శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, శ్రీకాకుళం.
శ్రీకాకుళంలో వంశధార నదీతీరాన ఈ ఆలయం ఉండి. ఇది అతి పురాతన మరియు మహిమాన్నితమైనదిగా ప్రసిధ్ధి చెందినది. ఈ ఆలయంనందు శ్రీ ఉమారుద్రకోటేశ్వరుడు ప్రధాన మూర్తిగా భక్తులకు దర్శనమిస్తుండగా, మండపమునందు నవగ్రహాలు కొలువై ఉన్నాయి.
స్థలపురాణం
బలరాముడు ప్రతీష్టించిన పంచలింగ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పబడినది. మహాభారత యుద్దంలో ఎందరో రాజులు, సన్నిహితులు, బంధువులు మరణించిన వార్త విన్న బలరామునికి మనసు కలతచెంది తరుణోపాయం చెప్పమని శ్రీకృష్ణుడిని అడగగా వివిధ పుణ్యప్రదేశాలలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించమని సూచించాడు. ఆ ప్రకారం బలరాముడు ఈ ప్రదేశానికి వచ్చి తన ఆయుధమైన నాగలితో ఒక నదిని ప్రవహింపచేసి ఆ నదీ తీరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించుటకు సిధ్ధమవగా ఆ లింగమునందు రుద్రకోటిగణములు కనిపించటం వలన బలరాముడు ఈ లింగానికి రుద్రకోటేశ్వరునిగా నామకరణం చేసి పూజించినట్లు స్థలపురాణం.
No comments:
Post a Comment