ఆగ్రహించిన ఆపదమ్రొక్కుల వాడు:
ఆ ఏడుకొండల వాడు తనను తూలనాడినా క్షమిస్తాడట, కానీ తన పరమ భక్తులను కించిత్తు అవమానించినా కోపోద్రిక్తుడవుతాడట. ఒకనాడు భక్త శిఖామణి వెంగమాంబ ఆ ఆపన్నివారుడిని పూజించి భక్తి రసార్ద్ర చిత్తయై ఇంటికి చేరుకొని, పెరటిలో పీఠంపై కూర్చొని అనంత ప్రకాశమైన ఆ ఆనందనిలయ విమాన శిఖరాన్ని తదేకంగా వీక్షిస్తూ ధ్యాననిమగ్నమయ్యారు. సరిగ్గా అపరాహ్ణ వేళ ప్రక్క ఇంటిలోని అర్చకుడు అక్కారం దీక్షితులు, అతని బంధువులు భోజనం ముగించుకొని ఎంగిలి విస్తళ్ళను వెంగమాంబ తులసీవనంలోకి విసిరివేశారు. ఎప్పటినుంచో వారికి ఈ యోగినిపై ఉన్న ఈర్ష్యాద్వేషాలను ఈ విధంగా ప్రదర్శించి అవమానించారు. ఈ విస్తరాకులు పడగానే ఆమెకు ధ్యాన భంగమైంది. వెంటనే వెంగమాంబను ఆ వేంకటేశుడు ఆవహించాడు. వెంగమాంబ ఆగ్రహోదగ్రురాలై ’పాపీ! నేటితో నీ వంశం సరి! సమూలంగా నశించు గాక!” అంటూ శపించారు. ఒక్కసారిగా ఎక్కడి వారక్కడే రక్తం కక్కుకుంటూ చతికిల బడ్డారు. వారిలో అర్చకుడి కుమారుడు ఒక్కడే కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి వెంగమాంబను శరణువేడాడు. ఆమె శాంతించి ’ఇప్పటి నుంచి మీ వంశంలో ఒక్కొక్కడు మాత్రమే మిగులుగాక’ అంటూ శాప తీవ్రతను తగ్గించారు.
ఆ ఏడుకొండల వాడు తనను తూలనాడినా క్షమిస్తాడట, కానీ తన పరమ భక్తులను కించిత్తు అవమానించినా కోపోద్రిక్తుడవుతాడట. ఒకనాడు భక్త శిఖామణి వెంగమాంబ ఆ ఆపన్నివారుడిని పూజించి భక్తి రసార్ద్ర చిత్తయై ఇంటికి చేరుకొని, పెరటిలో పీఠంపై కూర్చొని అనంత ప్రకాశమైన ఆ ఆనందనిలయ విమాన శిఖరాన్ని తదేకంగా వీక్షిస్తూ ధ్యాననిమగ్నమయ్యారు. సరిగ్గా అపరాహ్ణ వేళ ప్రక్క ఇంటిలోని అర్చకుడు అక్కారం దీక్షితులు, అతని బంధువులు భోజనం ముగించుకొని ఎంగిలి విస్తళ్ళను వెంగమాంబ తులసీవనంలోకి విసిరివేశారు. ఎప్పటినుంచో వారికి ఈ యోగినిపై ఉన్న ఈర్ష్యాద్వేషాలను ఈ విధంగా ప్రదర్శించి అవమానించారు. ఈ విస్తరాకులు పడగానే ఆమెకు ధ్యాన భంగమైంది. వెంటనే వెంగమాంబను ఆ వేంకటేశుడు ఆవహించాడు. వెంగమాంబ ఆగ్రహోదగ్రురాలై ’పాపీ! నేటితో నీ వంశం సరి! సమూలంగా నశించు గాక!” అంటూ శపించారు. ఒక్కసారిగా ఎక్కడి వారక్కడే రక్తం కక్కుకుంటూ చతికిల బడ్డారు. వారిలో అర్చకుడి కుమారుడు ఒక్కడే కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి వెంగమాంబను శరణువేడాడు. ఆమె శాంతించి ’ఇప్పటి నుంచి మీ వంశంలో ఒక్కొక్కడు మాత్రమే మిగులుగాక’ అంటూ శాప తీవ్రతను తగ్గించారు.
No comments:
Post a Comment