What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 October 2014

ముళ్ళతోను, తుప్పలతోను నిండివున్న అడవిలో పాదరక్షలు లేకుండా నడవడం అసాధ్యం

ముళ్ళతోను, తుప్పలతోను నిండివున్న అడవిలో పాదరక్షలు లేకుండా నడవడం అసాధ్యం. అడవి అంతా తోలుచేత కప్పబడివుండే పక్షంలో అలా నడవవచ్చు. లేదా మన పాదాలకు పాదరక్షలు ధరించినా నడవవచ్చును. అడవినంతా తోలుచేత కప్పడం అసాధ్యం, కాబట్టి మనమే పాదరక్షలు ధరించడం వివేకం. సంసారంలో మానవుడు అంతులేని కోరికలతో బాధపడుతున్నాడు. వాటినుంచి తప్పించుకోవడానికి రెండే మార్గాలున్నాయి. సమస్తమైన కోరికలను తీర్చుకోవడం లేదా వాటినన్నిటినీ పరిత్యజించడం. కానీ కోరికల నన్నిటినీ తీర్చుకోవడం అసంభవం; ఎందుకంటే ఒక కోరికను తీర్చుకోనేటంతలో మరొకటి తలెత్తుతుంది. కాబట్టి సంతుష్టితో, జ్ఞానంతో కోరికలను అణచుకోవడమే వివేకం.
ఒక గద్ద ముక్కున చేపను కరచుకొని ఎగిరిపోతూంటే అనేక కాకులు, గద్దలు దాని వెంటబడి అరుస్తూ, ముక్కులతో పొడుస్తూ ఆ చేపను లాగుకో ప్రయత్నించసాగాయి. అది ఏ వైపు మళ్ళినా కాకులూ గద్దలూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ బాధపడలేక ప్రాణం విసిగి ఆ గద్ద ముక్కునవున్న చేపను జారవిడిచింది. వెంటనే మరో గద్ద దాన్ని ముక్కున కరచుకొంది. మరుక్షణమే ఆ కాకులూ, గద్దలూ చేపను కరచుకొన్న రెండవ గద్దను వెంబడించసాగాయి. మొదటి గద్ద ఆ బాధలేకుండా ఒక చెట్టుకొమ్మ మీద వాలి శాంతంగా కూర్చుంది. దాని ప్రశాంత స్థితిని చూసి అవధూత దానికి నమస్కరించి ఇలా అన్నాడు: “ఓ పక్షి రాజమా! నువ్వే నా గురువు. ఐహిక విషయాల భారాన్ని విడవనంత దాకా మానవుడు సంసార బాధలనుంచి విముక్తుడు కాడనీ, శాంతిని పొందలేడనీ నువ్వు నాకు బోధిస్తున్నావు.”
- శ్రీరామకృష్ణ బోధామృతం నుంచి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML