What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 November 2022

సంధ్యావందనమునకు చాలా నియమములు ఉన్నవి. అందులో అర్ఘ్యప్రదానం గురించి తెలుసుకుందాము.


సకాలములో అర్హ్యము ఇవ్వలేకున్నపుడు కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తముగా ఒక ప్రత్యేక అర్ఘ్యము విడువవలెను.

అర్ధ్యమునిచ్చునపుడు :

ప్రాతఃకాలమున సూర్యునికి అభిముఖముగ వంగి విడువవలెను. మధ్యాహ్నమున నిలుచుండి విడువవలెను. సాయంకాలమున పడమటి దిక్కునకు తిరిగి కూర్చుండి విడువవలెను.

జాతాశౌచ -మృతాశౌచములందు సంధ్యావందనము అర్ఘ్య ప్రదానమువరకే చేయవలెను.
ఆచమనం నిలువబడిగాని వంగికాని చేయకూడదు. కూర్చుండి ఆచమనము చేయవలెను. తడిగుడ్డతో సంధ్య జపములు చేయకూడదు.

ప్రవాహజలమధ్యలో మాత్రమే తడిగుడ్డ దోషము కాదు. నిలుచుండి ఆచమనాదులు దోషముకాదు.

నీళ్లలో నిలబడి గాయత్రిని జపించకూడదు. ఒడ్డున కూర్చుండి చేయవలెను. జపము మూడు విధములు

1.వైఖరి: ఇతరులకు వినబడునట్లు మంత్రమును ఉచ్చరించుట.

2.ఉపాంశువు: పెదవులు కదిలించుచు శబ్దము బయటికి వినబడకుండా జపించుట.

3.మానసికము: పెదవులు కూడ కదిలించకుండ మనసులో జపించుట

వైఖరికన్న ఉపాంశవు దానికన్న మానసికము శ్రేష్ఠము. 

ప్రకృతిలోని 24 తత్త్వములకు గాయత్రీ మంత్రాధిష్టాన దేవత. పరమాత్మ సకాలమున సంధ్యావందనము చేయువారలకు గాయత్రీ స్వరూప పరమాత్మ సకల శోభములు కలిగించును.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML