శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది. ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే. యోగ అన్నపదానికి అర్థం రెంటిని కలుపుట. సంయోగం కలయిక, ఐతే వియోగం విడిపోవడం. "యోగక్షేమం వహామ్యహం" అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిది లభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడడం. గీతలో యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడం. దీనికి అనేక దర్శనాలు అనేక మార్గాలు. వాటన్నిటినీ సమన్వయంచేసి గీతలోచెప్పినవాడు భగవంతుడు. గీత వృద్ధులకు పనికి వచ్చే పుస్తకమా? కానేకాదు. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణకు మార్గం చూపిస్తుంది. దానిని మించిన Management Textbook లేదు.
6
వసుదేవసుతందేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
మనము కృష్ణుడు మహాయోగి అనిచెప్పుకున్నాము. అసలు ఆయన ముఖ్యతత్త్వం జగద్గురు తత్త్వం. ఇది విష్ణుతత్త్వం కాదు. విష్ణువు ఏ అవతారంలోనూ ఎవరికీ బోధ చేయలేదు. ఇది కృష్ణునిలోని శివ తత్త్వం, సుబ్రహ్మణ్య తత్త్వం. కృష్ణునికి శివునికీ ఉన్న సంబంధం మామూలుగా గుర్తించనిది. భీష్ముడు ధర్మరాజు కు విష్ణు సహస్రం బోధించాడు. కృష్ణుడు ధర్మరాజుకు శివసహస్రనామావళి, శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెప్పాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు. భ్రమర గీత కూడా. కృష్ణుని భంగిమ నటరాజ స్వామి కుంచితపాదాన్ని పోలి ఉంటుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్రంలో ఒకపేరు).
7
ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకోవాలి. పురాణాలు ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి .సర్గ, ప్రతిసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరితం. - అనంత కాల చక్రం ఆద్యంతాలులేనిది. మానవజీవితమునకు సుమారు 100 సంవత్సరాలు పరిమితి అయితే, కలియుగ పరిమితి 4,32,000 సం. 4:3:2:1 లొ ఉన్న నాలుగు యుగాలు ఒక మహాయుగం. ఎన్నో మహాయుగాలు గడిస్తే కల్పం, మన్వంతరం వంటివి వస్తాయి. యుగాంతం లో ప్రళయాలు వస్తాయి. విష్ణువు పాలసముద్రంలో ఆది శేషునిపై యోగనిద్రలో ఉంటాడు. ఆతడే సృష్టి కర్త. ఆధునికులం పాలసముద్రాన్ని Milky Way Galaxy గా భావించుకోవచ్చు. ఆయన సృష్టికోసం ఒక పరిమిత విశ్వాన్ని సృష్టించాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల, .... పాతాళ అనే 7 క్రిందిలోకాలు సృష్టించాడు. సత్యలోకములో ప్రతిసృష్టిచేసే బ్రహ్మదేవుణ్ణి సృష్టింఛాడు. ఈ బ్రహ్మలోకంపైన పరమేశ్వర లోకాలనే వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వారి లోకాలలో ఉంటారు

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment