అందరికీ నమస్కారం!
భాద్రపద మాసములో *కృష్ణ పక్షము* నందు వచ్చు పాడ్యమి లగాయితు అమావాస్య వరకు పక్షము( 15 రోజులను) *మహాలయ పక్షము* అందురు.
తారీఖు *సెప్టెంబరు 11 నుండి సెప్టెంబరు 25 వరకు*
ఈ *మహాలయ పక్షము* తిధులలో పితృకార్యములను ఆచరిస్తారు.
పితృకార్యములను సరిగా ఆచరించనిచో జాతకమున *పితృదోషములు* ప్రస్పుటముగా కనిపించును.
*పితృ శాపము/దోషము* వలన సంతానము కలగకపోవుట, వివాహము ఆలస్యం అవుట, సంపాదన నిలవకపోవుట, వంశవృద్ధి లేక బాధలు పడుదురు.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
🔻 చిన్న వారు అకాలమరణం పొందడం
🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.
🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.
🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ప్రతి సంవత్సరం పితృకార్యం చెయ్యలేని వారు, దూరప్రాంతములలో నివసించే వారు, కాశీ, గయలలో ఈ కార్యక్రమం చెయ్యలేనివారు ఈ మహాలయ పక్షములో చేసిన విశేష ఫలితం కలుగును.
ఈ మహాలయ పక్షమన బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతర వర్గము వారికి ప్రత్యేకముగా ఈ మహాలయ పక్షములో దాదాపు *ఆరు* ప్రముఖమైన ప్రాంగణములలో, సంగమ ప్రదేశాలలో *రాజమండ్రి*, *నర్సాపురం వశిష్ఠ గోదావరి*, *సిద్దాంతం గోదావరి*, *అంతర్వేది సంగమం*, *కొవ్వూరు గోపాద క్షేత్రం* , *పాదగయ క్షేత్రం (పిఠాపురం)*.
ఈ ప్రాంతాలలో శాస్త్రోక్తంగా *మడిగా* బ్రాహ్మణులకు భోజనముతో పాటుగా ఈ *మహాలయ పక్షములో* కార్యక్రమము నిర్వహించ సంకల్పించాము.
--
kishore always with u....!
No comments:
Post a Comment