జగద్గురువు అంటే...
ఒకసారి శ్రీ జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసిమ్హ భారతీ మహాస్వాములవారు వద్దకు ఒక విదేశస్థుడు వచ్చి ఇలా ప్రశ్నించాడు
" మీరు జగద్గురువునని ఎలా చెప్పగలరు? ప్రపంచంలో హైందవేతురులు ఎందరో ఉన్నారు కదా?"
శ్రీ జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు " ప్రపంచంలోని ప్రతి యొక్కరికి మేము ఆధ్యాత్మిక గురువులమని చెప్పుకోవటానికి కాదు జగద్గురువులనటం. ప్రపంచంలో ఏ మారు మూల ప్రాంతంలో నివసిస్తున్న ఎవరైనా సరే చిత్తశుద్ధితో మా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటే మాకు తెలిసినంత వరకు ఆ మార్గ దర్శనాన్ని అందివ్వల్సిన బాధ్యత మాపై ఉన్నది.
మాకెంతో దూర ప్రదేశంలో నివసిస్తూ కూడా మా యొక్క మార్గదర్శనాన్ని కోరుకునే వ్యక్తి ఉండవచ్చు. మరో వ్యక్తి మఠ ప్రాంగణంలో నివసిస్తున్నా మా సలహాను కోరుకోకపోవచ్చు. మొదటి వ్యక్తికి సహాయమందించటం మా బాధ్యత. రెండవ వ్యక్తికి కాదు. మొదటి వ్యక్తికి గురువు అయితే రెండవ వ్యక్తికి కాదు.
అందువలన ఆ పదం మా బాధ్యతని తెలియచేస్తుంది తప్ప, మార్గదర్శనం కోరని వారిపై అధికారాన్ని కాని, హక్కుని కాని సూచించదు"
పైన రాసిన అపురూప వాక్యములు శ్రీ నోరి రమకృష్ణయ్య గారు రాసిన " శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి అనుగ్రహభాషణ సంగ్రహం అనే అద్భుతమైన పుస్తకంలోని నుండి తీస్కోబడినది.
అయితే...మన గురువుగారు చాలా సార్లు ఈ అంశం గురించి చెప్పి ఉన్నారు.
ఏ మనిషికి అయినా సరే... జీవితంలో ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటునప్పుడు ఒక గురువుగారి ఆవశ్యక్త ఎంతో ఉంటుంది...అసలు ఒక గురువు మాత్రమే ఆ దారి లో నడింపించి మనల్ని మొక్షానికి అర్హతని కలిపించగలరు...అయితే...ఎవ్వరైనాసరే...మన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని గురువు గా భావించుకుంటే....మిగతా మార్గాన్ని అంతా ఆ శంకరులు..అంటే సాక్షాత్తు..ఆ శివుడే మనకి దక్షిణామూర్తి రూపంలో మనల్ని నడిపిస్తాడు......మన అందరికి శంకరులే కదా తొలి గురువు!
ఒకసారి శ్రీ జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసిమ్హ భారతీ మహాస్వాములవారు వద్దకు ఒక విదేశస్థుడు వచ్చి ఇలా ప్రశ్నించాడు
" మీరు జగద్గురువునని ఎలా చెప్పగలరు? ప్రపంచంలో హైందవేతురులు ఎందరో ఉన్నారు కదా?"
శ్రీ జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు " ప్రపంచంలోని ప్రతి యొక్కరికి మేము ఆధ్యాత్మిక గురువులమని చెప్పుకోవటానికి కాదు జగద్గురువులనటం. ప్రపంచంలో ఏ మారు మూల ప్రాంతంలో నివసిస్తున్న ఎవరైనా సరే చిత్తశుద్ధితో మా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటే మాకు తెలిసినంత వరకు ఆ మార్గ దర్శనాన్ని అందివ్వల్సిన బాధ్యత మాపై ఉన్నది.
మాకెంతో దూర ప్రదేశంలో నివసిస్తూ కూడా మా యొక్క మార్గదర్శనాన్ని కోరుకునే వ్యక్తి ఉండవచ్చు. మరో వ్యక్తి మఠ ప్రాంగణంలో నివసిస్తున్నా మా సలహాను కోరుకోకపోవచ్చు. మొదటి వ్యక్తికి సహాయమందించటం మా బాధ్యత. రెండవ వ్యక్తికి కాదు. మొదటి వ్యక్తికి గురువు అయితే రెండవ వ్యక్తికి కాదు.
అందువలన ఆ పదం మా బాధ్యతని తెలియచేస్తుంది తప్ప, మార్గదర్శనం కోరని వారిపై అధికారాన్ని కాని, హక్కుని కాని సూచించదు"
పైన రాసిన అపురూప వాక్యములు శ్రీ నోరి రమకృష్ణయ్య గారు రాసిన " శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి అనుగ్రహభాషణ సంగ్రహం అనే అద్భుతమైన పుస్తకంలోని నుండి తీస్కోబడినది.
అయితే...మన గురువుగారు చాలా సార్లు ఈ అంశం గురించి చెప్పి ఉన్నారు.
ఏ మనిషికి అయినా సరే... జీవితంలో ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటునప్పుడు ఒక గురువుగారి ఆవశ్యక్త ఎంతో ఉంటుంది...అసలు ఒక గురువు మాత్రమే ఆ దారి లో నడింపించి మనల్ని మొక్షానికి అర్హతని కలిపించగలరు...అయితే...ఎవ్వరైనాసరే...మన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని గురువు గా భావించుకుంటే....మిగతా మార్గాన్ని అంతా ఆ శంకరులు..అంటే సాక్షాత్తు..ఆ శివుడే మనకి దక్షిణామూర్తి రూపంలో మనల్ని నడిపిస్తాడు......మన అందరికి శంకరులే కదా తొలి గురువు!
No comments:
Post a Comment