పుష్యమి కార్తె
*( తెలుగువారు ముఖ్యంగా తిథి , నక్షత్రం , వర్ద్యం , దుర్ముహూర్తం , రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు... మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాంగం , ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)*
జోతిష్యులు 27 నక్షత్రాలు , గ్రహాల ఆధారంగా జాతకాలు , పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. *కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు.* అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి పుష్యమి కార్తె.
*జులై 20 బుధవారం నుంచి పుష్యమి కార్తె ప్రారంభం*
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉంటాయి. ప్రస్తుతం చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి చేరువలో ఉండటం వల్ల దీనికి పుష్యమీ కార్తె అనే పేరు వచ్చింది.
*27 నక్షత్రాలే 27 కార్తెలు*
1.అశ్వని,
2.భరణి,
3.కృత్తిక,
4.రోహిణి
5.మృగశిర
6. ఆరుద్ర
7.పునర్వసు
8.పుష్యమి
9.ఆశ్లేష
10.మఖ
11.పుబ్బ
12.ఉత్తర
13.హస్త
14. చిత్త
15.స్వాతి
16.విశాఖ
17.అనూరాధ
18.జ్యేష్ట
19.మూల
20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ
22.శ్రావణ
23.ధనిష్ట
24.శతభిషం 25.పూర్వాభాధ్ర 26.ఉత్తరాభాధ్ర
27.రేవతి

No comments:
Post a Comment