🌺 విగ్రహారాధన 🌺
'అర్చా' రూపం అంటే శిలా, దారు, లోహములతో తయారైన విగ్రహరూపంలో ఉన్న పరమాత్మ అని అర్థం. మరి ఇప్పుడొక సందేహం కలుగవచ్చు. జీవం లేని విగ్రహారూపంలో పరమాత్మ ఏ విధంగా ప్రవేశిస్తాడు అని. మరీచి మహర్షి. శ్రీవైఖానస ఆనంద సంహిత-విమానార్చనాకల్పంలో, ఈ సందేహానికి చక్కటి వివరణ ఇచ్చారు.
"సర్వాధారం సనాతన మప్రమేయ మచింత్యం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పిః, తిలే తైలం, పుష్పే గంథం, ఫలే రసం, కాష్ఠే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానాం మనసా సంకల్ప్య ఆవాహయేత్ " (శ్రీవైఖానస మరీచి విమానార్చనాకల్పం-31వ పటలం)
సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, నిష్కలుడు అయిన పరమాత్మ - పాలలో నేయివలె, నువ్వులలో నూనెవలె, పుష్పాలలో తేనెవలె, పండ్లలో రసంవలె, కట్టెలలో అగ్నివలె సర్వవ్యాపిగా వుంటాడు. అట్టి భగవంతుని, మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి, ఆవాహనం చేయాలి. ఏ విధంగా అయితే కట్టెలలో, మంటలను గాలి ద్వార జ్వలింపజేయవచ్చో, అదే విధంగా సర్వవ్యాపి అయిన విష్ణువు, ధ్యాన మధనం, భక్తి ప్రపత్తులవలన, సంకల్పబలంవలన విగ్రహంలో ప్రవేశించి, మన పూజలందుకుని మనలను అనుగ్రహిస్తాడు. చక్కటి రూపంతో, విగ్రహ రూపంలో ఉన్న విష్ణుభగవానుని ఆరాధించాలి
No comments:
Post a Comment