What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 October 2014

యుగాలు నాలుగు అని మనకి తెలిసిన విషియమే..

యుగాలు నాలుగు అని మనకి తెలిసిన విషియమే...ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం ఉంటుంది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో అర్చనాదులు యుగ ధర్మాలు, ఆయకాలలో ఆయా యుగధర్మాలను అనుసరించే జీవనయానాన్ని సాగించాలని అంటారు.
మరి, ఈ కలియుగ ధర్మం ఏంటీ?
కృత, త్రేతా, ద్వాపరయుగాలలో వేటినైతే పాటించి లబ్ది పొందామో, వాటి అన్నింటి ఫలితాన్ని భగవానుని సంకీర్తనల ద్వార కీర్తించి పొందగలమన్నది పెద్దలవాక్కు. ఇది నిజం.
ఒకసారి, ఈ విషియాన్ని గురించే శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం " తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని....." ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?
" నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని.....ఆ భక్తుడే భీష్మపితామహుడు" అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.
అవును....భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కద అని అన్నారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML