శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మద్దిలేటి, కర్నూలు జిల్లా.
కర్నూలు జిల్లా, బేతంచెర్ల మండలం R.Sరంగాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రం మహిమాన్నితమైనది. ఈ క్షేత్రం నిరంతరం భక్తులతో స్వామివారి మహిమలతో విరాజిల్లుతోంది. భక్తులు ముఖ్యంగా శనివారాలలో ఈ స్వామివారికి తలనీలాలు అర్పించి, మద్దిచెరువు అనే కోనేరులో స్నానమాచరించి మెట్ల మార్గంలో స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారు వెలసిన రోజు ఫాల్గుణశుధ్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం ఆ రోజున భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
నరసింహస్వామి ఒకసారి లక్ష్మీదేవితో పాచికలాడి ఓడిపోయాడట లక్ష్మీదేవి పరిహాసంగా నవ్విందనే కోపంతో స్వామివారు లక్ష్మీనివాసాన్ని వదిలి ఎర్రమల కొండలలోని యాగంటి క్షేత్రానికి వచ్చాడట. కారణం ఏమిటని శివుడు ప్రశ్నించగా నేను కూడా ఇక్కడే ఉంటానని సమాధానమిచ్చి ఈ ప్రాంతంలో ఉడుము రూపం ధరించి సంచరిస్తుండగా ఒక బోయవాడు పట్టుకొనుటకు వెంబడించి అలసిపోయి ఒకచెట్టు క్రింద నిద్రించగా స్వామి కలలో కనిపించి తను శిలారూపంలో ఈ ప్రాంతంలో ఒక పుట్టలో వెలసినట్లుగా అందుకే ఉడుము రూపంతో నిన్ను ఇక్కడకు రప్పించినట్లుగా చెప్పాడట. నిద్రమేల్కొన్న బోయవాడు ఈ ప్రాంతంలో వెదకి పుట్టను కనుగొని తవ్వగా అందులో స్వామివారు విగ్రహరూపంలో దర్శనమిచ్చినట్లుగా చెబుతారు.
No comments:
Post a Comment