చింతపల్లి, విశాఖ జిల్లా.
శుక్రవారం ఉదయం ముత్యాలమ్మ అమ్మవారి నూతన ఆలయం, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమ పూజలను నిర్వహించారు.
అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వందలాది భక్తులు హిందూ సంప్రదాయం ప్రకారం సారెను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment