శ్రీకాకుళం జిల్లా.
శ్రీకాకుళం పట్టణంలోని ఇలిసుపురం ప్రాంతంలో కొలువుదీరిన భద్రమహంకాళి అమ్మవారి అనుపు ఉత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది గతనెల 12న ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమలతో, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు దప్పు వాయిద్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు, విచిత్ర వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు ఆలయం వద్ద ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ముర్రాటలు సమర్పించి మొక్కుకున్నారు.
No comments:
Post a Comment