కైలాసగౌరి నోము
ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము
నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది. నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు
అని చెప్పింది. ఆ ప్రకారం రాకు కూతురు కైలాస గౌరీ నోము నోచింది. అందుకు
ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి. ఉంపుడు గత్తెల
కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది. భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది.
ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్తే యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార
యాత్ర సుఖంగా జరుగుతుండేది. వారిని చూచినా వారు పార్వతీ పరమేశ్వరులని
ప్రశంసిస్తుండేవారు.
ఉద్యాపన:
పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు
కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి
ఆశీస్సులు పొందాలి.
No comments:
Post a Comment