What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 29 October 2014

కాలము అత్యంత బలవత్తరమైనది.

కాలము అత్యంత బలవత్తరమైనది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు 'కాలః కలయతామహం' అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. వ్యాసభగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు 'కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుహ్ఖయో:! నరాణాం పరతంత్రానాం పుణ్య పాపానుయోగతః!! అని. ఇవ్వాళ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు గతంలో ఏ శరీరంలో ఉన్నాడో? చేసిన పాప పుణ్యములు అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపముగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవస్వరూపముగా పోవడానికి సుఖము, రెండిటినీ ఇవ్వాలి. అందుకే ధూర్జటి: నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా! అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరునియొక్క కృపవలననే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. అది ఈశ్వర స్వరూపంగా ఉండి సుఖదుఃఖముల రూపములో పాపములను అనుభవింప చేసిక్ దానివలన కంటికి కనపడనటువంటి ఈశ్వరునియొక్క ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదములయందు నిరతిశయమైనటువంటి భక్తి పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తీ ధన్యాత్ముడు. అందుచేతనే ఋషులు కాలాన్ని విభాగం చేశారు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషులకు ఋణపడిపోయాము మనం. ఋషిఋణం తీరాలంటే ఋషిప్రోక్తమైనటువంటి వాజ్ఞ్మయాన్ని చదువుకోవాలి. చదవడం రాని వారు రోజూ ఒక పుష్పం వాటిమీద ఉంచాలి. అవి చేయనినాడు ఋషిఋణం తీరదు. అటువంటి ఋషి కాలాన్ని విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకు యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశారు. అందుకే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు దక్షిణాయనము, ఉత్తరాయనము అను రెండు పేర్లతో నడుస్తుంది. వీటిలో దక్షిణాయనము తక్కువనీ, ఉత్తరాయనము ఎక్కువనీ భావన చేయకూడదు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ’కొన్ని కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేస్తూ బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమందు ఈశ్వరునియందు ఐక్యం అయ్యేటటువంటి స్థితి దక్షిణాయనం" అన్నారు. యదార్థమునకు ఉత్తరాయనం కన్నా దక్షిణాయనం చాలా గొప్పది ఎందుచేతననగా దక్షిణాయనం ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధన చేయడానికి యోగ్యమైన కాలము.
ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కిందకాండ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. 'సవేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీరః పరవీరహన్తా. మనస్సమాధాయ మహానుభావో జగామ లఙ్కాం మనసా మనస్వీ' కార్తీకమాస వైభవం ఆశ్వయుజ మాసపు చిట్టచివరి తిధిలో ఉంది. ఆశ్వయుజ అమావాస్యనే ప్రేత అమావాస్య అంటారు. ప్రతి అమావాస్యకి ప్రదోష కాలానికి పితృ దేవతలు వస్తారు. అందుకే అమావాస్య సాయంకాలం అన్ని పూజలకన్నా ముందు పూజ దివిటీ కొట్టడం. ఇది మగపిల్లలు చేయాలి. ఆడపిల్లలు చేయరాదు. వారు గోగు కర్ర మీద జ్యోతి వేసి ఒత్తి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. 'నాన్నగారూ నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను. ఇవాల్టి తిధిని నేను జరుపుకొని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని అంతరంగమందు పొందుతాను. జీవుడు ఉన్నతిని కొరకు. బాహ్యమునందు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వయుజ మాస వైభవాన్ని. కాబట్టి నేను పాటిస్తాను. మీరు బయలుదేరండి చీకటి పడుతోంది కాబట్టి వెలుతురు చూపిస్తాను' అని జలతర్పణ చేయకుండా దివిటీ చూపించే తిథి ఆశ్వయుజ అమావాస్య. శరీరాన్ని మనకి ఇచ్చి తమ శరీరాన్ని విడిచి పెట్టిన పితృ దేవతలు జ్యోతిస్వరూపులై అంతరిక్షమునందు ప్రయాణం చేస్తారు. వారిని గౌరవించవలసిన అవసరం ఒక కొడుకుగా నీకు ఉంది. ఆశ్వయుజ కార్తీకములు అత్యంత ప్రమాదకరమైన నెలలు. ఉపాసనకు ఎంత గొప్పతిధులో బాహ్యమునందు అంత ప్రమాదకరమైన నెలలు. శరదృతువులో ఆశ్వయుజ మాస ప్రారంభంలో యమధర్మరాజుయొక్క దంష్ట్ర బయటికి వస్తుంది. కార్తీక మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు. మళ్ళీ చైత్ర మాస ప్రారంభంలో దంష్ట్ర బయటికి వస్తుంది. వైశాఖ మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML