నెమలి, కృష్ణా జిల్లా.
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రమైన నెమలిలోని వేణుగోపాలస్వామిని సోమవారం చందనంతో అలంకరించారు. వైశాఖమాసంలో ఉష్ణతాపం నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు చందనంతో అలంకరిస్తారు. గురువారం వరకు స్వామివారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.
స్వామివారి మాస కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామివారికి కన్యాదానం చేశారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment