ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Sunday, 20 December 2015
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తూర్పు యడవల్లి, పశ్చిమగోదావరి జిల్లా.
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తూర్పు యడవల్లి, పశ్చిమగోదావరి జిల్లా.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో తూర్పు యడవల్లి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ దేవాలయం అతి సుందర కళావైభవంతో 52 అడుగుల రాజ గోపురంతో, 14 అడుగుల ఎత్తుతో సింహద్వారము మరియు ఆలయ ముఖమండపంలో ఉన్న స్థంభాలపై గజరాజులు, నాగమోహిని మొదలగు శిల్పాలు కళావైభవం ఉట్టిపడేలా ఉన్నాయి. ఆలయ పైభాగంలో 12 రాశుల చిహ్నాలు వాటిమధ్య చిన్నికృష్ణుని శిల్పం అత్యంత మనోహరంగా, దేవాలయానికే వన్నెతెచ్చేట్లుగా ఉన్నాయి.
ఈ ఆలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య హస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ గావించబడినది. ఆ తరువాత ఈ దేవాలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానంవారు దత్తత తీసుకొని మరింత అభివృధ్ధి చేశారు.
ఈ ఆలయంలో పాంచరాత్రాగమాను సారము అర్చనాకార్యక్రమములు, ఉత్సవములు జరుపుతారు. నిత్యపూజలతో పాటు శ్రీరామనవమికి కల్యాణ ఉత్సవము, వసంతోత్సవము అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాలనుండి భక్తులు ఎక్కువసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులవుతారు.
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment