శ్రీమతి డొక్కా సీతమ్మగారు
అన్ని
దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. అటువంటి అన్నదానానికి
పెట్టింది పేరు శ్రీమతి డొక్కా సీతమ్మగారు. నిరతాన్న ధాత్రి అన్న బిరుదు
గడించారు.సీతమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
నిరుపేదలకి అన్నదానం చేసే అలవాటు ఆవిడకి బాల్యం నుంచే వంటబట్టింది. పెళ్ళి
తర్వాత కూడా భర్త శ్రీ డొక్కా జగన్నాథం గారి నుంచి ప్రోత్సాహం లభించింది.
కుల,మత,ప్రాంత బేధా భావన లేకుండా, రాత్రి పగలు అనే భావన లేకుండా ఆకలితో
ఉన్నవారి ఆకలి తీర్చటమే ఆవిడ ఆశయంగా భావించేది. ఆవిడ అన్నదాన గుణాన్ని చూసి
బ్రిటీషు రాజు సైతం ముగ్ధుడై తనని సన్మానించటానికి ఇంగ్లాండుకు
ఆహ్వానించాడు. కాని తను సున్నితంగా తిరస్కరించారు. అందుకని తాను ఉండే
గన్నవరంలోనే పెద్ద సన్మాన సభ ఏర్పాటుచేసి ఘనంగా సత్కరించాడు.
ఓర్పుతో,శ్రద్ధతో, వినయంగా అతిథులకి,అభ్యాగతులకీ కొసరి కొసరి మరీ
వడ్డిచ్మ్హి ఆకలి తీర్చటంలోనూ సీతమ్మగారికి ఎవరూ సాటిరారు. ఒకసారి తాను
ఉండే ఊరికి పెద్ద వరద వచ్చింది. జనాలు బయటకి రావటానికే భయపడుతున్న సమయం. ఆ
సమయంలో ఎవరో ఒకతను ఏటికి అవతలవైపు చిక్కుకుని పోయాడు. ఆకలిబాధ భరించలేక
కేకలు పెడుతున్నాడట. పాపం అది గమనించిన సీతమ్మగారు ఆ అర్థరాత్రివేళ
అప్పటికప్పుడు వంట చేసుకొని పడవవాడిని బ్రతిమిలాడుకొని ఏటిగట్టు దాటి
వెళ్ళిమరీ అతని ఆకలి తీర్చిందట. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. సీతమ్మగారి
ఇటువంటి గొప్పతనాన్ని మెచ్చి అప్పటి ప్రభుత్వం అవార్డ్ ఇవ్వటానికి 1902లో
ఢిల్లీకి ఆహ్వానించారట. కాని తాను ఆ అవార్డ్ తీసుకునే సమయంలో ఎక్కడ తన
అన్నదానం ఆగిపోతుందో అనే భయంతో డిల్లీకి వెళ్ళలేదట.
అప్పటికీ ఇప్పటికీ డొక్కా సీతమ్మగారి పేరు ఒక్క గన్నవరంలోనే కాదు సర్వత్రా మారుమ్రోగుతూనే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో '
No comments:
Post a Comment