What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 December 2015

వైకుంఠ ఏకాదశి .

వైకుంఠ ఏకాదశి .
. మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుంది.అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజనియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు,కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పండితులు చెబుతున్నారు.ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య ఐదుగా ఉండాలి.కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజువిష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పండుగ ప్రాశస్త్యంముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించేకొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
వైకుంట ఏకాదశి.
ఒకనాటి వైకుంట ఏకాదశినాడు నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు ప్రభు నేను పుట్టిన క్షణం నుంచి మీ నమ స్మరణే చెస్తునాను సంసారం భంధాలలో చిక్కుకొండ సన్యాసం స్వికరించాను మీ భక్త బృందం లో నేనే కదా ఉత్తమ్మ భక్తుడను అన్నాడు నారదుడు, నారాయణుడు చిద్విలాసం చేసి నారదనీ ప్రశ్న కు సమాధానం చెప్తాను కాని ముందు ఈ కథ విను తరువాత నీకే అర్థం అవుతుంది ఒక పల్లెటూరిలో విష్ణుదాసుడు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న తముడు చెల్లి ఉన్నారు అతని సంపాదన పైన వారి కుటుంబం ఆధారపడి ఉంది, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు పూటలా అన్నం వాళ్ళ మనుషులకు పెట్టడానికి 18గంటలు పనిచేస్తుంటాడు చెల్లి కి పెళ్లి చేస్తాడు, తముడు కి వ్యాపారం పెట్టించాడు తల్లి తండ్రులకు మంచి వైద్యం అందించాడు భార్య బిడ్డలకు ఏ కొరత రానీకుండా చుసుకునాడు అతనే నాకు ఇష్టమైన భక్తుడు అనడు విష్ణు దేవులు, నారదుడు ఇలా ఆశ్చర్యం తో ఇలా అడిగాడు ప్రభు విష్ణుదాసుడు ఎలా మీ భక్తుడు అయ్యాడు మీ కోసం ఉపవాసాలు చేయలేదు గుడి గోపురాలు తిరగలేదు అర్చన అభిషేకాలు చేయలేదు మరి ఎలా మీ ఇష్ట భక్తుడు అయ్యాడుఅని ప్రశ్నించాడు నారదుడు నారద నా భక్తుడు కావాలి అంటే నా కోసం గుడి కట్టకర్లేదు ఉపవాసాలు అర్చన అభిషేకాలు యజ్ఞాలు చేయకర్లేదు, ఒకటి చేస్తే చాలు అది ఏమిటి అంటే నా కుటుంభం అంటే విశ్వం నేను ఇచ్చిన భంధాలు అంటే అమ్మ నాన్న భార్య భర్త కొడుకు కూతురు సోదరి సోదరులు ఇలా నేను వేసిన జీవాత్మ సంకెళ్ళను సునితంగా విపుకోవాలి, అది ఎలా అంటే ప్రతి ఒకరి లో నన్ను చూడటం ప్రతి ఒక్క భందానికిన్యాయం చేయటం నేను ఇచ్చిన భంధాలలో నన్నే చూసుకొని వారికీ నిర్వర్తించే భాధ్యతని నా సేవ కైకర్యం అనుకోని నాకు అర్పిస్తే చాలు నేను ఆనందిస్తాను నిరంతం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటె చాలు వారి వెంటే నేను ఉంటాను ఇలానే విష్ణు దాసుడు నాకు ఇష్ట భక్తుడు అయ్యాడు నా పైన నిందలువేయలేదు భందాలను ఇచ్చినందుకు నా పైన చిరాకు చూపలేదు పిలిచినా నేను పలుకనందుకు భక్తి తో భంధలా కర్మలను అనుభవిస్తూ నన్ను ధ్యానించాడు నన్ను శరణు వెడుతూనే వారి కుటుంబ వ్యక్తులకు న్యాయం చేసాడు విష్ణు దాసుడు చేసి చూపిన భక్తి అంటే నాకు ఇష్టం నారదః అన్నారు విష్ణు దేవులవారు. స్నేహితులారా మనకు స్వర్గం నరకం ఎక్కడో లేదు ఎదుటి వారికీ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమనే తిరిగి వస్తుంది ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి వస్తుందిదీనికి మనం భగవంతుడ్ని తిట్టడం లేదా మన భక్తి తో దేవుడ్ని బయపెట్టడం చేయకూడదు మన భందాలను గౌరవిదాం ప్రేమిదాం సేవిదాం భగవంతునికి ఇష్టులం అవుదాం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML