పతంజలి
యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు,
స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో
తెలిపాడు. అంతేకాక పాణినిరచించిన అష్టాధ్యాయి కి భాష్యాలు కూడా
రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి
కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి [1][2][3] "యోగ సూత్రాలు" గ్రంథంతో
బాటుపాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయి కి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో
యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ ప్రపంచం బారత దేశంలో
పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ)రాజయోగం బహుళ ప్రచారంలో కి
వచ్చింది.
చరిత్ర
క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా
పతంజలిని ఆధునిక పాశ్చాశ్చ చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ
పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా
అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే!
భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో
పూర్వీకులన్నది కాదనలేని సత్యం.
యోగ సూత్రములు
పతంజలి రచించిన యోగ
సూత్రములలో 8 స్థాయిలు ఉన్నాయి. వీటినే స్థితులు అని కూడా అంటారు. గ్రంథ
రూపంలో 8 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. అవి 1)యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ
5) ప్రత్యాహార 6) ధారణ 7)ధ్యాన సమాధి అనేవి.
ప్రతీ మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీమండలాలు 6 ప్రధానంగా ఉంటాయని
పతంజలి సిద్ధాంతీకరించాడు. మానవుడిలో వుండే ప్రాణ శక్తి కారణంగానే అతడు
సజీవంగా ఉండగలుగుతున్నాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా
ప్రేరేపించటం (ప్రచోదనం చెందించటం) వలన మానవ శరీరంలో సహజంగా శక్తి
వెలువడుతుంది. ఈ వెలువడే శక్తి కుండలినీ శక్తి, కుండలినీ శక్తిని
ప్రేరేపించడం వలన మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే కాక ఆత్మజ్ఞానం కలిగి
సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడని పతంజలి చెప్పాడు.
పతంజలి చెప్పిన మూడో స్థాయి ఐన "ఆసన" ను దానికి ముందు చెప్పబడిన యమ, నియమ
సూత్రాలను క్రోడీకరించి ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో
ఎన్నో రకాల యోగాభ్యాస ప్రక్రియలను యోగాసనాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి
సామాన్య ప్రజలకు శిక్షణనిస్తున్నారు. దీనిద్వారా తీవ్ర ఒత్తిడితో జీవితాలు
గడుపుతున్న ఆధినికులు ఎంతో ప్రశాంతతను పొందుతున్నట్లు పరిశోధనల్లోనూ,
స్వానుభవాలతోనూ అంగీకరించటం విశేషం.
పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)
1. యమము : అస్తవ్యస్తంగా, గజిబిజిగా ఉండే మనస్సును, శరీరాన్ని ఒక నిర్దిష్ట పద్దతిలో క్రమబద్దీకరించే ప్రక్రియనే "యమము" అందురు.
2. నియమము : శరీరాన్ని మనస్సునూ, యోగాభ్యాసానికి సిద్ధం చేయటానికి ఆహారం,
అలవాట్లు మొదలైన వాటిల్లో అనవసరమైన నియమాలు ఏర్పరిచే క్రమశిక్షణ తో ఉండటం.
3. ఆసనం: ఆసనం అంటె యిప్పుడు పాశ్చాత్యులలో ఉన్న భౌతిక అవసరాలైన హలాసనం,
గరుడాసనం, శీర్షాసనం యిలా అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు.
నిజానికి ఈ అవరసాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు.
నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్యతో సంధానం చేసి స్థిరంగా
ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.
4. ప్రాణాయామం: శరీర
స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. శ్వాసను గమనించడం, శ్వాసతో
ధ్యానం చేయడం. వంటి శ్వాసక్రియా యోగ పద్ధతులన్నీ ఈ ప్రాణాయామం విభాగంలోకి
వస్తాయి.
5. ప్రత్యాహారం : శరీరం కన్నా మానవుడు వేరు అన్న సత్యాన్ని
భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు. పాశ్చాత్యులు కూడా ఈ సత్యాన్ని
అంగీకరించగలిగితే పతంజలి చెప్పిన "అస్టాంగయోగ" విశేషాలు అర్థమవుతాయి.
లేకపోతే యిదేదో కల్పిత రచనగానే పొరబడే అవకాశం ఉంది. ఇంతకూ ప్రత్యాహారమనగా
వెనుకకు తిప్పడం అని అర్థం. అంటే పరిపరి విధాల పరుగులెత్తే మనస్సును మరల్చి
హృదయంలో ఉండే ప్రజ్ఞతొ అనుసంధానం చెయ్యడం ప్రత్యాహారం.
6. ధారణ:
సర్వాంతర్యామి అయిన భగవాంతునిలో మనసు నిలపడమే ధారణ . సాదారణంగా మనస్సు
క్షణకాలం కూడా ఒక విషయం మీద స్థిరంగా ఉండదు. అలాటి చంచలమైన మనస్సుకు ఒక
క్రమబద్దమైన యోగాభ్యాస ప్రక్రియ ద్వారా స్థిరత్వం కలిగించి స్ర్వాంతర్యామి
యందు లగ్నం చెయడమే ధారణ.
7. ధ్యానము : సర్వాంతర్యామి యందు లగ్నం
చేయబడిన మనస్సు యితర పాపంచిక విషయాలు గుర్తు రానంతగా ఒకే విషయం నందు
(భగవంతుని యందు) ప్రశాంతమైన స్థితిలో నిలిచి ఉండటాన్ని "ధ్యానస్థితి"
అంటారు.
8. సమాధి : సమాధి అంటే సిద్ధించడం, ఏ లక్ష్యం కోసం సాధకుడు
అష్టాంగ యోగాన్ని అవలంబించి, అనుసరించి సాధన చేశాడో, ఆ లక్ష్యాన్ని
చేరుకోవడం లేదా సాధిచ్మిన స్థితిలో ఉండటాన్నే సమాధి స్థితి అన్నడు పతంజలి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత
అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు
అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో
కూడా చాలా మందికి తెలియనివి.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినో పతంజలి
తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో
ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే
అని చెప్పవచ్చు.
భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ
విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంధాన్ని ప్రసాదంగా
అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.
No comments:
Post a Comment