What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 18 May 2014

పూర్వం దాక్షిణాత్యంలో పురందరమనే నగరంలో

పూర్వం దాక్షిణాత్యంలో పురందరమనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక యాగాలు చేసినా, ఎన్ని సత్కర్మలు చేసినా, ఎంత అతిథిపూజలు చేసినా ఆత్మజ్ఞానం కలుగలేదనే అసంతృప్తితో మనశ్శాంతి కరువై కుంగిపోతూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక సాధుపుంగవుడు విచ్చేశాడు. అతణ్ణి అన్నివిధాలా పూజించి, నాకు ఆత్మజ్ఞానోపాయాన్ని తెలియచెప్పాల్సిందిగా వేడుకున్నాడు. మనశ్శాంతికి మార్గం చూపించాల్సిందిగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు, "నాయనా! చింతించకు. సౌపురం అనే ఊరిలో మిత్రవంతుడు అనే ఒక పశువుల కాపరి ఉన్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళు" అని చెప్పి పంపాడు. అక్కడ మేకలు కాచుకుంటున్న మిత్రవంతుని వద్దకు వెళ్ళి, సాధువు పంపగా వచ్చానంటూ సంగతి చెప్పాడు. అప్పుడు మిత్రవంతుడు ఈ విధంగా చెప్పాడు.

"నేను ఒకనాడు మేకలను మేపుతుండగా ఒక పెద్దపులి వచ్చింది. నేను, నా వందలాది ప్రాణులు భయంతో కకావికలై పరుగెత్తాం. అలా పరుగెడుతూ ఉండగా ఆ స్థలమహాత్మ్యం ఏమిటో గానీ నా మందలోని ఒక మేక, ఆ పులి స్నేహంగా ప్రేమగా ఒక చోట కూర్చుని ఉండడం చూశాను. విస్మయంతో చుట్టూ పరికించాను. అక్కడొక వానర శేష్ఠుడు కనిపించాడు. అతని వద్దకు వెళ్ళి, "వానరశ్రేష్ఠా! లోకంలో ఇలాంటి వింత ఎన్నడూ చూడలేదు. పులిమేకల మధ్య ఇంతటి సఖ్యం వింతగా ఉంది. కారణమేమిటి?" అని అడిగాను.

అప్పుడా వానరం, "మిత్రమా! ఇక్కడికి సమీపంలో ఒక దేవాలయం ఉంది. అక్కడ సుకర్మ అనే వ్యక్తి జ్ఞానప్రాప్తి కోసం ఈశ్వరోపాసన చేయడం ప్రారంభించాడు. అతనికి మేలు చేకూర్చాలని ఒకనాడు ఓ అతిథి వచ్చాడు. ఒక శిలాఫలకం మీద భగవద్గీత రెండవ అధ్యాయాన్ని చెక్కి 'సుకర్మా! ప్రతిదినం ఈ గీత రెండో అధ్యాయాన్ని అభ్యాసం చెయ్యి' అని చెప్పి అంతర్ధానమయ్యాదు.

అప్పటినుంచి సుకర్మ ఆ అతిథి చెప్పినట్లే గీత ద్వితీయ అధ్యాయాన్ని పారాయణం చేయసాగాడు. కొంతకాలానికి అతని చిత్తం నిర్మలమై, ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. అప్పటినుండి అతడు అడుగుపెట్టిన ప్రదేశమంతా పునీతమై, రాగద్వేష రహితమై, క్రూరజంతువులు కూడా కామక్రోధాలు జయించి అన్యోన్యంగా మెలగుతూ ఉంటున్నాయి. దాంతో, నేనుకూడా ఆ శిలాఫలకం వద్దకు వెళ్ళాను. ఆ మహనీ్యుని అనుగ్రహంతో గీత రెండో అధ్యాయాన్ని అభ్యసించాను. తద్వారా ఆత్మజ్ఞానానుభవం పొందాను. కనుక నువ్వు కూడా వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందు!"

మిత్రవిందుడు చెప్పినట్లుగా దేవశర్మ సైతం శిలాఫలకం మీది గీతను అభ్యసించి, మననం చేసి, క్రమక్రమంగా ఆత్మజ్ఞానాన్ని పొందాడు. బ్రహ్మపదప్రాప్తిని పొందాడు. కనుక గీత ద్వితీయాధ్యాయఫలం ఆత్మజ్ఞాన ప్రాప్తి అని తెలుస్తోంది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML