What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 30 November 2022

*అరుణాచల శివ

*అరుణాచల శివ*

అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం వివరించుటకు మనకు ఉన్న శక్తి సరిపోదు. సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపమయిన భగవాన్ రమణులు వంటి వారు అక్కడే స్ధిరముగా ఉండిపోయినారు.

అందునా గిరి ప్రదక్షిణం సాక్షాత్ దేవతలు,మునులు, సిధ్దులు వంటివారు చేస్తారు.

*ఇహ లోకంలో ఎటువంటి సమస్య అయినా గిరిప్రదక్షిణ చేయడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది అన్నది అక్షర సత్యం*

ఇప్పుడు మార్గశిర మాసం జరుగుతున్నది. ఈ మాసంలో సాక్షాత్ *అగస్త్య మహర్షి* తమ శిష్యులతో గిరి ప్రదక్షిణ చేస్తారు అని ప్రతీతి.

ఈ పౌర్ణమి (అనగా డిసెంబరు 9, గురువారం)
అలాగే తదుపరి *ఆరుద్రోత్సవం, శివ ముక్కోటి, దత్తాత్రేయ జయంతి*
మార్గశిర బహుళ విదియ *రమణుల జన్మ తిధి*
చాలా అరుదుగా సంభవించే రోజులు. ఈ రోజులలో అరుణగిరి నివాసం, గిరి ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది.

*అసలు ఆయన అనుగ్రహము లేనిదే ఈ రోజులలో అక్కడికి వెళ్లడం జరుగదు*

కావున మేమూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము.మిగిలినది పరమేశ్వరుని అనుగ్రహం.


మీరూ ఈ రోజులను వదలకుండా అచటకు వెళ్లుటకు ప్రయత్నం చెయ్యండి

*దైవజ్ఞ నిట్టల ఫణి భాస్కర్*
Read More

Sunday, 27 November 2022

*శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ*



ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.

*శ్రీ భూవరాహ స్తోత్రం* 

ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే  ౧ 

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్  ౨ 

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్  ౩ 

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే  ౪ 

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః  ౫ 

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః  ౬ 

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ  ౭ 

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః  ౮ 

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః  ౯ 

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్  ౧౦ 

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః  ౧౧ 

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్  ౧౨ 

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

⚜️⚜️⚜️⚜️⚜️⚜️
Read More

శ్రీ శివ మంగళాష్టకం

*శ్రీ శివ మంగళాష్టకం*
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం ॥ 1 ॥

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం ॥ 2 ॥

భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం ॥ 3 ॥

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం ॥ 4 ॥

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం ॥ 5 ॥

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం ॥ 6 ॥

సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళం ॥ 7 ॥

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం ॥ 8 ॥

మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥

ఇతి శ్రీ శివ మంగళాష్టకం |
Read More

ప్రవర ఎలా చెప్పాలి.

*ప్రవర ఎలా చెప్పాలి...*

*1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*
*2) మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*

*కొన్ని  గోత్రాలు మరియు వాటి ప్రవరలు..*

*1. భరద్వాజ :*

ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య

*2. వాథూలస :*

భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య

*3. శ్రీవస్త లేక శ్రీవత్స :*

 భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య

*4. శ్యాలంకాయన :*

 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య

*5. షతమర్షన:* 

ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య

*6. ఆత్రేయ:* 

ఆత్రేయ, ఆర్చనాస,శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య

*7. కౌషిక:*

 విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య

*8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)*

1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య

2. ఖలభవస:

విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయం ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య

*9. విశ్వామిత్ర:* 

విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య

*10. కౌండిన్య:* 

వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య

*11. హరితస:* 

ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య

*12. గౌతమస :* 

ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

*13.ఔద్గల్య (మూడు రకాలు)*

1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్యగోత్రస్య

*14. శందిల్య (మూడు రకాలు)*

1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

*15. నైత్రువకాశ్యప:*

కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య

16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య

*17. కన్వ (రెండు రకాలు)*

1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

*18. పరాసర:* వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య

*19. అగస్త్య:* అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య

*20. ఘర్గి (రెండు రకాలు)*

1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

*21. బాదరాయణ:*

 ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య

*22. కశ్యప (మూడు రకాలు)*

1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య

*23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)*

1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

*24. ఆంగీరస :* 

ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య

*25. గౌతం/గౌతమస :*

 అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

*26. అగ్నివైవశ్వత:*

 ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య

*27. శాంఖ్యాయన:*

 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య

*28. విశ్వామిత్ర:* 

శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర

*29. కపి:* 

ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.
Read More

దుర్గా పంచరత్నం

*:*
       ➖➖➖
           (పరమాచార్య గురువే నమః)

*దుర్గా పంచరత్నం* దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. 


అదే *దుర్గా పంచరత్నం* (శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). 


|| దుర్గా పంచరత్న స్తోత్రం ||

తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్ నిగూఢామ్ ।
త్వమేవశక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 1

ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.

దేవాత్మశక్తిః శ్రుతివాక్య గీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా ।
గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 2

ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.

పరాస్యశక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే ।
స్వాభావికీ జ్ఞానబలక్రియాతే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 3

ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు. 

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్య వచో వివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 4

దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా ।
జ్ఞానస్వరూపాత్మ తయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 5

అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥
Read More

వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన

*వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన*

వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |

భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం!!

పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాస్థితం
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |

*శుభ శుభోదయం*

🙏🙏🐀🙏🙏🐀🙏🙏🐀🙏🙏 
Read More

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏🙏 మాతంగినీకవచం..🙏 (శీఘ్ర ఫలితం ఇచ్చే స్త్రోత్రం)

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏🙏
మాతంగినీకవచం..🙏
(శీఘ్ర ఫలితం ఇచ్చే స్త్రోత్రం)

శ్రీదేవ్యువాచ..
సాధు సాధు మహాదేవ కథయస్వ సురేశ్వర .
మాతంగీకవచందివ్యం సర్వసిద్ధికరన్నృణాం .. 1..

శ్రీ ఈశ్వర ఉవాచ..
శృణు దేవి ప్రవక్ష్యామి మాతంగీకవచం శుభం .
గోపనీయం మహాదేవి మౌనీ జాపం సమాచరేత్ .. 2..

అస్య శ్రీమాతంగీకవచస్య దక్షిణామూర్తిరృషిర్విరాట్
ఛందో మాతంగీ దేవతా చతుర్వర్గసిద్ధయే వినియోగః ..

ఓం శిరో మాతంగినీ పాతు భువనేశీ తు చక్షుషీ .
తోడలా కర్ణయుగలంత్రిపురా వదనం మమ .. 3..

పాతు కంఠే మహామాయా హృది మాహేశ్వరీ తథా .
త్రిపుష్పా పార్శ్వయోః పాతు గుదే కామేశ్వరీ మమ 4

ఊరుద్వయే తథా చండీ జంఘయోశ్చ హరప్రియా .
మహామాయా పాదయుగ్మే సర్వాంగేషు కులేశ్వరీ ..5.

అంగంప్రత్యంగకంచైవ సదా రక్షతు వైష్ణవీ .
బ్రహ్మరంధ్రే సదా రక్షేన్మాతంగీ నామ సంస్థితా .. 6..

లలాటే రక్షయేన్నిత్యం మహాపిశాచినీతి చ .
నేత్రాభ్యాం సుముఖీ రక్షేద్దేవీ రక్షతు నాసికాం .. 7..

మహాపిశాచినీ పాయాన్ముఖే రక్షతు సర్వదా .
లజ్జా రక్షతు మాందంతే చోష్ఠౌ సంమార్జనీకరీ .. 8..

చిబుకే కంఠదేశే తు చకారత్రితయంపునః .
సవిసర్గం మహాదేవీ హృదయంపాతు సర్వదా .. 9..

నాభిం రక్షతు మా లోలా కాలికావతు లోచనే .
ఉదరే పాతు చాముండా లింగే కాత్యాయనీ తథా  10

ఉగ్రతారా గుదే పాతు పాదౌ రక్షతు చాంబికా .
భుజౌ రక్షతు శర్వాణీ హృదయంచండభూషణా .11

జిహ్వాయాం మాతృకా రక్షేత్పూర్వే రక్షతు పుష్టికా .
విజయా దక్షిణే పాతు మేధా రక్షతు వారుణే .. 12..

నైరృత్యాం సుదయా రక్షేద్వాయవ్యాంపాతు లక్ష్మణా .
ఐశాన్యాం రక్షయేద్దేవీ మాతంగీ శుభకారిణీ .. 13..

రక్షేత్సురేశా చాగ్నేయే బగలా పాతు చోత్తరే .
ఊర్ద్ధ్వంపాతు మహాదేవీ దేవానాం హితకారిణీ .14

పాతాలే పాతు మా నిత్యఀ వశినీ విశ్వరూపిణీ .
ప్రణవంచ తతా మాయా కామబీజంచ కూర్చ్చకం 15

మాతంగినీ ఙేయుతాస్త్రఀ వహ్నిజాయావధిర్మనుః .
సార్ద్ధైకాదశవర్ణా సా సర్వత్ర పాతు మాం సదా .. 16..

ఇతి తే కథితందేవి గుహ్యాద్గుహ్యతరంపరం .
త్రైలోక్యమంగలన్నామ కవచందేవదుర్లభం .. 17..

య ఇదంప్రపఠేన్నిత్యంజాయతే సంపదాలయం .
పరమైశ్వర్యమతులంప్రాప్నుయాన్నాత్ర సంశయః  18

గురుమభ్యర్చ్చ్య విధివత్కవచంప్రపఠేద్యది .
ఐశ్వర్యం సుకవిత్వంచ వాక్సిద్ధిఀ లభతే ధ్రువం .. 19..

నిత్యంతస్య తు మాతంగీ మహిలా మంగలంచరేత్ .
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ యే దేవాః సురసత్తమాః .20.

బ్రహ్మరాక్షసవేతాలా గ్రహాద్యా భూతజాతయః .
తందృష్ట్వా సాధకందేవి లజ్జాయుక్తా భవంతి తే .21.

కవచంధారయేద్యస్తు సర్వసిద్ధిఀలభేద్ధ్రువం .
రాజానోఽపి చ దాసత్వం షట్కర్మాణి చ సాధయేత్22

సిద్ధో భవతి సర్వత్ర కిమన్యైర్బహు భాషితైః .
ఇదం కవచమజ్ఞాత్వా మాతంగీఀ యో భజేన్నరః .23.

అల్పాయుర్నిర్ద్ధనో మూర్ఖో భవత్యేవ న సంశయః .
గురౌ భక్తిః సదా కార్యా కవచే చ దృఢా మతిః .. 24..

తస్మై మాతంగినీ దేవీ సర్వసిద్ధింప్రయచ్ఛతి .. 25..

ఇతి నంద్యావర్తే ఉత్తరఖండే త్వరితఫలదాయినీ మాతంగినీకవచం

🌷శ్రీ మాత్రే నమః🌷
Read More

సుదర్శన జయంతి

🎻🌹🙏 నేడు సుదర్శన జయంతి..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

         🌹🌹

🌿మహావిష్ణువు యొక్క శక్తివంతమైన ఆయుధమైన అత్యున్నత దైవిక సుదర్శన చక్రం పుట్టినరోజు. 

🌸ఈ శక్తివంతమైన ఆయుధం మీ ఎదుగుదలకు మరియు విజయానికి ఆటంకం కలిగించే అన్ని ప్రతికూల శక్తులను ఎదుర్కోగలిగే ధర్మానికి ఒక ఘనమైన కవచంగా , సంరక్షకుడు గా నిలబడుతుంది

🌿సుదర్శన జయంతి తమిళ నెల ఆది (జూల్ - ఆగస్టు)లో శుక్ల పక్ష దశమి (10వ క్షీణిస్తున్న చంద్రుడు) నాడు వస్తుంది.

     🌷పురాణాలలో సుదర్శన చక్రం🌷

🌸రాక్షసుల తల నరికివేసేందుకు విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించినట్లు పౌరాణిక ప్రస్తావనలు చాలా ఉన్నాయి.
 
🌿కానీ , సుదర్శన చక్రం యొక్క పుట్టుక గురించి కేవలం రెండు పురాణాలు మాత్రమే ఉన్నాయి. 

🌸శివుడు విష్ణువు పట్ల తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత రాక్షసులను చంపడానికి సుదర్శన చక్రాన్ని ఎలా బహుమతిగా ఇచ్చాడో వివరించడానికి అలాంటి కథ ఒకటి. 

🌿ఖగోళ జీవుల యొక్క ప్రధాన వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి సుదర్శన చక్రాన్ని ఎలా సృష్టించాడో మరియు సూర్యుని తేజస్సులోని భాగాలను ఉపయోగించి సుదర్శన చక్రాన్ని ఎలా సృష్టించాడో మరొక కథ వివరిస్తుంది.

🌸 సుదర్శన భగవానుడు శత్రువులను తుడిచిపెట్టి ఆత్మను స్వస్థపరుస్తాడు

🌿సుదర్శన భగవానుడు మరెవరో కాదు విష్ణువు. 

🌸నాశనం చేయలేని సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్నందున అతన్ని అలా పిలుస్తారు. 

🌿సుదర్శనం అనే పదం 'సు' అనే రెండు పదాల నుండి ఉద్భవించింది , అంటే శుభం మరియు దర్శనం అంటే దర్శనం. 
చక్రం అంటే స్థిరంగా గమనంలో ఉండే చక్రం. 

🌸త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు శివుల కలయికతో చక్రం సృష్టించబడింది. 

🌿పురాణాల ప్రకారం , శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఖాండవ వనాన్ని దహనం చేయడంలో అగ్నిదేవునికి సహకరించారు. 

🌸బదులుగా , అతను కృష్ణుడికి సుదర్శన చక్రం మరియు కౌమోదకి జాపత్రిని బహుమతిగా ఇచ్చాడు.

 🌿సుదర్శనచక్రంఉపయోగించే ఇతర దేవతలు నారాయణి మరియు వైష్ణోదేవి.

🌸సుదర్శన జయంతి నాడు మహా సుదర్శన అష్టక హోమం చేస్తారు
 వైష్ణవులు ఈ రోజును శుక్ల పక్ష ఆషాడ దశమిగా పాటించి 

🌿మరుసటి రోజున తొలి ఏకాదశి వ్రతం చేబడతారు..స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
Read More

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

పొడుస్తూ భానుడూ
పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద
పొగడపువ్వు ఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

ఉదయిస్తూ భానుడు
ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద
ఉగ్రంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

గడియెక్కి భానుడు
కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

జామెక్కి భానుడు
జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద
సంపంగీ పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

మధ్యాహ్న భానుడు
మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద
మంకెన్న పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద
ముత్యంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

అస్తమాన భానుడు
ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద
అద్దంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

వాలుతూ భానుడు
వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

*🌞శుభ శూర 
Read More

శ్రీవామనాష్టకం

శ్రీవామనాష్టకం
1) నమో భగవతే వామనాయ
  కమలాసనార్చితపల్లవపదాయ
  వేదవేదాంగపారంగతాయ
  బ్రహ్మచర్యావలంబనవిగ్రహాయ ||

2) నమో భగవతే వామనాయ 
   పురాణపురుషోత్తమాయ 
   త్రిజగన్నుతదివ్యవిగ్రహాయ 
   కార్యాకార్యసాధ్యాసాధ్యయోచనాయ ||




3) నమో భగవతే వామనాయ 
   పాతాళలోకద్వారపాలకాయ 
   విరోచనకుమారగర్వభంజనాయ 
   శుక్రాచార్యకుటిలోపాయనివారణాయ ||

4) నమో భగవతే వామనాయ 
   మకరకుండలమండితగండభాగాయ
   కదంబవనమాలాధరాయ
   బ్రాహ్మణోత్తమమనోరంజకాయ   ||






5) నమో భగవతే వామనాయ
     అదితికశ్యపప్రియాత్మజాయ
     మిత్రానందపురనివాసాయ
     అనంతానంతకారుణ్యవిగ్రహాయ ||

6) నమో భగవతే వామనాయ 
   యోగీశ్వరహృత్కమలవాసాయ
   సంభ్రమాశ్చర్యజనకజ్ఞానవిగ్రహాయ 
     బ్రహ్మజ్ఞానప్రజ్జ్వలబ్రహ్మతేజోమయాయ ||






7) నమో భగవతే వామనాయ 
   పోతనామాత్యకవితాత్మకస్వరూపాయ 
   సకలపాపసంఘభంజనాయ 
   మాధవీపూజితకమలచరణాయ ||

8) నమో భగవతే వామనాయ 
   శుభమంగళపరంపరాప్రదాయకాయ 
   మృదుతరసంభాషణాచాతుర్యప్రదాయ
   మౌంజీకృష్ణాజినధరస్వధర్మపాలనానిరతాయ ||

      సర్వం శ్రీవామనదివ్యచరణారవిందార్పణమస్తు
Read More

స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే అరుణాచలేశ్వరుడు



అరుణాచల గిరి ప్రదక్షిణం ఏ వారంలో ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం . ఏ రోజు చేసినా అఖండ పుణ్య రాశులను ప్రాప్తింప జేసే అపార కరుణాముర్తి అరుణాచలేశ్వరుడు .

" అరుణాచల " అని ఒక్కసారి భక్తితో పిలిస్తే మూడు కోట్ల సార్లు " ఓం నమః శివాయ " అని స్మరించిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు అంటే ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి కారుణ్య ముర్తో అర్ధం అవుతుంది .

ఆ అరుణాచలుడు కొలువై ఉన్న అరుణగిరి కి ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది.మానవులు వారు చేసుకున్న కర్మల వలన వివిధ కష్టాలతో బాధ పడుతూ ఉంటారు . ఈ అరుణాచల గిరి ప్రదక్షిణం ఫలానా రోజున చేయడం వలన ఫలానా ఫలితం కలుగుతందని అరుణాచల క్షేత్ర మహత్యం చెబుతున్నది . ఈ ఆల్బం లో అరుణాచల గిరి ప్రదక్షిణం ఏ రోజు చేసిన ఏ ఫలితం కలుగుతుందో సంపూర్ణంగా సమగ్రంగా తెలుపబడి ఉన్నది . పూర్తిగా చదివి అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకుని అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో అరుణాచల క్షేత్ర దర్శనము , అరుణ గిరి ప్రదక్షిణం చేసుకుంటారని ఆశిస్తూ …వి ఎస్ మూర్తి

అరుణాచలేశ్వరుడు :

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. 'ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.వి ఎస్ మూర్తి

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి 'పచ్చయ్యమ్మన్' అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను 'అపీతకుచాంబ' అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ' అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి 'బల్లాల గోపురం' అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.వి ఎస్ మూర్తి

అందరూ భక్తితో " అరుణాచల శివ " అని స్మరించండి … ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు …

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

ఓం నమః శివాయ

సాధన సాధ్యతే సర్వం
Read More

వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ

*వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ*

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.
వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు 
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. 

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు *కృష్ణద్వైపాయనుడు* కాలంలో.

*ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు*

1. స్వాయంభువ 
2. ప్రజాపతి
3. ఉశన 
4. బృహశ్పతి 
5. సవిత 
6. మృత్యువు 
7. ఇంద్ర 
8. వశిష్ఠ 
9. సారస్వత 
10. త్రిధామ 
11. త్రివృష 
12. భరద్వాజ 
13. అంతరిక్షక 
14. ధర్ముడు 
15. త్రయారుణ 
16. ధనుంజయుడు 
17. కృతంజయుడు 
18. సంజయ 
19. భరద్వాజ 
20 గౌతమ 
21. ఉత్తముడు 
22. వాజశ్రవ 
23. సోమశుష్మాయణ 
24. ఋక్షుడు 
25 శక్తి 
26. పరాశరుడు 
27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి  తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. *వేదరాశి* ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ... వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు.  అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.

 
*విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా.....*

*"వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస* *రూపాయ విష్ణవే*
*నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!*

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాప్తి చేయండని ఆదేశించాడు.  వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. 
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు. 

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు.  రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి  అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు. 

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |*
*పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||*

*తాత్పర్యం:-* వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము. 

*" వ్యాసో నారాయణో హరిః "* అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.

*మహాభారత రచన :-

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి *"వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు."* అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు  వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు.  నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. 
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని *"వేదపురుషుడు"* అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  

ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.

*పూజా విధానం (వ్యాస పూజ , గురు పూజా విధానం)*

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు , అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం , కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం , నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో , శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే , ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి , సకల శాస్త్రవేత్త , శస్త్ర చికిత్సవేది , మేధానిధి , వైద్యవరుడు , ఆత్మవిద్యానిధి , వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

*వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.*

*శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం*
*సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః*

అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!

*గురు సందేశము :-*

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- *'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.'* పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

సర్వభూతముల యందు దయకలిగియుండుట , సత్యమార్గములో నడుచుట , శాంతగుణాన్ని కలిగియుండుట  ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము , ఋషిరుణము , పితృఋణము   అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం , ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస , పురాణాల పట్ల , ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల , అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
Read More

శ్రీవ్యాసభుజంగస్తోత్రం

 

1) శిష్యకోటివంద్యమానభానుకోటిభాస్వరం 
   వేదవేదాంగభాజ్యబ్రహ్మనిష్ఠాపరం
   సంభ్రమాశ్చర్యజనకచారుధర్మవిగ్రహం  
   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

2) యోగభాష్యబ్రహ్మసూత్రవిద్యాప్రదాయకం 
   బదరికాక్షేత్రవాసశ్రీబాదరాయణం 
   భాగవతభారతరచనానైపుణ్యం 
   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||



3) శుకశౌనకాదిపూజ్యమృదుపాదపంకజం 
   మన్వంతరాతీతసుఖచిరజీవినం
   అష్టాదశపురాణరచనావైదూష్యం 
   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

4) ఉపాసనాకర్మజ్ఞానభక్తిమార్గబోధకం 
   సమయదక్షిణాచారదృఢదీక్షాపరం 
   మనోవేగశ్లోకనిర్మాణప్రావీణ్యం   
   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||






5) శివకేశవ స్వరూప పరబ్రహ్మతత్త్వం 
   భస్మత్రిపుండ్రభూషరుద్రాక్షధారిణం 
   అజ్ఞానతిమిరభేద్యప్రజ్ఞానభాస్కరం 
   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం   ||

      సర్వం శ్రీవ్యాసమునీంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు
Read More

విగ్రహారాధన

🌺 విగ్రహారాధన 🌺
 
'అర్చా' రూపం అంటే శిలా, దారు, లోహములతో తయారైన విగ్రహరూపంలో ఉన్న పరమాత్మ అని అర్థం. మరి ఇప్పుడొక సందేహం కలుగవచ్చు. జీవం లేని విగ్రహారూపంలో పరమాత్మ ఏ విధంగా ప్రవేశిస్తాడు అని. మరీచి మహర్షి. శ్రీవైఖానస ఆనంద సంహిత-విమానార్చనాకల్పంలో, ఈ సందేహానికి చక్కటి వివరణ ఇచ్చారు. 

"సర్వాధారం సనాతన మప్రమేయ మచింత్యం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పిః, తిలే తైలం, పుష్పే గంథం, ఫలే రసం, కాష్ఠే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానాం మనసా సంకల్ప్య ఆవాహయేత్ " (శ్రీవైఖానస మరీచి విమానార్చనాకల్పం-31వ పటలం) 

సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, నిష్కలుడు అయిన పరమాత్మ - పాలలో నేయివలె, నువ్వులలో నూనెవలె, పుష్పాలలో తేనెవలె, పండ్లలో రసంవలె, కట్టెలలో అగ్నివలె సర్వవ్యాపిగా వుంటాడు. అట్టి భగవంతుని, మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి, ఆవాహనం చేయాలి. ఏ విధంగా అయితే కట్టెలలో, మంటలను గాలి ద్వార జ్వలింపజేయవచ్చో, అదే విధంగా సర్వవ్యాపి అయిన విష్ణువు, ధ్యాన మధనం, భక్తి ప్రపత్తులవలన, సంకల్పబలంవలన విగ్రహంలో ప్రవేశించి, మన పూజలందుకుని మనలను అనుగ్రహిస్తాడు. చక్కటి రూపంతో, విగ్రహ రూపంలో ఉన్న విష్ణుభగవానుని ఆరాధించాలి
Read More

*దశావతారస్తోత్రమ్



నమోఽస్తు నారాయణమన్దిరాయ నమోఽస్తు హారాయణకన్ధరాయ ।
నమోఽస్తు మత్స్యాయ లయాబ్ధిగాయ నమోఽస్తు కూర్మాయ పయోబ్ధిగాయ ।
నమో వరాహాయ ధరాధరాయ నమో నృసింహాయ పరాత్పరాయ ॥ ౨॥

నమోఽస్తు శక్రాశ్రయ-వామనాయ నమోఽస్తు విప్రోత్సవ-భార్గవాయ ।
నమోఽస్తు సీతాహిత-రాఘవాయ నమోఽస్తు పార్థస్తుత-యాదవాయ ॥ ౩॥

నమోఽస్తు బుద్ధాయ విమోహకాయ నమోఽస్తు తే కల్కి-పయోదితాయ ।
నమోఽస్తు పూర్ణామితసద్గుణాయ సమస్త-నాథాయ హయాననాయ ॥ ౪॥

కరస్థ-శఙ్ఖోల్లస-దక్షమాలా-ప్రబోధ-ముద్రాభయ-పుస్తకాయ ।
నమోఽస్తు వక్త్రోద్గిర-దాగమాయ నిరస్త హేయాయ హయాననాయ ॥ ౫॥

రమాసమాకార-చతుష్టయేన క్రమాచ్చతుర్దిక్షు నిషేవితాయ ।
నమోఽస్తు పార్శ్వద్వయగ-ద్విరూపశ్రియాభిషిక్తాయ హయాననాయ ॥ ౬॥

కిరీట-పట్టాఙ్గద-హార-కాఞ్చీ-సురత్నపీతాంబర-నూపురాద్యైః ।
విరాజితాఙ్గాయ నమోఽస్తు తుభ్యం సురైః పరీతాయ హయాననాయ ॥ ౭॥

విదోష-కోటీన్దు-నిభప్రభాయ విశేషతో మధ్వ-ముని-ప్రియాయ।
విముక్తవన్ద్యాయ నమోఽస్తు విశ్వగ్విధూత-విఘ్నాయ హయాననాయ ॥౮॥

నమోఽస్తు శిష్టేష్టద వాదిరాజకృతాష్టకాభిష్టుత-చేష్టితాయ ।
దసావతారై-స్త్రిదసార్థదాయ నిశేశ-బింబస్థ హయాననాయ ॥ ౯॥

నమోఽస్తు పారాయణచర్చితాయ నమోఽస్తు నారాయణ్ తేఽర్చితాయ ॥ ౧॥

*🙏శుభ శుభోదయం🙏* 
Read More

దక్షిణాయణం విశేషాలు:- 'అయనం' అంటే

🙏🙏🙏🙏🙏
దక్షిణాయనం అంటే ఏమిటి..? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే దాంట్లో నిజమెంత?

దక్షిణాయణం విశేషాలు:- 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. భూమి తనచుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది. అందువలన పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి ఇవి పూర్తీ కావడానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా సంచరించు కాలాన్ని దక్షిణాయణం అంటారు.

1.
సూర్యుడు
జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం అని అంటారు. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయణం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభమవుతుంది.సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు.

2.
సూర్యోదయం
దక్షిణాయణం అంటే ఏమిటి..?

దక్షిణాయణం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయణం' అని అంటారు.

3.
దేవతలు
దేవతలకు పగలు ఎప్పుడు రాత్రి ఎప్పుడు

ఈ దక్షిణాయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయణం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయినది.శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయణంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

4.
సంతానం
సంతానాభివృద్ధికి ఏం చేయాలి..?

ఎలా చూసిన దక్షిణాయణంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.

5.
దానం
దానం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి..?

ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, ఈ కాలంలో పేదవారికి, అన్నార్ధులకు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, నువ్వుల దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, రావి చెట్టుకు ప్రదక్షిణలు, ఆదిత్య హృదయ పారాయణం, సూర్యనమస్కారం, ధ్యానం (యోగ) చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని ఇతిహాసాల ద్వార తెలుస్తుంది.
🙏🙏🙏🙏🙏
Read More

*పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం*

__

🕉🕉🕉🕉🕉🕉

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా , దుర్గ , లక్ష్మి , పార్వతి , సతి , మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.
మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.
ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది. ప్రపంచ ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని 1078 సంలో పూరీలో నిర్మించారు.
ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు , స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి. అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

*గోపురం*

ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.

*రెపరెపలాడే జెండా*

ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.

*పూరీ జగన్నాధుడి రధయాత్ర*

ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణ , బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.

మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది. ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.

*రధయాత్రలోని విశిష్టత*

ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.

*సుదర్శన చక్రం*

పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

*సముద్రపు అలలు*

సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది. సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం.

దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.

సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు , వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.

కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.

అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.

అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు , సుభద్ర , బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

*రథయాత్ర*

ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్ , బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.

ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

*ప్రత్యేకత*

ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదం. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి , వాసన వుండదు.

ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.

ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7 మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు.సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది. కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికిన తర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది.
అదే ఇక్కడి ప్రసాదం , నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు , అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.

*పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు*

పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత 
జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం , ముసిమ ఆలయం , సునర గౌరంగ్ ఆలయం , శ్రీ లోక్నాథ్ ఆలయం , శ్రీ గుండిచ ఆలయం , అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.

మరోక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.

వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.

ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా ? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.

పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

*పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం*

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.🙏🕉️🙏
Read More

చిత్తజగురుఁడా నీకు శ్రీమంగళం..* తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన

*చిత్తజగురుఁడా నీకు శ్రీమంగళం..*

తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన

రేకు: 1032-3
సంపుటము: 20-189
రేకు రాగము: లలిత

గానం. *శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు*
రాగం. మధ్యమావతి

చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా
చిత్తములో హరి నీకు శ్రీమంగళం

బంగారుబొమ్మవంటి పడతినురము మీద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీఱఁ  పీతాంబరము మొలఁ గట్టుకొని
చెంగలించే హరి నీకు శ్రీమంగళం

వింత నీలములవంటి వెలఁది నీపాదముల
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా
చింతామణివైన నీకు శ్రీమంగళం 

అరిది పచ్చలవంటి  అంగన శిరసు మీద 
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదలతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం
Read More

శ్రీ అన్నమాచార్య సంకీర్తన

🙏 శ్రీ అన్నమాచార్య సంకీర్తన 🙏

(॥పల్లవి॥)
తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి
(॥తగు॥)
కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి
అమ్ము మొనను జలది నడఁచి లంక సాదించి
కమ్మరఁ జే కొన్నసీతే ఘనవీరలక్ష్మి
(॥తగు॥)
నరకాసురు నడఁచి నవ్వుతాఁ జేయివేసితివి
సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించినయాకే వరలక్ష్మి
(॥తగు॥)
నిండినవురముమీఁద నిఖిలసంపదలతో
అండనుండే యాకెపో ఆదిలక్ష్మి
మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే
గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి
Read More

సంధ్యావందనమునకు చాలా నియమములు ఉన్నవి. అందులో అర్ఘ్యప్రదానం గురించి తెలుసుకుందాము.


సకాలములో అర్హ్యము ఇవ్వలేకున్నపుడు కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తముగా ఒక ప్రత్యేక అర్ఘ్యము విడువవలెను.

అర్ధ్యమునిచ్చునపుడు :

ప్రాతఃకాలమున సూర్యునికి అభిముఖముగ వంగి విడువవలెను. మధ్యాహ్నమున నిలుచుండి విడువవలెను. సాయంకాలమున పడమటి దిక్కునకు తిరిగి కూర్చుండి విడువవలెను.

జాతాశౌచ -మృతాశౌచములందు సంధ్యావందనము అర్ఘ్య ప్రదానమువరకే చేయవలెను.
ఆచమనం నిలువబడిగాని వంగికాని చేయకూడదు. కూర్చుండి ఆచమనము చేయవలెను. తడిగుడ్డతో సంధ్య జపములు చేయకూడదు.

ప్రవాహజలమధ్యలో మాత్రమే తడిగుడ్డ దోషము కాదు. నిలుచుండి ఆచమనాదులు దోషముకాదు.

నీళ్లలో నిలబడి గాయత్రిని జపించకూడదు. ఒడ్డున కూర్చుండి చేయవలెను. జపము మూడు విధములు

1.వైఖరి: ఇతరులకు వినబడునట్లు మంత్రమును ఉచ్చరించుట.

2.ఉపాంశువు: పెదవులు కదిలించుచు శబ్దము బయటికి వినబడకుండా జపించుట.

3.మానసికము: పెదవులు కూడ కదిలించకుండ మనసులో జపించుట

వైఖరికన్న ఉపాంశవు దానికన్న మానసికము శ్రేష్ఠము. 

ప్రకృతిలోని 24 తత్త్వములకు గాయత్రీ మంత్రాధిష్టాన దేవత. పరమాత్మ సకాలమున సంధ్యావందనము చేయువారలకు గాయత్రీ స్వరూప పరమాత్మ సకల శోభములు కలిగించును.
Read More

*శ్రీలక్ష్మీ ప్రార్థన:*

卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐 

 🙏*శ్రీలక్ష్మీ ప్రార్థన:*🙏
*లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం* *దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం*
 *శ్రీమన్మన్దకటాక్షలబ్ద* *విభవ బ్రహ్మేన్ద్ర గంగాధరాం*
*త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం*
----------------------------------------
      
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏
----------------------------------------
          *_గోమాతను పూజించండి_*
          *_గోమాతను సంరక్షించండి_*
 ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
  


--
kishore always with u....!

Read More

శని త్రయోదశి

*శని త్రయోదశి*

ది. 28-05-2022 న *శని త్రయోదశి*. ఈ నెలలో పౌర్ణమి ముందు కూడా ఈ శని త్రయోదశి వచ్చినది. అయితే అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశికు ప్రాధాన్యత ఎక్కువ.

ఈ శని త్రయోదశి నాడు శనైశ్చరునకు ప్రీతిని కలిగించినట్లయితే ఆయన బాధించడు. అందువలన ఈ రోజున చేయు అభిషేకమునకు ప్రాధాన్యత ఎక్కువ.

*మందపల్లి* గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర స్వామిని(శని భగవానుడు) ఆరాధించుట వలన *శని బాధల* నుండి విముక్తి కలుగును.

*ఏలిన నాటి శని* పీడ గల రాశులు

*మీనం*
*కుంభం*
*మకరం*

*అర్ధాష్టమ శని* పీడ గలరాశి

*వృశ్చికము*

*అష్టమ శని* బాధ గల రాశి

*కర్కాటకము*

అలాగే *శని దశలు*, *అంతర్దశలు*, బాగాలేని వారుకూడా ఈ మందేశ్వరుని ఆరాధించవచ్చు.




--
kishore always with u....!

Read More

*దశపాపహర దశమి*

*దశపాపహర దశమి*

కాశీఖండ మందు చెప్పిన ప్రకారము హస్తా నక్షత్రం  తో కూడిన జ్యేష్ఠ శుద్ధ దశమిను *దశపాపహరదశమి* గా వర్ణించారు. ఈ రోజున గంగామాతను యధావిధిగా పూజించిన, గంగా స్నానము చేసిన యొడల పది జన్మలుగా చేసిన పదిరకాల పాపాలు తొలగును. 

అలాగే అదేరోజున కాశీ క్షేత్రమందు అభిషేకము, గంగాపూజ చేయ సంకల్పించాము. ప్రత్యక్షంగా కాశిలో లేని వారు పరోక్షంగా అయినా పుణ్యం సంపాదించుటకు ఇది మంచి మార్గము.




--
kishore always with u....!

Read More

గంగావతరణం

గంగావతరణం

శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.

సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు 'ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు.' అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు 'ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు' అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది "నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను' అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని 'భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.


--
kishore always with u....!

Read More

*మాస శివరాత్రి*

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
            
          

*మాస శివరాత్రి*
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. 
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. 
శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. 
మహాశివుడు లయ కారకుడు, లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు, అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 
చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది...

తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది, ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు...

మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. 
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది...

మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి...

 ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి, అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు... 

అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అదే విధంగా ఆ రోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. 
ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. 
మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. నేడు మాసశివరాత్రి సందర్భంగా ఈ కథనము...

         *_☘️శుభమస్తు☘️_*
 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


--
kishore always with u....!

Read More

మంగళవారం+ షష్ఠి *కుమార షష్ఠి*. చాలా విశేషమైన రోజు.

మంగళవారం+ షష్ఠి *కుమార షష్ఠి*. చాలా విశేషమైన రోజు.

ఆ రోజున 11 ఆవృతాలు *సర్పసూక్తం* తో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, *సుబ్రహ్మణ్య పాశుపత హోమము* చేసుకున్న చాలా మంచిది.

ముఖ్యంగా సంతాన లేమి, సంతాన సమస్యలు, వివాహము ఆలస్యమవుట, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సంతానము పెరుగుదల సరిగా లేకపోవడం వంటి మరెన్నో సమస్యలను స్వామి వారు నివృత్తి చెస్తారు.

సామూహికంగా మేము జరిపించబోవు *సర్పసూక్త అభిషేకము* మరియు *సుబ్రహ్మణ్య పాశుపత హోమము* లో పాల్గొన దలచు వారు మీ గోత్రనామాలు పంపించవచ్చు.




--
kishore always with u....!

Read More

ఆషాడ అమావాస్య దీనినే చుక్కల అమావాస్య కూడా అంటారు..!!

 ఆషాడ అమావాస్య దీనినే చుక్కల అమావాస్య కూడా అంటారు..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌷ఈ రోజు ఏం చేయాలి🌷

🌿ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు.

🌸 కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...

🌿హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.

🌸 మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది.

🌿దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున

🌸వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.

🌿ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట.

🌸కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !

🕉️ మనం వండుకున్న ఆహారంలో నుంచి ఒక ముద్ద తీసి బయట పెట్టాలి. కాకులకు పక్షులకు చీమలకు ఆహారం వేయాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు దక్షిణం వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఆరోజు పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారని శాస్త్ర వచనం.

🌿ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం .

🌸కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు.

🌿ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

🌸 ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.


--
kishore always with u....!

Read More

షష్ఠి+కృత్తిక

16-09-2022

*షష్ఠి+కృత్తిక*

శుక్రవారం నాడు షష్ఠి తిథి మరియు కృత్తిక నక్షత్రము వచ్చినది. చాలా అరుదుగా వచ్చే ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి *సర్పసూక్తం* తో అభిషేకం చేసుకొన్న వారికి విశేషమైన ఫలితం ఉంటుంది.

సర్పదోషం,కాల సర్ప దోషం, నాగదోషం,సర్ప శాపం ఉన్నవారు, సంతాన సమస్యలు, వివాహం ఆలస్యం అవడం, వెన్నుపాము కు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, చర్మ వ్యాధులు ఉన్నవారు, *కుజ స్ధంభన* వలన బాధపడుతున్న *వృషభ,మిధున,కుంభ,తులా* రాశుల వారు ఈ రోజున *సర్పసూక్తం* తో స్వామివారి కి అభిషేకం చేయించిన ఆ సమస్యలను అధిగమించగలరు.

ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రములలో ఈ అభిషేకం చేయించు కొనిన మరింత అధిక ఫలితము. కావున మీకు వీలున్నంత వరకు ఈ అవకాశమును వినియోగించుకుని మీమీ ప్రాంతాలలో స్వామి వారిని ఆరాధించండి.




--
kishore always with u....!

Read More

భాద్రపద మాసములో *కృష్ణ పక్షము* నందు వచ్చు పాడ్యమి లగాయితు అమావాస్య వరకు పక్షము( 15 రోజులను) *మహాలయ పక్షము* అందురు

అందరికీ నమస్కారం!

భాద్రపద మాసములో *కృష్ణ పక్షము* నందు వచ్చు పాడ్యమి లగాయితు అమావాస్య వరకు పక్షము( 15 రోజులను) *మహాలయ పక్షము* అందురు.

తారీఖు *సెప్టెంబరు 11 నుండి సెప్టెంబరు 25 వరకు*

ఈ *మహాలయ పక్షము* తిధులలో పితృకార్యములను ఆచరిస్తారు. 

పితృకార్యములను సరిగా ఆచరించనిచో జాతకమున *పితృదోషములు* ప్రస్పుటముగా కనిపించును.

*పితృ శాపము/దోషము* వలన సంతానము కలగకపోవుట, వివాహము ఆలస్యం అవుట, సంపాదన నిలవకపోవుట, వంశవృద్ధి లేక బాధలు పడుదురు.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

🔻 చిన్న వారు అకాలమరణం పొందడం 

🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.

🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.

🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం



ప్రతి సంవత్సరం పితృకార్యం చెయ్యలేని వారు, దూరప్రాంతములలో నివసించే వారు, కాశీ, గయలలో ఈ కార్యక్రమం చెయ్యలేనివారు ఈ మహాలయ పక్షములో చేసిన విశేష ఫలితం కలుగును.

ఈ మహాలయ పక్షమన బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతర వర్గము వారికి ప్రత్యేకముగా  ఈ మహాలయ పక్షములో దాదాపు *ఆరు* ప్రముఖమైన ప్రాంగణములలో, సంగమ ప్రదేశాలలో *రాజమండ్రి*, *నర్సాపురం వశిష్ఠ గోదావరి*, *సిద్దాంతం గోదావరి*, *అంతర్వేది సంగమం*, *కొవ్వూరు గోపాద క్షేత్రం* , *పాదగయ క్షేత్రం (పిఠాపురం)*.

ఈ ప్రాంతాలలో శాస్త్రోక్తంగా *మడిగా* బ్రాహ్మణులకు భోజనముతో పాటుగా ఈ *మహాలయ పక్షములో* కార్యక్రమము నిర్వహించ సంకల్పించాము.




--
kishore always with u....!

Read More

*నియమాలు పాటించాలి* కార్తీక స్నాన మంత్రము

*నియమాలు పాటించాలి*
కార్తీక స్నాన మంత్రము :-

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!

*1వ రోజు*
_నిషిద్ధములు :-_
ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. 
చల్లని వస్తువులు

దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :- 
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

*2వ రోజు*
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము :- బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :- 
ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము

*3వ రోజు*
నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము

*4వ రోజు*
నిషిద్ధములు :- వంకాయ, ఉసిరి
దానములు :- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి

*5వ రోజు*
నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి

*6వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

*7వ రోజు*
నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం

*8వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం

*9వ రోజు*
నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

*10వ రోజు*
నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :-
ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి

*11వ రోజు*
నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి

*12వ రోజు*
నిషిద్ధములు :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

*13వ రోజు*
నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం

*14వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :-
 ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట

*15వ రోజు*
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు 
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*16వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత

*17వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

*18వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి

*19వ రోజు*
నిషిద్ధములు :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు :- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం, సర్వవిఘ్న నాశనం

*20వ రోజు*
నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

*21వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

*22వ రోజు*
నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు.

*23వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి, తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :- 
ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం, వశీకరణం

*24వ రోజు*
నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము :- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

*25వ రోజు*
నిషిద్ధములు :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :- 
ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

*26వ రోజు*
నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

*27వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

*28వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
దానములు :- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన మంత్రము :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం

*29వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

*30వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం.


--
kishore always with u....!

Read More

*సుబ్రహ్మణ్య షష్ఠి

ది. 29-11-2022 *సుబ్రహ్మణ్య షష్ఠి*. 

కాలసర్ప దోషములు, కుజదోషములు, కుజ స్ధంభన,సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహము ఆలస్యం అవటం,  రాహు పీడ( రాహుదశలు,అంతర్దశలు)  వంటి సమస్యలతో బాధపడుతున్న వారు,  *సుబ్రహ్మణ్య* ఆరాధన ద్వారా దోషాల నుండి విముక్తి పొందుతారు.

సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ శ్రేయోదాయకము. *అందునా మంగళవారం* మరింత విశేషం. అందువల్ల అందరూ చేసుకోవచ్చు.

*సుబ్రహ్మణ్య షష్ఠి* రోజున 11 ఆవృత్తాలు *సర్పసూక్తంతో* అభిషేకము జరిపించుకొ


--
kishore always with u....!

Read More

రోజు‌న *అలభ్యయోగం

రోజు‌న *అలభ్యయోగం*

 *మంగళవారం*, *మాసశివరాత్రి* మరియు *కృష్ణాంగారక చతుర్దశి* చాలా అరుదుగా ఇటువంటి రోజు వస్తుంది. ఆ రోజున కార్యసిద్ధి కొరకు అనగా అనుకున్న పనులు కాకపోతున్నా పనులలో జాప్యం ఎక్కువగా ఉన్నా,పిల్లలకు చదువు రాకపోతున్నా, పిల్లలు ఎదుగుదల సరిగాలేకపోయినా,మానసికంగా ఎదుగుదల లేకపోయినా, శుభకార్యములలో  ఆటంకాలు ఉన్నా ఆ రోజున *కార్యసిధ్ది గణపతి హొమం* మరియు వినాయకుని ఆరాధన ద్వారా పనులన్నీ జరుగుతాయి.



--
kishore always with u....!

Read More

బ్రహ్మచర్యము : ఉత్తరగీత

బ్రహ్మచర్యము : ఉత్తరగీత

: స్త్రీ సంభోగము లేకయుండుట. మనస్సునందైనను స్త్రీలమీఁదు.

గోరికలేక యుండవలయును. భార్యకలవాఁడయ్యేనేని ఋతుకాలములయందు మాత్ర మామెతోఁ గ్రీడించి తృప్తిఁబొందువాఁడు బ్రహ్మచారిగానే యెన్నఁబడును. దోషములు కాయికదోషమనియు, వాచకదోషమనియు, మానసిక దోషమనియు మూఁడు విధములు. 

అందు కాయికము = అన్యస్త్రీని బ్రత్యక్షముగఁ బొందుట కాయికదోషము 

వాచకము = అన్యస్త్రీని గోరుచు నన్యస్త్రీలతో సంభాషణమునకు సంతోషించుచు, వారి పొందు లభింపకపోయెనే, యెట్లు సమకూడునని మిత్రులతో నాలోచించు చుండుట వాచకదోషము; 

మానసికము = అన్యస్త్రీలను వలచి వారికొఱకై మనసునఁ బరితపించుచు నెవ్వరికిందెలియనీయక లోలోన కృశించుచుండుట మానసిక దోషము. తనభార్య కాక తక్కిన స్త్రీలందఱు దల్లులనియుఁ, దాను వారి కుమారుఁ డనియుఁ దలఁచుచు స్త్రీలమీఁదికోరిక తప్పించుకొనవలయును. 

ఋతుకాలము = బహిప్లైనది మొదలు పదునాఱు దినములు. అందు మొదటి నాలుగు దినములు, పదునొకండవ దినము, బదుమూఁడవ దినమును నిందితములు. అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సంక్రాంతి, వ్రతదినములు, సూతకదినములును నిందితములు. కావున నీ దినములయందు స్త్రీ సంపర్కముకూడదు. 

మనదీపమని ముద్దుఁబెట్టుకున్నచో మూతికాలును. అట్లే స్వభార్యయైనను ఋతుకాలములయందు దప్ప తక్కిన కాలములయందు సంభోగముకూడదు. శ్రాద్ధమందు భుజించిన బ్రాహ్మణుఁడు తనభార్య కోరినను నాడు సంపర్కముచేయఁగూడదు.

ఋతుస్నానము చేసిన మూఁడు దినములకు లోపలఁ గామాతురుఁడై యుండినను రమింపఁగూడదు. ఒకపడకయందు బవళించుటయును గూడదు. ప్రాతఃకాలము, పగలు, అర్ధరాత్రములు యందును, సంధ్యా కాలములయందును రమింపఁగూడదు. దితి సంధ్యాకాలమున కశ్యపునితో బలాత్కారముగ రమింప హిరణ్యకశిపుఁడు హిరణ్యాక్షులుబుట్టి.  సంధ్యాకాలదోషము వలన అతిక్రూరులయిరి కనుక సంధ్యాకాలమందు సంగమము కూడదు. రాత్రికాలమందే స్త్రీసంభోగము కూడునుగాని పగటఁగూడదు. 

ప్రాణంవా ఏతే ప్రస్కందన్తి యే దివారాత్యా సంయుజ్యస్తే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రే రత్యాసంయుజ్యక్తే" ప్రశ్నోపనిషత్. 

అట్లు కానియెడల నాలుగవ దినమున ననఁగా స్నానము రమింపఁగా నిల్చిన గర్భమందలి శిశువల్పాయువును, దరిద్రమును బొందును. పదునొకండవ దినమున నిల్చిన గర్భ మధర్మ మందిచ్చగల యాడు శిశువును బొందును. పదుమూడవ దినమున నిల్చిన గర్భమున వర్ణసంకరురాలగు కూతురు కలుగును, ఇది నిశ్చయము. ఉపరతివలన నిల్చిన గర్భము స్త్రీయొక్క యాకారచేష్టలు గల నపుంసకుని బొందును; లేకున్నఁ బురుషచేష్టలు గల స్త్రీయైన నిలుచును. ఆఱుమాసములు మిగిలిన గర్భిణి స్త్రీని రమింపఁగూడదు. ఈ బ్రహ్మచర్య నియమమును సమస్తమైనవారును జరుపవలయును.

శ్రీమద్ భగవత్ ఉత్తరగీత
ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధానంతరం చెప్పిన గీత.. దీనిని ఉత్తరగీత అంటారు..


--
kishore always with u....!

Read More

Powered By Blogger | Template Created By Lord HTML