What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 29 October 2014

కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు ఈశ్వరుడితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకోవాలి

కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు ఈశ్వరుడితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకోవాలి. ఆ అనుబంధాన్ని స్మరించకుండా ఏం చేసినా యాంత్రికమైపోతుంది. ఏదైనా ప్రేమతో చేసినదై ఉండాలి తప్ప, ఏ భావనా లేకుండా చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. భగవంతుడిని మనం ప్రేమిస్తే...పరమేశ్వరుడు మనని కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇది అవగాహన అయిననాడు భగవంతుడికి, మనకు ఉన్న అనుబంధం మన మనసుకు తెలుస్తుంది. పూజకు కూర్చున్నా, మామూలుగా స్మరించినా ఒంట్లో పులకరింతలు కలుగుతాయి. "కర్మ తత్ జడం" అంటారు రమణ మహర్షి. మనసు ప్రధానం. ఇది భగవంతుని దగ్గరకు మనసును చేర్చే సాధనాలే పువ్వులు, ఉపచారాలు. మనసు లొంగకుండా యాంత్రికంగా, "ఓం ఉదరవే నమః, ఓం ఊర్దాయ నమః, ఓం ఊర్ధలింగవే నమః" అని పువ్వులొక్కటే వేస్తూ పోతే ప్రయోజనం ఉండదు. ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్త కాదు. ఆయన సృష్టిలోనిదే ఆ పువ్వు. ఈశ్వరుడిది కానిది, మనదైనది ఈలోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయన ఉచ్చిష్టమే. ఆయన సృష్టిలోనివే. ఆయన సృష్టిలోనివే అయినా మనం వాటికి ప్రేమను కలిపి ఇస్తే పరవశించిపోయి తీసుకుంటాడు.
మీకో ఉదాహరణ చెబుతాను. భగవంతుడికి నైవేద్యం పెట్టిన చక్కర పొంగలిని తల్లి కొడుకుకి పెడుతుంది. ఆ కొడుకు చాలా మెచ్చుకుంటాడు. 'అమ్మా! నువ్వు కూడా తిను...' అని నోటిలో పెడతాడు. అప్పుడు ఆ తల్లి ఆనందానికి హద్దులు ఉండవు. భర్త దగ్గరికి వెళ్లి, "ఏమండీ, ఇవాళ వాడు చక్కేరపొంగలి చాలా బాగుందని నాకు పెట్టి తరువాత వాడు తిన్నాడు, ఫరవాలేదు, పరమేశ్వరుడు మనకు మంచి కొడుకునిచ్చాడు..." అని మురిసిపోతుంది. కొడుకు చక్కెర పొంగలి చేయలేదు. దానికి కావాల్సిన దినుసులు కూడా వాడు సంపాదించలేదు. కానీ వాడు పెట్టిన చిన్న ముద్దతో అమ్మ మురిసిపోతుంది. అమ్మలాగానే ఇన్ని బ్రహ్మాండాలను సృష్టించి, అందరికీ శరీరాల్నిచ్చిన పరమేశ్వరుడు, భక్తితో ఒక్క పువ్వును పాదాల మీద వేస్తే మురిసిపోతాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML