What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 December 2015

అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ, చిత్తురు జిల్లా.



అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ, చిత్తురు జిల్లా.

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరాన
తొండవాడ అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు. ఇక్కడ 3 పుణ్యనదులు కలుస్తాయి. అవి స్వర్ణముఖి ,భీమా ,కళ్యాణి .. ఇక్కడి లింగాన్ని అగస్తీశ్వరమహాముని ప్రతీష్ఠించారు కాబట్టి అగస్తీశ్వరలింగం గా ప్రఖ్యాతి. ఇది చాలా ప్రాచీన సాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు. నదీమధ్యలో ఓ మండపము.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.


అగస్థ్య మహర్షి ని దర్శించు కోవటానికి కళ్యాణ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు. ఇక్కడ అగస్థ్య మహర్షి ప్రతిష్ఠిత శివ లింగమే అగస్థీశ్వర స్వామి గా ప్రసిద్ది చెందింది. అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్నన ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు. ఇక్కడ మరో విశేషం కూడ ఉంది. వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. అదే శ్రీ పాదం అని పేరు.







No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML