భాషలెన్నిటిలో నైన భావమోకటె
వేషములలోన జిక్కని విధమేఱంగు
పోషకుండని తలంచుట పొందుగాదు
దోషమున్న నేఱంగుము తొలుత వేమ
మనలోని భావాన్ని ఎదుటవారికి వ్యక్తపరిచేందుకే భాషలున్నాయి. అలాగే ఆ భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన అందరివాడే ! తను అందరివాడిని అని చెప్పెందుకే ఆ స్వామి అనేక అవతారాలతో మన ముందుకోస్తున్నాడు. అందరినే పోషించే దేవుడు నన్ను కూడా రక్షించడా? అని అనుకోకుడదు. ఎందుకంటే తన తప్పును తెలుసుకోనివాడిని ఆ సర్వేశ్వరుడు. అతడు తన తప్పును గ్రహించే అంతవరకు పట్టించుకోడు. తమ తప్పులను తెల్సుకొని ,ఆ స్వామిని..ఆ పరమాత్మని శరణు వేడుకున్నప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఉన్నచోటుకేవచ్చి మనకు ఆయా సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాడన్నది పలు ఉదాహరణల ద్వారా తెలుస్తోంది. అందుకే ఆ సర్వేశరుని మనసారా ప్రార్థించి , ఆయన కరుణకు పాత్రులము అవుదాము. మన పెద్దలు చెప్పినట్లుగా గాల్లో దీపం పెట్టి ,చేతులు అడ్డం పెట్టకుండా, దేవుడా కాపాడమంటే ఆయన మాత్రం ఏం చెయ్యగలడు. మన ప్రయత్నం అంటూ ఒకటి ఉండాలి కదా. మనలోని ప్రయత్నలోపమనే తప్పును గ్రహించి ఆయన సహాయాన్ని అర్ధించాలి. ఆ స్వామి మనలను తప్పకుండా కరుణిస్తాడు.
No comments:
Post a Comment