గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి శుక్రవారం యోగా గురు బాబా రాందేవ్ మద్దతు లభించింది. మోడీకి సాధువుల మద్దతు లభించడం ఇదే మొదటిసారి. రాందేవ్ నూతన పాఠశాల ‘ఆచార్య గురుకులం’ను మోడీ ప్రారంభించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ--
''..భారత జాతిని సాధువులు, మతగురువులు నిర్మించారు. అంతేకానీ రాజకీయ నాయకుడు కాదు. ఈ వేదికమీది నుంచి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏ మత పెద్ద కూడా నన్ను ఇంతవరకూ ఏదీ కోరలేదు. హరిద్వార్లో సాధువులను కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేనీరోజు ఎంతో సంతోషిస్తున్నాను..’ బాబా రాందేవ్ - ‘ఆయనది ఒక అద్భుత జీవితం. ఆయనకు ఓ లక్ష్యం ఉంది. జాతి నిర్మాణంలో ఇలాంటి సాధువులకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ సాధువులు ఏమీ చేయరని గతంలో ప్రజలు అనేవారు. ఇప్పుడు వీరు సమాజానికి ఎంతో చేస్తుంటే, ఆ ప్రజలే వారిపై ఆరోపణ చేస్తున్నారు. లౌకిక కార్యకలాపాల్లో ఎందుకు పాలుపంచుకుంటున్నారని అడుగుతున్నారు..''. రాందేవ్ చర్యల వెనక ఏ దురుద్దేశాలూ లేవు...‘రాందేవ్, నేనూ కవలలం. మేం ఒక విధమైన లక్ష్యాలున్నవాళ్లం. నేను ఏదీ కోరడం లేదు. కానీ ఈ దేశం ఢిల్లీలో ఉన్నవారి నుంచి సమాధానాన్ని కోరుతోంది..’ ‘నాకు ఏ కలలు ఏ ఆశలు లేవు. నాకున్నది ఒకే ఒక్క కల. అది ప్రజలకు సేవచేయడం..’నని అన్నారు..@ బహుజన బంధు
No comments:
Post a Comment