుతరాష్ట్రున్ని సంధి కావాలా లేక సమరం కావాలా అని అడుగుతున్నాడు.
అర్జునుడు ద్రుఢమైన రథమెక్కి రంగంలోకి దిగుతాడు. దానికో ధ్వజం. ఆ జండామీద హనుమంతుడు. రథానికి ముందు తెల్లటి గుర్రాల సమూహం (సిత-వజీ-శ్రేణి). చేతిలో చెర్నకోలతో నేనే స్వయంగా తోలే రథం (తోలు - స్యందనము) అది. దానిమీద అరివీర భయంకరుడైన అర్జునుడు. గాండీవం చేతిలో సిద్ధంగా పట్టుకొని, వింటి నారి సారిస్తూ, కురు సైనికుల మూకను చీల్చి చెండాడే దృశ్యం ఒక్కసారి ఊహించుకో. ఆ సమయంలో సంధి చేసుకొందామని (సంధింపగన్) నువ్వు ఎంత మొరపెట్టిన, ఎవ్వరూ వినిపించుకోరు.
No comments:
Post a Comment