What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 October 2014

వేంకటేశ్వర స్వామిని పుట్ట రూపంలో కొలుస్తూ.. నిత్యం అభిషేకం జరిగే ఏకైక దేవస్థానం::తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం:: తిరుమలగిరి :: కృష్ణా జిల్లా::

వేంకటేశ్వర స్వామిని పుట్ట రూపంలో కొలుస్తూ.. నిత్యం అభిషేకం జరిగే ఏకైక దేవస్థానం::తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం:: తిరుమలగిరి :: కృష్ణా జిల్లా::
ఈ క్షేత్రంలో ఎన్నో వింతలు, ఆశ్చర్యాలు, అద్భుతాలు ఉన్నాయి... పూర్తిగా చదవండి...
పూర్వం లక్ష్మీ దేవి వారు వేంకటేశ్వర స్వామిని విడిచి వెళ్ళినపుడు.. లక్ష్మీదేవికై వెతుకుతూ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడ అమ్మవారికై తపస్సు చేసారని ఒక కథనం.... చాలా రోజులు స్వామి కదలకుండా అలా ఉండి పోవడం వలన స్వామి చుట్టూ పుట్ట ఏర్పడింది... స్వామి వారిని సేవ చేయడానికి/పూజించడానికి ఋషులు,దేవతలు, యక్షులు, కిన్నెర కింపురుషులు ఇక్కడికి వచ్చేవారట... బ్రహ్మ, మహేశ్వరులు ఆవుల రూపంలో వచ్చి పుట్టలో నుండి పాలను జారవిడిచి స్వామి వారికి సేవచేసేవట... ఆల మంద లోని ఈ రెండు ఆవులు ఎందుకు పాలు ఇవ్వడంలేదో అని వీటిని గమనించి వీటిని వెంబడించిన ఆ గో పాలకుడు పుట్టను గడ్డపలుగుతో పొడిచినపుడు అది స్వామి వారికి తగిలి నుదుట గాయమయిందని అప్పటినుండి.. స్వామి బాధతో ఈ శేషాచలం విడిచి తిరుమల కొండకు వెళ్ళి పోయాడని.. ఒక కథనం... తర్వాత ఋషులు, దేవతలు స్వామి వారిని వేడుకుంటే ఇక్కడ పుట్ట రూపంలో వెలిశాడని ఉదయం ఆరు గం టలనుండి సాయంత్రం ఆరు గంటలవరకు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే మన మానవమాత్రులకు ప్రవేశమని ... ఎందుకంటే స్వామి శేషనాగు రూపంలో కొండపై తిరుగుతారని... వారిని చూసిన వారు స్వామి రూపం చూసి తట్టుకోలేక చనిపోతారని ఒక కథనం... అందుకే సూర్యాస్తమయం తర్వాత కొండపై ప్రవేశం నిషిద్ధం...
సూర్యాస్తమయం తర్వాత దేవతలు ఇక్కడికి వస్తారని నమ్మకం... దేవతలు పూజ చేసారా అనేటట్టు స్వామి వారి పుట్ట సమీపంలో అభిషేకం చేసిన నీళ్ళు ప్రతి రోజు కనపడతాయట.... ప్రతిరోజు ఇప్పటికీ ఇక్కడ గుడి సాయంత్రం ఆరు వరకే ఉంటుంది... కొండపైన ఎవరూ ఉండరు...
ఇక్కడ స్వామివారికి వేరే విగ్రహమేమి ఉండదు.. పుట్టనే స్వామివారి రూపంగా పూజిస్తారు... పుట్ట యొక్క కన్నాలను నామాలుగా మార్చి నామాల తాతయ్య రూపంలో అర్చిస్తారు భక్తులు... ఇక్కడ నిత్యాభిషేకం జరుగుతుంది(పుట్టకు) ..
శివుడు అభిషేక ప్రియుడు... అందుకే శివయ్యకు మనం నిత్యం అభిషేకం చేస్తాం...... కానీ ఒక్క తిరుమలగిరిలో మాత్రమే... వేంకటేశ్వరస్వామికి నిత్యం అభిషేకం జరిగేది.

ఇక్కడ కొండపైకి ఎక్కి కోరిన కోర్కెలు ఖచ్చితంగా తీరుతాయని... తిరుమల దర్శించుకునే స్తోమత లేని వారు ఇక్కడకు వస్తే చాలని నమ్మకం... ఈ ప్రాంతవాసులు ఈ కొండను తిరుమల కొండలాగానే భావిస్తారు...
ఓం నమోవేంకటేశాయః



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML