What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 September 2013

శ్రీ కృష్ణుడు మంది ని వివాహం చేసుకోవటం తప్పు కాదా ?? దేవుడి ఉంది అలా ఎందుకు చేసేడు ???

 శ్రీ కృష్ణుడు మంది ని వివాహం చేసుకోవటం తప్పు కాదా ?? దేవుడి ఉంది అలా ఎందుకు చేసేడు ???
" నరకాసురుడు అనే రాక్షసుడు 16000మంది స్త్రీలను చెరబట్టి తన చెరసాలలో భందించాడు. అప్పుడు కృష్ణుడు నరకాసురుని చంపి ఆ స్త్రీలందరిని ఆ చెరనుండి విడిపించాడు. అయితే పరపురుషుని చెరలో ఉండి బయటకు వచ్చిన స్త్రీలందరు తమకు సమాజంలో ఎటువంటి విలువ ఉండదని, తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, తమకు పెళ్ళిళ్ళు కావని, తమకు చావే శరణ్యం అని కష్ణునితో మొరపెట్టుకున్నారు.

అపుడు కృష్ణుడు వారికి సమాజం నుండి వచ్చే చిన్నచూపు నుండి రక్షించడానికి, వారికి సోషల్ స్టేటస్ ను కల్పించడానికి వారినందరిని పెండ్లాడి పట్టపు రాణులుగా చేసుకున్నాడు. ఇందులో కృష్ణుడు చేసిన త్యాగం ఉంది కానీ అతని స్వార్థం లేదు
  నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్య లొని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు.తన రాజ్యములొని ప్రజలందరిని ఎంతో చక్కగ పరిపాలించేవాడు.ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.తర్వాత ద్వాపరయుగములొ, అతనికి పక్క రాజ్యమైన శోణితపురము కు రాజైన బాణాసురునితో స్నేహము ఎర్పడుతుంది.బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడమును నిరసించేవాడు.అతని దృష్టిలొ స్త్రి ఒక భోగవస్తువు.అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ అపేవేసినాడు.ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు.ఆ విధముగా 16,0000 మంది రాకుమార్తెలను బంధించాడు.

శ్రీకృష్ణుడు నరకాసురిని మీదకు దండయాత్రకు వెళ్ళుట:

ఆ విధముగా అహంకరిచి ప్రవర్తిస్తున్న నరకసురుడు ఒక సారి స్వర్గము మీద దండయాత్ర చేసి దేవతల కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను,దేవమాతను అవమాన పరుస్తాడు.అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారము అయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని సంహరించమని ప్రార్ధిస్తారు.అదే సమయములొ భూదేవి సత్యభామ రూపములొ అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడి ఉంది.కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ కూడా గుర్తులేవు.ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది.దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు.అక్కడ వారు విడిది చేసిన ప్రాంతాన్ని అశ్వక్రాంత అని పిలుస్తారు.అప్పుడు శ్రీక్రిష్ణుని కి నరకాసురునికి మధ్య ఘోర యుధ్ధము జరౌగుతుంది.కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావము వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు.అందువలన శ్రీకృష్ణుడు యుధ్ధమధ్యలో మూర్చపొయినట్లు నటిస్తాడు.కళ్ళముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణము వేస్తుంది.ఆ బాణము దెబ్బకు నరకాసురుడు చనిపోతాడు.ఆ విధముగా నరకాసురుడు తన తల్లి చేతులలోనే మరణిస్తాడు.ఈ విధముగా నరకాసురుని సంహరం జరుగుతుంది.అప్పుడు 16,000 మంది రాకుమర్తెలు మమ్మలనందరిని నీవే వివాహమాడమని ప్రార్ధిస్తారు.దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడతాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML