సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి చందనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అప్పన్న నిజరూప దర్శనంతో భక్తులు తరించారు. ఏడాది పొడవునా చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుధ్ధ తదియ నాడు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దీనినే చందన యాత్రగా పిలుస్తారు.
ఉత్సవంలో భాగంగా స్వామివారిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుప్రభాత సేవతో మేల్కొల్పి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య అప్పన్నదేహంపై ఉన్న చందనాన్ని బంగారు వెండి బొరిగెలతో తొలగించి అనంతరం పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక అర్చన నిర్వహించారు.
సుందర దివ్యతేజో స్వరూపుడైన స్వేతవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని కనులారా వీక్షించి భక్తులు పునీతులయారు.

No comments:
Post a Comment