Splendid art work:: అద్భుతమైన మన భారతీయ శిల్పకళ::: మీ కళ్ళనే ఏమార్చేంత అద్భుత శిల్పకళా నైపుణ్యం:: ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పము... తమిళనాడు లోని మహాబలిపురం లోనిది... ఈ ప్రదేశంలో చాలా శిల్పాలు.. చారిత్రక స్థలాలు ఉన్నాయి.. వీటిని పల్లవరాజునరసింహవర్మన్ క్రీ.శ. ఏడవ శతాబ్దంలో నిర్మించాడు... ఈ శిల్పం లో మహత్యం ఏమి టంటే మొదటి సారి చూస్తే(చిత్రం 1) ఒక ఆవు తన లేగ దూడకు పాలు ఇస్తున్నట్లుగా ఉంటుంది... ఇక్కడ ఆవు, దూడ రెండూ నాలుగు కాళ్ళను కలిగినట్లుగా (చిత్రం 2)కనపడుతుంది. ఒక ప్రత్యేక స్థలంలో చెయ్యి అడ్డు పెట్టి చూస్తే ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగుకు పాలు ఇవ్వటం కనపడుతుంది.. మొదట మనకు ఏనుగుకానీ తొండం కానీ కనపడవు.. కానీ ఆ ప్రత్యేకస్థలాన్ని కప్పివేయగానే(చిత్రం 4,5) తల్లి ఏనుగు మాత్రమే కాదు.. పిల్ల ఏనుగు తొండం కూడా కనపడుతుంది... ఇక్కడ గమనించవలసినదేమంటే.. ఆవుకు ముందరి కాళ్ళు(చిత్రం 6) ఏనుగు తొండంలా మారుతుంది... దూడ వెనుక కాళ్ళు పిల్ల ఏనుగు తొండంలా కనపడుతుంది... అది మన శిల్పకళా చాతుర్యమంటే.. అందుకే ఇది ప్రపంచ వారసత్వ సంపదలో భాగమయింది...

No comments:
Post a Comment