What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 27 April 2013

దేశమంతా మోడీ వెంటే...


గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి శుక్రవారం యోగా గురు బాబా రాందేవ్‌ మద్దతు లభించింది. మోడీకి సాధువుల మద్దతు లభించడం ఇదే మొదటిసారి. రాందేవ్‌ నూతన పాఠశాల ‘ఆచార్య గురుకులం’ను మోడీ ప్రారంభించారు.
గుజరాత్‌ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ--

''..భారత జాతిని సాధువులు, మతగురువులు నిర్మించారు. అంతేకానీ రాజకీయ నాయకుడు కాదు. ఈ వేదికమీది నుంచి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏ మత పెద్ద కూడా నన్ను ఇంతవరకూ ఏదీ కోరలేదు. హరిద్వార్‌లో సాధువులను కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేనీరోజు ఎంతో సంతోషిస్తున్నాను..’ బాబా రాందేవ్‌ - ‘ఆయనది ఒక అద్భుత జీవితం. ఆయనకు ఓ లక్ష్యం ఉంది. జాతి నిర్మాణంలో ఇలాంటి సాధువులకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ సాధువులు ఏమీ చేయరని గతంలో ప్రజలు అనేవారు. ఇప్పుడు వీరు సమాజానికి ఎంతో చేస్తుంటే, ఆ ప్రజలే వారిపై ఆరోపణ చేస్తున్నారు. లౌకిక కార్యకలాపాల్లో ఎందుకు పాలుపంచుకుంటున్నారని అడుగుతున్నారు..''. రాందేవ్‌ చర్యల వెనక ఏ దురుద్దేశాలూ లేవు...‘రాందేవ్‌, నేనూ కవలలం. మేం ఒక విధమైన లక్ష్యాలున్నవాళ్లం. నేను ఏదీ కోరడం లేదు. కానీ ఈ దేశం ఢిల్లీలో ఉన్నవారి నుంచి సమాధానాన్ని కోరుతోంది..’ ‘నాకు ఏ కలలు ఏ ఆశలు లేవు. నాకున్నది ఒకే ఒక్క కల. అది ప్రజలకు సేవచేయడం..’నని అన్నారు..@ బహుజన బంధు


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML