ఆంజనేయస్వామి వారు సముద్ర లంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతారాయన.”ఆకాశపర్యంత సంవర్థి’ - ఆకాశం అంటుకునేటట్లు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. అంతపైకి ప్రకాశిస్తున్నాడు. ఆ ముఖమే సూర్య తేజస్సులాగా దేదీప్యమానంగా ఉన్నది. చుట్టూ యేయే ముఖాలున్నాయో వీళ్లకి కనపడలేదు.దేవతలకు మాత్రం గోచరించింది. పైన ఉన్న దేవతలు, ఋషులు దర్శిస్తున్నారట. వాళ్ళకెలా కనిపించింది అంటే "మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణిప్రదీపితోత్తుంగ తరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధీ నన్ కృపజూడు మారుతీ!!" అంటారిక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో. ఇందులో మంత్రం అక్షరములన్నీ నిక్షిప్తం చేశాడాయన. ఇది రచించింది దేనివల్ల రచించగలిగాడు అంటే ఆయన రామమంత్రం కొన్ని కోట్లు చేశాడు. అంతే సంఖ్యలో ఆపదుద్ధారక హనుమన్మంత్ర మూర్తిని ఉపాసన చేసి సిద్ధి పొందాడాయన. అందుకే ఈ రహస్యాన్ని చెప్పగలిగాడు. ఈ శ్లోకాన్ని మంగళ రూప అని ప్రారంభించడంలో హరి మర్కట మర్కట అని చెప్పడంలో మంత్రాక్షరములన్నీ ఉన్నాయి. మంత్రోపదేశం లేకున్నా ఈ శ్లోకం చదువుకున్నా మంత్రం క్రింద లెక్క. అక్కడ ఆయన పంచాస్యుడిగా - అయిదు వదనములు కలవాడిగా దేవతలకు దర్శనమిచ్చాడుట. అందుకు మంత్రమూర్తి దేవతలకీ ఋషులకీ కనపడుతుంది. సామాన్యులకి మాత్రం వానరుడిలాగే తిరుగుతున్నాడు. మళ్ళీ సీతమ్మ దగ్గర ఆయన తన ఉజ్జ్వల రూపాన్ని ప్రకాశింపజేస్తాడు. అప్పుడు అయిదు ముఖాల వాడా అంటే స్పష్టంగా వాల్మీకి వ్రాయలేదు కాదనీ వ్రాయలేదు. కానీ పరశార సంహితలో మాత్రమ్ సీతమ్మ దర్శనం చేసినది పంచముఖాంజనేయ మూర్తిని అని స్పష్టంగా రచించారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment