What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 10 March 2013

ఆశనం గరలం ఫణీ కలాపః వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం? కిస్తి శంభో? తవ పాదాంబుజ భక్తి మేవ దేహి’.

‘శంకరా! ఏమైనా తిండి పెడతావేమో ననుకుంటే నువ్వే విషం తిన్నావు! ఆభరణాలనిస్తావేమో ననుకుంటే ఒంటినిండా పాముల్నే ధరిస్తావు! పోనీ తిండీ ఆభరణాల మాటకేం గాని, మంచి బట్టలైనా పెట్టేస్తే వెళ్లి పోదామనుకుంటే పగలు పులిచర్మం, రాత్రి ఏనుగుచర్మం కట్టి కన్పిస్తావు! కనీసం మమ్మల్ని ఈ అడవి చివరి వరకైనా సాగనంపి మా ఊరికెళ్లే తోవ చూపిస్తావేమో ననుకుంటే - నీ వాహనం ఎద్దు. పైగా అది ముసలిది (మహా ఉక్షః) కూడాను. ఔను! ఏమీ అనుకోకు గానీ మాకేం ఇస్తావు? ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలిగా! ఏముంది నీ దగ్గర? అసలుందా? (కిమస్తి?)- అని ఇంత వేళాకోళంగా ఆది శంకరులు ఆటపట్టించారు.
చివరి మాటలో ‘సరేలే! మాకు నీ పాదాంబుజాల యెడ భక్తి ప్రసాదించు చాలు’నన్నారు ఆయనే. ఇలా ఉన్న శంకరుణ్ణి ప్రార్థించాలి కూడానా? అన్పిస్తుంది మనకి. కానీ దాని అంతరార్థం ఇదీ: నువ్వే ఆ కాలకూట విషాన్ని స్వీకరించకుండా ఉండి ఉంటే ఆ విషాగ్ని ఈ ప్రపంచాన్నే మండించి వేసేది. మేం ఉండేవాళ్లమే కాదు! మేమున్నామంటే కారణం నీ విషపానమే. నమస్కారం శివా! లోకం నిండా విషబుద్ధులే ఉన్నారు. అలా విషం నిండి ఉన్న పాముల్ని చుట్టాల్లా ఒంటి నిండా తిప్పుకుంటూ విరోధుల్నీ, హాని చేసే వాళ్లనీ కూడా ఎలా లొంగ తీసుకోవాలో తెలుసుకోమంటున్నావా? ఎంత గొప్ప ఉపదేశం! సాష్టాంగం భవా! రజస్తమో గుణాలకి చిహ్నంగా వ్యాఘ్ర గజ చర్మాలని కట్టావా? అప్పుడప్పుడూ బుస్సుమంటూ ఉంటే గాని లోకవ్యవహారం సాగదంటున్నావా? దండాలు హరా! ధర్మానికి సంకేతం ‘ఎద్దు’ కాబట్టి ధర్మ బద్ధంగానే ఉండమంటున్నావా! దొడ్డ దేవరా వందనం! అందుకే కదయ్యా ఇది శివ (శుభాన్నిచ్చే) రాత్రి! -శ్రీ ఆది శంకరాచార్యులు.
Read More

నేడు మహాశివరాత్రి పర్వదినం
ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవకాలమని ఉపవాసం ఉంటే మంచిదని , అభిషేకం చేస్తే పుణ్యమని మనఅందరికి తెలిసిన విషయమే ! అలాంటి పరమ పవిత్రమైన రోజున ఒక్కసారి ఈశ్వరతత్వాన్ని గురించి తెలుసుకుందాం .

త్రిమూర్తులలో అందరికంటే సులభంగా భక్తులకు వశమయ్యేవాడు పరమేశ్వరుడు.విష్ణువు భక్తులను ఎంతో పరీక్ష పెట్టిగాని అనుగ్రహించడు.కానీ శివుడు అలాకాదు.భక్తుడు ఎప్పుడు,ఏమి అడుగుతాడా,ఎప్పుడు అతను అడిగినవన్నీ ఇచ్చేద్దామా అని పాపం ఆయనే ఎదురుచూస్తూఉంటాడు.అంత మంచివాడు ఆయన.

ఒక్కసారి త్రిమూర్తుల బాధ్యతలు తెలుసుకుందాము .బ్రహ్మ ,విష్ణు,మహేశ్వరులు వరుసగా సృష్టి,స్థితి,లయ కారకులని మనకు తెలుసుకదా !

ఇహలోకంలో మన కష్టసుఖాల బాధ్యత విష్ణుమూర్తిది.అందుకు ఆయనను ప్రార్ధించాలి.

కానీ పరలోకంలో సుఖాలను అందించేవాడు పరమేశ్వరుడు.ఆయన మోక్షప్రదాత కూడా!ఒక్కసారి ఆయన ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో చూద్దాం !

దురుద్దేశ్యంతో అడిగినా , తన భక్తుడిని నిరాశతో పంపకూడదని ముందువెనుకలు ఆలోచించకుండా భస్మాసురుడికి వరం ఇచ్చేసాడు.ఇదొక్కటి చాలు ఆయనకు భక్తులు అంటే ఎంత ఇష్టమో తెలియడానికి.

గాండీవంతో తలపగలకొట్టినవాడికి పాశుపతాస్త్రం ఇచ్చేసాడు.

అల్పాయుష్కుడిని ,అవసానదశలో కేవలం తన లింగాన్ని కౌగలించుకున్న కారణాన్ని చూబించి చిరంజీవిని చేసేసాడు .

తిండిదొరక్క పస్తు ఉంటే నాకోసం ఉపవాసం ఉన్నాడు అనుకుంటాడు . దొంగతనం చేస్తే నా ప్రసాదం తిన్నాడు అంటాడు .

ఉమ్మి వేసి మాంసం ముక్కలు పెడితే , అతని నిష్కల్మషమైన మనస్సు చూడమంటాడు .

రావణాసురుడికి అత్మలింగాన్నే ఇచ్చేసాడు .

క్షీరసాగరమధనంలో అందరూ మంచిమంచివన్నీ తీసుకుంటే ఈయనమాత్రం విశ్వశ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని ఏమాత్రం సంకోచించకుండా విషం తాగేసాడు.

సాలెపురుగులూ ఈయనకే కావాలి.
పాములూ ఈయనకే కావాలి.
ఏనుగులూ ఈయనకే కావాలి.

అందరూ మంచివాళ్ళే అనుకునే చిన్నపిల్లవాడి స్వభావం.
ఎప్పుడూ తనగురించి పట్టించుకోడు మహానుభావుడు.నేను ఎక్కడున్నా ఫరవాలేదు,ఏమి కట్టుకున్నా,ఏమి తిన్నాఫరవాలేదు,ఎలావున్నా ఫరవాలేదు,కానీ నావాళ్ళందరూ బాగుండాలి అనుకునే అతిమంచి దేవుడు.

మనం కష్టపడడం అస్సలు చూడలేడు.నాకు మడి,దడి వద్దంటాడు.స్నానం చేస్తే నాకు పడదు అంటే,వద్దులే,కొంచం విభూది రాసుకో చాలు అంటాడు.

పులిహోర , చక్రపొంగలి ,దధ్యోజనం , ఇలాంటివన్నీ చేసే ఓపిక నాకు లేదు అంటే,అవన్నీ నేను అడిగానా,కాసిన్ని నీళ్ళు నామీద పొయ్యి చాలు,అదే నాకు సంతోషం అంటాడు.

చాలా SIMPLICITY ఉన్న దేముడు.గిట్టని వాళ్ళు ముక్కోపి,తిక్కశంకరయ్య అంటారుగానీ,అవన్నీ అబద్ధాలే !

తనకు ఎవరిమీద కోపం ఉండదు.తన భక్తులను మాత్రం ఏమైనా అంటే అప్పుడు చూపిస్తాడు తన ప్రతాపం.దక్షయజ్ఞంలో కూడా తనను ఎంత అవమానించినా పట్టించుకోలేదు.కానీ తన భక్తురాలైన సతిదేవిని అవమానిస్తే సహించలేకపోయాడు.

పైగా మనకు SPECIAL OFFERS ఇస్తాడు.శివరాత్రి నాడు మనం ఒక్కసారి` ఓం నమశ్శివాయ`అంటే లక్షసార్లు అన్నట్టు FEEL అవుతాడు.

ఆయన ఎప్పుడూ తను భగవంతుడు , మనం భక్తులం అనుకోడు . మనము,ఆయన అంత ఒకటి అనుకుంటాడు.అంత మంచివాడు.

మరెందుకు ఆలస్యం ! ఈరోజు కొంచం ఆయన జపం చేసి , కాస్త అభిషేకం చేసి చూడండి ! ఎంత పరవశించిపోతాడో !

ఓం నమః శివాయ.
హర హర మహాదేవ శంభో శంకరా.
Read More

పరమశివుడు...
శివుడిని ఎగుడుదిగుడు కన్నులవాడని, ఆదిభిక్షువని, బోళాశంకరుడని...
ఎంతో వెటకారంగా, హాస్యంగా వ్యాఖ్యానించినప్పటికీ దాని వెనుక దాగి ఉన్నది మాత్రం నిరాడంబరత్వం. ‘శ్మశానంలో తిరిగేవాడని, శవాలు కాల్చిన బూడిద ఒంటినిండా రాసుకుంటాడని, కపాలంలో భిక్షాటన చేస్తాడ’ని ప్రతీతి. ఆదిభిక్షువుగా కవుల ప్రశంసలందుకున్నాడు. ఆయన దిగంబరుడు. నిజమే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడని తెలిసిందే. అంటే సర్వవ్యాపి అనే కదా అర్థం. కాబట్టి ఆయన సర్వాంతర్యామి. శివుడు లేని ప్రదేశమే లేదు. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. ప్రపంచమంతా ఆయన కనుసన్నలలో నడవవలసిందే. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆయన భార్యగా ఉన్నప్పటికీ ఆయన భిక్షకుడే. ఇన్ని నిరాడంబర విధానాలు పాటిస్తాడు శివుడు. ఒక భిక్షకుడు త్రిమూర్తులలో ఒకనిగా, లయకారుడయ్యాడు.
Read More

హరహర మహ దేవ...
శివాలయంలో ప్రదక్షిణ చెయ్యాల్సిన పద్ధతి ప్రత్యేకమైనది. దీన్ని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని అంటారు.
వృషండంచంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం
చిత్రంలో చూపించినట్టు నందీశ్వరుని వద్ద ప్రారంభించి కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి అక్కడ నుంచి మళ్లీ వెనక్కి నంది మీదుగా సోమసూత్రం వరకూ వచ్చి మళ్లీ వెనుదిరిగి నంది మీదుగా చండీశ్వరుని వరకూ వెళ్లి వెనక్కి వచ్చి సోమసూత్రాన్ని చేరితే ఒక 'శివ ప్రదక్షిణ పూర్తయినట్టు. శివుడికి ప్రద క్షిణమంటూ గుండ్రంగా తిరిగేస్తూ సోమసూత్రాన్ని దాటకూడదు..
Read More

అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు !

ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పదకొండు మాస శివరాత్రులు వస్తే ఆ పదకొండింటి కంటే గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు .తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది.చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి ,మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ ,భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు,నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....

ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
Read More

జగతః పితరౌ
వందే పార్వతీ పరమేశ్వరమ్...''
శివుడు లేని ప్రదేశమే లేదు.
అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు.
ప్రపంచమంతా ఆయన కనుసన్నలలో నడవవలసిందే.

ఆదిభిక్షువు...అర్ధనారీశ్వరుడు... ఆదిదంపతులు...
అన్నీ పాత మాటలే! కాని నిత్య నూతనం!
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు...
పాత విషయమే.... కాని నిత్య నూతనం...
శివపార్వతుల జీవనవిధానం ఈ తరం దంపతులకు పాఠ్యగ్రంథం.
వారిది ఆదర్శదాంపత్యం. ఇది చెప్పడానికి అక్షరాలు చాలవు.
ఇద్దరిదీ విలక్షణమైన వ్యక్తిత్వం.
ఒకరు ఆత్మాభిమానానికి, నిజాయితీకి మారు పేరు...
మరొకరు వైరాగ్యానికి, సర్వవ్యాపికి నిదర్శనం
Read More

బీరు వ్యర్థంతో పాల అధికోత్పత్తి

బీరు వ్యర్థంతో పాల అధికోత్పత్తి
పాడి పశువులకు దాణాగా గోధుమ పిప్పి
ఇక్రిశాట్ సహకారంతో మెదక్ రైతుల ప్రయోగం
సత్ఫలితాలు పొందుతున్న పాడి రైతులు...
మెదక్ జిల్లా రైతులు వినూత్న ప్రయోగంతో అధిక పాల దిగుబడిని సాధిస్తున్నారు. బీరు పరిశ్రమలోని వ్యర్థమైన గోధుమ పిప్పిని పశువులకు దాణాగా వేస్తూ అత్యుత్తమ ఫలితాలను పొందుతున్నారు. సాధారణంగా రోజుకు ఒకటి నుంచి రెండు లీటర్ల పాలు ఇచ్చే పశువుల నుంచి ఇప్పుడు నాలుగైదు లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఇందుకు కారణం వాటికి దాణాగా బీరు వ్యర్థాన్ని వాడటమేనని వారు చెబుతున్నారు
Read More

శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ...

శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ...
శివుడూ, విష్ణువూ వేర్వేరు కాదు. శివుడు పురుషరూపం. విష్ణువు స్త్రీరూపం. ఈ మాటని వినగానే విభేదించాలనే ఆలోచన కలుగవచ్చేమో కానీ, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులోని అంతరార్థం అవగతమౌతుంది.
శంకరుడు సుందరుడు, యువకుడూ అని అనుకునేలోగా ఆయన లింగాకారుడంటారు. ఆయన తన తలమీద రాగిజుట్టుని ధరిస్తాడని చెప్పుకునేలోగా ఆయన ఐదుతలలువాడు అని చెప్తారు. ఆయన పరమ ధర్మమూర్తి అని వింటుండగానే బ్రహ్మతలనీ, నలుగు వినాయకుని తలనీ నరికాడంటారు. తన లయకార్యమనే పనిని సక్రమంగా నిర్వహిస్తాడని తెలుసుకునే లోగానే మార్కండేయుణ్ణి మృత్యువు నుండి తప్పించాడంటారు. ఇక అన్నిటినీ మించి ఎక్కడా విననీ చూడనీ రీతిలో ఆయన్ని అర్ధనారీశ్వరుడంటారు. ఇలా ఒకటేమిటి? వింటున్న కొద్దీ సందేహాలే. దీనంతటికీ కారణం పైన అనుకున్నట్టుగా పురాణాన్ని ఒకే ఒక దృష్టితో చూడడమే. అలా కాకుండా ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక దృక్కోణాలతో పరమశివుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి.
Read More

అర్ధనారీశ్వరరూపం...

అర్ధనారీశ్వరరూపం...

ప్రపంచంలో దేనికీ ఏకత్వం లేదు. రెండు కలిసి ఒకటిగా అయినవే. సూర్యోదయం సూర్యాస్తమయం కలిసి పగలు. చంద్రోదయం + చంద్రాస్తమయం కలిసి రాత్రి. పగలు+రాత్రీ కలిసి రోజు. ఉత్తరాయనం+దక్షిణాయనం కలిసి సంవత్సరం. ఈ కాలవిభాగంలో స్త్రీ+పురుషుడూ కలిసి సృష్టి. ఇలా రెండ్రెండు ఒకటిగా అయ్యే విధానాన్ని పరిశీలించిన మీదట ప్రాచీన ఋషులకి ఓ అద్భుత ఆలోచన కలిగింది. ప్రపంచమనేది ఇలా, ఎవరూ తనకి ఏమీ చెప్పకుండా, ఎవరూ తనని మందలించకుండా, ఎవరూ ఏ సూచనైనా పర్యవేక్షణా చేయకుండా ఎలా ఏర్పడుతోంది? సరైన కాలం ప్రకారం ఎలా నడిచిపోతుంది? అని.
అంతే! అప్పుడు వాళ్లకి అర్థమైంది. ఓ పదార్థం+ దానిలోని చైతన్యం (శక్తి) అనేవే ఈ కదలికలూ మార్పులూ గమనాలూ... అన్నిటికీ కారణమని.
ఆ పదార్థాన్నే శివుడన్నారు. ఆ చైతన్యాన్నే శక్తి అన్నారు. ఇది శాస్త్రం ప్రకారం (భౌతికశాస్త్రం) చెప్పిన మాట అయితే, కేవలం భక్తి ప్రధానంగా దీన్ని భావించిన భాగవతులు శంకరుడూ ఆయన భార్య పార్వతీ ఈ ఇద్దరూ కలిసి ఉండే రూపమే అర్ధనారీశ్వరం అన్నారు.
Read More

Friday, 8 March 2013

1717 EAST INDIA COMPANY.

IN THE YEAR 1717 PAWAN PUTRA HANUMAN COIN MADE BY EAST INDIA COMPANY...!!!


Read More

న్యూమరాలజీ_పచ్చిఅబద్ధం

Parasu Ramudu ---- "న్యూమరాలజీ_పచ్చిఅబద్ధం" న్యూమరాలజీ అనేది ధర్మశాస్త్రాలేకాదు ఏ శాస్త్రమూ అంగీకరించని అంశం. వారేం చెబుతారంటే న్యూమరాలజీ జ్యోతిశ్శాస్త్రం నుండి పుట్టింది అని. కానీ వాస్తవాలను పరిశీలిస్తే న్యూమరాలజీలో వారు చేసేది nameలో english letters changeచేయడం. 'వేదాంగమైన జ్యోతిషంలో ఇంగ్లిష్ ఉందా?' వారు చెప్పినట్టే పేరులో ఇంగ్లిష్ లెటర్ add/delete చేయడం ద్వారా జీవితం మారిపోతుందా? దీనికి శాస్త్రీయత ఉన్నదా? "పేరులో అక్షరాన్ని మార్చితే కుచేలుడు కుబేరుడవుతాడంటే ఎంత పచ్చిఅబద్ధమో చూడండి", for suppose 'omkar' అనేపేరును 'ohmkkaar' అనిమార్చితే పిలిచే తీరు మారదు కదా! మరి ఫలితం ఎలా వస్తుంది? ఇక జ్యోతిశ్శాస్త్రం చెప్పిన తిథివారనక్షత్రయోగకరణాలను, లగ్నాలను గాలికొదిలేసి christian క్యాలెండర్ dates ను పట్టుకు వేళ్ళాడే న్యూమరాలజీ జ్యోతిషం నుండి పుట్టిందా! ముఖ్యంగా దురాశాపరులైన హిందువులకు ఇటువంటి పిచ్చి(లు) బాగాపట్టాయి, ఆ దురాశాపరులకు శాస్త్రీయత అవసరం లేదు. అప్పనంగా డబ్బువచ్చేస్తే చాలు! ఇటువంటి పనికిమాలిన వాటిపేర్లు చెప్పి దరిద్రులందరూ బాగానే ధనవంతులవుతున్నారు. అమాయకజనాలు అత్యాశలకు పోయి దిక్కుమాలిన న్యూమరాలజిష్ట్ ల మాటలు విని దేవుడిచ్చే కాన్పును ధిక్కరించి సిజేరియన్లు చేయించుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు!! §అసతోమా సద్గమయ§ *విభేదించేవాళ్ళకు చర్చకు సాదర ఆహ్వనం*
Read More

Note : important







Read More

విశ్వమత మహాసభలో ''అమెరికా సోదర సోదరిమనులారా ! అన్న ఆత్మీయ సంబోదనతో విశ్వ వేదిక పై స్వామి వివేకానంద ప్రప్రదమంగా అడుగు పెట్టారు .అక్కడకు వచ్చిన ఆరువేలమంది శ్రోతలు ఈ ఐదు మాటల సంబోదనతో 5 నిమిషాలు కరతాళ ధ్వనులతో మారుమోగించడం జరిగింది.ఒక నవీన మత ప్రవక్త వుద్బవిన్చాడని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు...ఆ ప్రసంగం లో అమెరికా దేశాస్తులను ఉద్దేశిస్తూ ''ప్రపంచం లో అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర ;సమస్త మతాలకు ,సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన దర్మం పేర ; నానా జాతులతో ,నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరిట మీకు నా అబివాదాలు ''
హిందూ మతం సర్వాన్ని తనలో ఇముడ్చుకునే తత్త్వం కలిగి వున్నదని తెలిపాక అయన ఇలా ప్రకటించారు '' ఈ ఆదునిక వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎ అతున్నత వేదాంత సత్యాల నిమ్న ప్రతి బింబాలో దాని మొదలు అతి ప్రాదమిక స్తాయి గా బావించే విగ్రహారాదన ,రకరకాల పురాణ గాధలు బౌద్దుల అజ్ఞేయవాదం ,జైనుల నాస్తికత్వం --ఇవ్వన్ని హిందూమతం లో సముచిత స్తానం ఇచ్చి చేర్చుకోబడ్డాయి .'' తన చికాగో ప్రసంగం లో వివిధ మత శాఖల అనుయులను ఎకీకకరణం చేసే నవీన సిద్దాంతాలు స్వామి ప్రతిపాదించారు.
విశ్వమత మహా సభలో అందరికి అబిమాన వక్త అయ్యారు ఎవరైనా రణగొణ ధ్వనులు సృష్టిస్తూ మాట్లాడితే శ్రితాలను ఉత్తేజం చేయడానికి ...తరువాత స్వామి వివేకానంద ప్రసంగం వుందని ప్రకటించే వారు .
''ఇది స్వామి జీవిత చరిత్ర నుండి సెకరించనైనది''
Bala Krishna Cherupally

Read More

గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి?

ఓం
Secrets of Sacred River Ganga-1
గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో రహస్యాలేంటి?

ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రందాహాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.

యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :

1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin) ' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్ డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. ఇది మన గంగమ్మ తల్లి శక్తి.

సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది గంగకున్న శక్తి.

ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక్తి.

To be continued ..............................
Read More

చరిత్ర....
1947కు ముందు ...తరువాత...

....
బ్రిటిష్ పాలనలోని బొంబాయి, మద్రాసు, కలకత్తా ప్రెసిడెన్సీలతోపాటు 565 చిన్న, పెద్ద సంస్థానాల విలీనంతో 1947లో ఇండియన్ యూనియన్ @భారతదేశం ఏర్పాటయింది....అదే సమయంలో మతం ప్రాతిపదికన పాకిస్థాన్ ఏర్పడింది.
....
1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత ఇండియన్ యూనియన్ వెలుపల మూడు పెద్ద సంస్థానాలు.... జమ్ము-కాశ్మీర్, హైద్రాబాద్ నిజాం, జునాగడ్ సంస్థానం. ఒక పోర్చుగీసు రాష్ట్రం గోవా డయ్యు, డామన్, పుదుచ్చేరి లు ఉన్నాయి.
....
ఇండియన్ యూనియన్‌లో చేరడమా, చేరకపోవడమా లేక స్వతంత్రంగా ఉండటమా అనే విషయమై సొంత నిర్ణయం తీసుకొనేందుకు రాచరిక పాలనలో ఉన్న సంస్థానాలకు బ్రిటిష్ పాలకులు స్వేచ్ఛనిచ్చారు...ఈ మేరకు పెద్ద సంస్థానాలైన జమ్మూ -కాశ్మీర్ ...ముస్లింలు అత్యధికంగా ఉన్న రాజ్యం, అయితే రాజు హిందూ మతస్థుడు, హైదరాబాద్..హిందువులు అత్యధికంగా ఉన్న రాజ్యం, అయితే పాలకుడు ముస్లిం మతస్థుడు, జునాగఢ్...పాలకుడు ముస్లిం నవాబు, సిక్కిం సంస్థానాదూశులు, స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నాయి. గోవా, పోర్చుగీసు పాలనలో ఉంది. మిగతా సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి అంగీకరించాయి. కాశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ 1947 అక్టోబర్‌లో ఇండియన్ యూనియన్‌లో చేరడానికి అంగీకరించాడు. 1948 ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ ఫలితంగా జునాగఢ్ భారత్‌లో చేరడానికి అంగీకరించింది. 1961లో గోవాను, 1975లో సిక్కింను భారత్ తనలో కలుపుకొంది. దీంతో నేటి సంపూర్ణ భారతావని ఏర్పడింది..@ బహుజన బంధు.
Read More

చర్లపల్లి జైల్లో అన్యమత ప్రచారం ! దేనిని వదిలిపెట్టడంలేదు !

చర్లపల్లి జైల్లో అన్యమత ప్రచారం ! దేనిని వదిలిపెట్టడంలేదు !

Read More

మత మార్పిడి చేసేవారికి చక్కటి సమాధానం

ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి చేసేవారికి చక్కటి సమాధానం !

=======================================

భగవంతుడు అనేకమా? సృష్తికర్తలు వేరు, వేరా? ఈ ప్రపంచంలోని జీవ రాశులను వివిధ ఖండాలని, వివిధ ప్రజలని, వేరు వేరు సృష్తికర్తలు సృజించారా? అసలు, భగవంతుడికి మతమేంటి? ఏ భగవంతుడు తనకు ప్రచారం కావాలని అడిగాడు? ప్రతి మనిషిలోను భగవంతుడుని చూడమనే సనాతన ధర్మాన్ని మించినది మరోకటి కనిపించదే. భగవంతుడికి ఒక మతం అంటకట్టి ప్రచారం చేసే ఎవరు కూడా నీలోనే భగవంతుడ్ని చూడమని చెప్పరెందుకు? కేవలం ఒక మతానికి చెందిన ప్రజలే ప్రపంచమంతట ఉంటే ఆ మతమే గొప్పదన్నదే సిద్ధాంతమైతే, ఆ మతాలు లేనప్పుదు ప్రపంచం లేదా, మనుషులు లేరా, జీవనం లేదా? మంచి భగవంతుడు, చెడ్డ భగవంతుడు ఉంటారా? మా దేవుడు, మీ దేవుడు అని వేరు వేరుగా ఉన్నారా? ఈ చరా చర జగత్తులో ఉన్న 74 లక్షల జీవ రాశులలొ ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ, మగ. ఆకలి, నిద్రా, భయం, మైధునం అనే లక్షణాలు జీవ కోటి అంతటికి సమానమే. ఈ 74 లక్షల జీవరాసులలొ మనిషికి మాత్రమే ఆలొచించగలగే శక్తిని, విచక్షణని, మాట్లాడగల శక్తిని అదృష్టాన్ని ప్రసాదించాడు. కాని మనిషి మాత్రం జ్ఞానసముపార్జన పేరుతో తన అజ్ఞానాన్ని పెంచుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడు.

-వాసుదేవరావు కొండూరు
Read More

బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను నిరసిస్తాను

మనుషులుగా వెళ్లి గొర్రెలుగా వస్తున్న మన విద్యా విదానం ....నిజరూపం చుడండి .
మన విద్య విదానం ఎలా వున్దకుదదో అలా వుంది....
స్వామి వివేకానందుడు తన రచనలలో విదేశీ విద్యా విదానం ఎటువంటి మానసిక బానిసత్వాన్ని గురుచేస్తుందో....ఇలా చెబుతారు..

''బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను నిరసిస్తాను . పురుషుడు కాని ,స్త్రీ కాని ,బిడ్డ కాని శారీరక ,మానసిక , తాత్విక విషయాలలో దేనినైన శిక్షణ గ్రహిస్తున్నప్పుడు వారు తగిన పుష్టిని కలిగియున్నారా .. లేదయని విమర్శించుకోవాలి . వ్యక్తిని సమకుర్చేది సత్య సందత మాత్రమె .సత్యమే జీవితానికి మూలదారం .సత్యం అలవార్చుకోటానికి ద్రుడత్వం కావాలి.కనుక మనస్సును బలహీన పరిచే ఎ విదానం కూడా వ్యక్తిని చాదస్తునిగా ,నిస్తేజునిగా ,వ్యర్ద ఆలోచనలకూ నిలయునిగా తయారు చేస్తాయి . అలాంటి సంస్తలు ఎలాంటి మంచి ఫలితాలని సమకుర్చక పోగా , వ్యక్తిలో మానసిక దౌర్బల్యాన్ని ,నిస్సత్తువను పెంచి సత్యాన్వేషణకు అనర్హునిగా చేస్తుంది ''
''స్వామి వివేకానంద ''
అటువంటి విద్యావిదానాన్ని చదువుకొని ..మనం ఉత్త అప్రయోజకులం ..పనికి రాని వారం అని చదువుకుంటూ...విదేశీ రాజులు మనలని అంతా అద్బుతం గ పరిపాలించారు...వారి ఎన్నో రకాలుగా ప్రజలను మెప్పించారు....లాంటి అత్మగోరవం లేని విధ్య చదువుకుని ఎలాంటి వారు తయారు అవుతాము....దేశం లో ఒక ''మెకాలే '' విద్యావేత్త చెబుతూ భారత్ ను దెబ్బ కొట్టాలంటే వారి సంప్రదాయిక విద్యని నాశనం చేస్తే వారు ఆటోమాటిక్ కా చరిత్ర లేని వారిగా బ్రమించి మనకు నిత్యం బానిసలుగా వుంటారు...వారు గొప్ప చరిత్రకు వారసులు అన్న విషయం వారికి తెలిస్తే ఇక వారిని మనం పరిపాలించడం అసంబవం అని అంటాడు....
చివరకు మనలను బానిసలుగా చుసిన వాడు రాసిన విద్యనూ చదివి ఇదే నిజమైన చరిత్ర అనుకుని దానిని ఆచరిస్తూ,...నిత్యం దేశం పట్ల ప్రేమ లేని వారిగా ...నిస్తేజప్రజలుగా ...మిగిలి పోయాము....

చాల మంది మాకు దేశ బక్తి ఉందండి...అని జెండా పండుగలు చేసుకుని గాంధి కి దండ వేసి...పిప్పరమెంట్ బిళ్ళలు తిని ఇంటి కి వెళ్లి ...పడుకున్తున్నాము...
కాని దేశ బక్తి అంటే జెండా పండుగ రోజు జెండా ఎగురవేసుకోవడమేనా .. స్వతంత్రం ఎలా వచ్చిందో మనకు సంబంధం లేని విషయం గా చూస్తూ ...ఏదోలా రోజు గడిచేలా చేస్తున్నాము...
దేశం అంటే సరిహద్దులు మాత్రమేనా....దేశం అంటే మట్టి మాత్రమేనా...ఎలా దీనిని పరిగణించాలి .....దేశం సరిహద్దులు అన్ని దేశాలకు వుంటాయి....కాని మన దేశానికి వేలాది సంవత్సరాల చరిత్ర వుంది మనం నమ్ముతామా...లేక విదేశీయులు ..చెప్పినట్లు....4000 వేల సంవత్సరాలకిందనే సృష్టి మొదలయ్యింది అనేవారికి ఇప్పుడు ప్రపంచం దొరుకుతున్న ...ఆనవాళ్ళు ఎలాంటి సమాదానం చెప్పాలి.....
దేశం అంటే సంస్కృతీ,వారసత్వ సంపద,,పురాతన మన చారిత్రక యుగపురుషులు.వేదాలు,ఉపనిషద్ లు ,మన గాధలు ఇవన్ని మన దేశానికి గుర్తింపు నిచ్చే ''ఆస్తులు ''
వాటిని గురుంచి తప్పుడుగా చదువుకుని సమస్యలకు మూలం ఇవే అనేలా చరిత్రని తప్పుడు గా రాసిన బ్రిటిష్ వారు....,వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్ట్ లు ...దెశబక్తి లేకుండా...దేశం పైనే యుద్ధం ప్రకటించే లా చేస్తున్నారు.....
మనలని తల ఎత్తుకుని నిలబడేలా వున్నా మన చారిత్రక సంపదను ,మన శాస్త్రాలను ,వేదాలను ,అద్యయనం చేసి వాటిలోని అనేక విలువైన సమాచారాన్ని భారత్ ప్రజల ఆస్తిగా మలచవలసిన అవసరం వుంది ...

జాగో భారత్.......భారత్ మాతాకి జై Bala Krishna Cherupally


Read More

గుండె తరుక్కు పోతుంది....

గుండె తరుక్కు పోతుంది....

నకిలీలు, దేశ ద్రోహులు నాయకులై రాజ్యమేలుతుంటే...జాతిగౌరవానికై ప్రాణాలు అర్పించిన దేశ భక్తుల వారసులు రోజు కూలైయారు...
దేశ ద్రోహులు, జాతి శతృవులు కోట్లకొద్ది అక్రమ సంపాదన చేసి విదేశీ బ్యాంకుల్లో దాసుకుంటున్నారు.
దేశ భక్తుల, స్వతంత్ర వీరుల వారసులు రోజుకూలీలుగా బతుకుతున్నారు...స్వతంత్ర సముపార్జనం చేసింది దేశ-జాతి ద్రోహులను పాలకులుగా చేయడానికేనా..?
నిజంగా దేశభక్తులుమై మీ ముందు తలదించుకుంటున్నాము జీత్ సింగ్ సాబ్..మీ ముందు తలదించుకుంటున్నాము ..@ బహుజన బంధు.


Read More

క్రిస్టోఫర్ కొలంబస్

క్రిస్టోఫర్ కొలంబస్ ..స్పెయిన్ దేశస్తుడు ...ఇతను అమెరికా కనుగొన్నాడు అనే గొప్ప పేరును పొందిన వాడు . ఇది బ్రిటిష్ వాడు మన దేశ చరిత్రను వక్రీకరించినట్టు...ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్రను హీనం గా చిత్రీకరించి ప్రపంచం లో అందరికి మేలు చేసినట్టు నటిస్తున్నవి....
కాని యితడు ..నల్ల జాతి దేశాలనుండి నల్లజాతి వారిని చెరబట్టి బానిస వ్యాపారం చేసే ఒక క్రూరమైన వ్యక్తీ....కాని తెల్ల మీడియా అతనిని అమెరికా కనుగొని వారిని ప్రపచానికి తెలిపిన వ్యక్తిగా ప్రచారం చేస్తుంది ...
''నిజానికి ఆటను తానూ క్రైస్తవ ప్రచారం కోసం కొత్త ప్రాంతాలు వెతుకుటకు అని తన డైరీ లో రాసుకున్నాడు ..[కొలంబస్ బుక్ అఫ్ ప్రోఫేసీస్ ]అన్ ఎబూక్ వాటి వివరాలు చెప్పాడు....
స్తానిక ప్రజలలో ఎంతో ఆదరణ ను చూసి కూడా..తన క్రైస్తవ మతం కోసం వారి బూములను ఆక్రమించుకోడానికి ఊచకోత కోయడానికి వెనకాడలేదు ...
రెండో సారి దురాక్రమణలో కొలంబస్ కాలు పెట్టిన ప్రతి దగ్గర అతని అనుచరులు ప్రజలను కనిపించిన వారినందరినీ చంపికుంటూ వెళ్లారు...దొరికిన వారిని బానిసలుగా ,లేక చంపడమో చేసారు...అప్పుడు కొలంబస్ ఇలా అంటున్నాడు...''స్తానిక ప్రజలు ఊడిగం చేయడానికి బాగా పనికి వస్తారు .వెళ్ళాను క్రైస్తవులుగా మార్చడం సులబం ఈ విధం గా యేసు జోస్యాన్ని నిజం చేస్తాను ''...
ఇలా సాగింది క్రూర క్రైస్తవ మత దోపిడీ....బానిసత్వం ను క్రైస్తవం పాటించని వారు అనుబవించాలి అని , లక్షాలాది మంది ని చంపినా మతం శాంతి మతం ఎలా అవుతుంది....అయితే ఎప్పుడో మార్చబడిన ఆఫ్రికా దేశాలు ఇంకా తెల్ల వాళ్ళ చేతుల్లో బూములు ,ఆకలి పేదరికం లో ఎందుకు వుంది...
కాబట్టి దోపిడీ క్రూరత్వం ప్రాతిపదికిన ఏర్పడిన మతం భారత్ లో విద్వేషాలు చేస్తుంది అని నిరూపణ అయ్యింది...

అందుకే మతం మారకు సోదర...జాగో భారత్ ...భారత్ మాతా కి జై
Bala Krishna Cherupally



Read More

యోగా యోగా యోగా యోగా

ఇలా యోగా తో మనిషి గాలి లోకి లేవడం కొంచెం ఆలోచించాల్సిన గొప్ప విషయం ...ఎందుకంటే ఇటువంటి గొప్ప యోగా ఒక్క భారత్ కె సొంతం ...ప్రపంచం లో ఇటువంటి విద్యలు ఎక్కడ వుండి వుండవు.....కాని మన వెదవలకె అంత తొందరగా అర్ధం కాదు....ఇది చూసి కూడా తూచ్ ....అనతరేమో కదా ...? 

Read More

Note : Important


Read More

Note : Important

ఎందుకని క్రైస్తవ దేశాలు పని కట్టుకుని భారతదేసంలో ఉన్న ముస్లిముల,హిందువుల మద్య గొడవలు పెడుతున్నాయో తెలియటంలేదు ???
భారత దేశం , ఆర్ధికంగా,సామాజికంగా,సాంకేతికంగా, మత ఘర్షణలతో, కుల ఘర్షణలతో కుంగిపొవడమె క్రైస్తవ దేశాలకు కావలసినది.
వాడెవడో దిక్కుమాలిన వెదవ "క్యాంప్ బెల్ " ఒక చిన్న యూనివర్సిటీ లో ప్రొఫెసర్ భారత దేశం లో ఒక్క ముస్లిం కూడా రాజకీయనాయకుడిగా లేదని, ఒక్క ముస్లిం కూడా ప్రభుత్వ ఉద్యోగం లేదని అంటే , మన ఆంధ్ర ప్రదేశ్ లో ఒక దిక్కుమాలిన పేపర్ దానిని మెయిన్ adition లో, పెద్ద వార్త లా వేసి పైశాచిక ఆనందం పొందుతోంది.
భారత ఉపరాష్ట్రపతులు, యంపి లు ,యమ యల్ ఏ లు, సెంట్రల్ మినిస్టర్ లు ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు భారతదేశం లో ఇది అందరికి తెలిసిన విషయం. .
Read More

వీర మాత జీజాభాయి:-

ఒక కుండ మంచి ఆకారంతో, మన్నికతో, నాణ్యతతో రూపు దిద్దుకోవాలంటే అది కుమ్మరి సృజనాత్మకత, నిపుణత మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే ఛత్రపతి శివాజీ మహరాజు కూడా హైందవి స్వరాజ్యం స్తాపించడానికి అడ్డుపడుతున్న శత్రువులను ఎదురుకోవడానికి ఎంతో శిక్షణ పొందారు.

మాత జీజాబాయి మ్హకసా బాయి, మరియు లఖొజి జాదవ్ కు సింధ్ఖెడ్ రాజ్యంలో జన్మించారు. ఆమె పెరిగేకొద్ది, మొఘలాయుల పాలనలో హిందువులు అనుభవించే బాధలు ఆమేకు అవగాహనకు వచ్చేవి. ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకునే వయస్సులో జీజాభాయి కత్తి స్వాము నేర్చుకునేది. జీజాభాయి తల్లి కూడా ఆమెకు సాహసం కు సంబంధించిన కథలు చెప్పి ఎంతో శిక్షణ ఇచ్చేది.

దేశం పరిస్థితి ఎలా ఉండేది అంటే మొఘలాయులకు సేవ చేయుట, వారి కింద అధికారులుగా పని చెయుట, వారి కోసం సొంత ప్రజలనే ఎత్తుకొచ్చి వారికి అప్పగించుట. హిందూ స్త్రీలు ముస్లింలచే అపహరింపబడి అమ్ముడుబోయేవాళ్ళు! అయినా సమాజం నోరుమెదపకుండా చూస్తూ ఊరుకునేది. రైతులు ఖాళి కడుపులతో మొఘలాయుల కోసం రెక్కలు ముక్కలు చేసేవాళ్ళు. ఈ అన్యాయన్ని ఎదిరించడానికి ఒక వ్యక్తి కోసం జీజా భాయి ఎదురుచూస్తోంది.

1605 లో జీజాభాయి సహాజి రాజె భొన్సలే ని పెళ్ళాడింది. తన ప్రార్థనల తో అమ్మ భవానిని "మంచి తేజస్సు, సాధన, స్వరాజ్యాన్ని స్తాపించగల సామర్ధ్యం గల పుత్రుడిని ప్రసాదించమని కోరుకునేది.

సహాజి రాజుని పెళ్ళడిన తరువాత, తన భర్త మొగల్ రాజుల దగ్గర, అదిల్ షా, నిజాం షా దగ్గర తక్కువగా చూడబడడం, అవమానింపబడడం సహించలేకపోయేది. తన భర్త ఎంత శక్తివంతుడు అయినప్పటికి తగిన గుర్తిపు, భధ్రత లేవు అని మరియు సమాజానికి తోడ్పడదం లేదని భావించేది. బిడ్డ పుట్టకముందే అతడి లక్ష్యాన్ని నిర్ణయించిన ఎకైక స్త్రీ ఈ చరిత్రలో మాత జీజాభాయి ఒక్కరే !

అమ్మ భవాని జీజాభాయి కోరికను తీర్చింది. ఎందుకంటే జీజాభాయి బాధలను అమ్మ కూడా పంచుకుంది. స్త్రీ అపహరణ, ఆలయాల కూల్చివేత, శత్రు సైనికులైన మొగల్, అదిల్ షా, నిజాం షాహ్ ఆలయాల్లోని విగ్రహాలను పగలగొట్టుట ఇవన్నీ చూడలేక అమ్మ భవాని, జీజాభాయి హైందవి స్వరాజ్యం స్వప్నాన్ని పంచుకున్నారు.

మాత జీజాభాయి శివాజీకి రాముని, కృష్ణుని, భీముని కథలు చెప్పి అన్యాయన్ని ఎలా ఎదిరించాలో, అమాయక ప్రజలను బానిసత్వం నుండి ఎలా విముక్తి చేయాలో బొధించేది. ఈ కథలన్నిటిని విన్న శివాజీ స్వేచ్ఛయే దారిగా అదే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు.

జీజా మాత శీవాజికి రాజనీతి కూడా బోధించేది. శివాజీ ని ధైర్య సాహసాలతో పోరాడేటట్టుగా తయారు చేసింది. తానే సొంతగా శివాజీ వివిధ ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నపుడు పర్యవేక్షించేది. జీజా మాత అందించిన దిశానిర్దేశకత్వంతో, శివాజీ ఎన్నో పరిస్థితుల నుంచి అద్భుతంగా బయటపడగలిగాడు. అఫ్జల్ ఖాన్ని వధించుట, ఆగ్రా లో బంధిస్తే తప్పించుకొనుట మొదలగునవి.

జీజా మాత రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించింది. తల్లిగా ప్రేమని పంచిపెట్టింది మరియు తండ్రిగా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రతిభ, తెలివి తేటలను నేర్పించింది.

కేవలం జీజా మాత అందించిన శిక్షణ వలనే, శివాజీ మహరాజ్ కొన్ని శతాబ్ధాల ముస్లిం పాలనను మట్టికల్పించి హైందవి స్వరాజ్యాన్ని స్తాపించాడు.

శివాజీ మహరాజ్ ఛత్రపతిగా పట్టాభిషక్తుడయ్యెవరకు జిజా మాత బ్రతికే ఉన్నారు. తన భర్త తోడు లేకపోయినా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి, హైందవి స్వరాజ్యం స్తాపింపబడడానికి ఎంతో తోడ్పడ్డారు. శివాజీ మహరాజ్ కు పట్టాభిషేకం అయిన 12 రోజుల తరువాత స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు.

*గమనిక: ఈ వ్యాసం "హిందూ జనజాగృతిలో ప్రచురించబడిన ఆంగ్ల వ్యాసంలోంచి అనువదింపబడినది. ఆంగ్ల వ్యాసం చదవదలుచుకుంటే ఈ లంకె లోకి వెల్లండి: http://www.hindujagruti.org/articles/37.html

Read More

Narendra Modi,

There can't be a better proof of dalal ( Paid ) media's shameful suck-up for Rahul Gandhi and their blatant hatred for Narendra Modi, than this side-by-side comparison.

Read More

జలయజ్ఞం...

జలయజ్ఞం...
ధనయజ్ఞమేనని....కాగ్ సంచలన నివేదిక.

కోటి ఎకరాల పేరిట 70 వేల కోట్లు ఖర్చు..23 లక్షల ఎకరాలే చూపిస్తున్నారే..
ఆయకట్టు అంతా కనికట్టే...వందల కోట్ల పనులు నిరర్థకమే
కాంట్రాక్టర్లకు అపరిమిత మేళ్లు...వారి అడుగులకు మడుగులొత్తారు
నిబంధనల మార్పు, అడ్డగోలు చెల్లింపులు...ఖజానాకు కనీసం 15 వేల కోట్ల నష్టం
....
2004-05 నుంచి 2011-12 వరకు, జలయజ్ఞం ధనయజ్ఞమేనని కాగ్ నిగ్గు తేల్చింది. ఆయకట్టు కనికట్టేనని... 'మేళ్లు' జరిగింది కాంట్రాక్టర్లకేనని స్పష్టంచేసింది.
Bala Krishna Cherupally

Read More

తొలి విజ్ఞానఖని నలంద విశ్వవిద్యాలయం:

తొలి విజ్ఞానఖని నలంద విశ్వవిద్యాలయం:
ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి.నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది.నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది. నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు.

బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెండు పదాల కలయిక ద్వారా పుట్టిందే ‘నలంద’.

వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచం లోనే పేరిన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్గ్జ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞానఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బిహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.

ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాల నుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు.10 సంవత్సరాలకు పైగా ఉండి విజ్ఞానశాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు.

క్రీ.శ. 1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి.గణితం,విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు.

భారత విజ్ఞాన వినాశనం...పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు.శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.
Read More

New Evidence of Ancient Indian Science Of Space Travel Source

विज्ञान प्रसार (वि.प्र.) विज्ञान एवं प्रौद्योगिकी विभाग, भारत सरकार की रिपोर्ट

New Evidence of Ancient Indian Science Of Space Travel Source:

Conspiracy Journal#205 April 11, 2003

कुछ सालों पहले चीन पुरातत्त्व सरकार ने ल्हासा तथा तिब्बत में संस्कृत दस्तावेजों की खोज की है और उन्हें अनुवाद करने के लिए University of Chandigarh भेजा गया है।

इस विश्वविध्यालय की Dr. Ruth Reyna ने बताया कि इन दस्तावेजों में विमान का अंतरतारकीय माध्यम के निर्माण करने की बिधि दी है।

अंतरखगोलीय माध्यम या अंतरतारकीय माध्यम हाइड्रोजन और हिलीयम के कणों का मिश्रण होता है जो अत्यंत कम घनत्व की स्थिती मे सारे ब्रह्मांड मे फैला हुआ रहता है।

अंग्रेज़ी में "अंतरतारकीय" को "इन्टरस्टॅलर" (interstellar) और "अंतरतारकीय माध्यम" को "इन्टरस्टॅलर मीडयम" (interstellar medium) कहते हैं।

उन्होंने आगे बताया विमान को संचालित करने के लिए गुरुत्वाकर्षण विरोधी (anti-gravitational) शक्ति की आवश्यकता होती है और anti-gravitational की प्रणाली "laghima" शक्ति प्रणाली अनुरूप होती है।

"laghima" की संस्कृत में सिद्धि कहते है और इंग्लिश में levitation कहा जाता है। levitation की शक्ति को आप इस विडियो में देख सकते हैं जो की anti-gravitational होती है।

यही अंतरतारकीय माध्यम (interstellar medium) विमान के अन्दर levitation power को activate करता है और विमान ऊपर की ओर उठता है।

http://www.youtube.com/watch?v=SnLj8DMqaC8

http://www.youtube.com/watch?feature=player_embedded&v=tW6pVFOpE6Q#!

http://www.virtualsynapses.com/2010/09/power-of-levitation-laghima.html#.URjNix04uIA

जैसा की हम अपने ग्रंथो में देखते हैं कि भगवन, ऋषि तथा कई देवता वायु मार्ग द्वारा आते थे। ये वही anti-gravitational वाली levitation शक्ति का प्रयोग करते थे।

इसी levitation शक्ति (विमानों के लिए) का वर्णन और प्रणाली, चीन को उन दस्तावोजों में मिली है। जिसका अनुवाद किया जा रहा है।

levitation power कोई तंत्र विद्या द्वारा नहीं की जाती है। यह एक ब्रह्मांडीय शक्ति है। जिसको करने के लिए तप और कई नियमों का पालन करना पड़ता है।

http://www.vigyanprasar.gov.in/comcom/vimana.htm


।। जयतु संस्‍कृतम् । जयतु भारतम् ।
Read More

4000 YEARS OLD VIMANA

Will see How Many Bharatiya will share this ?

4000 YEARS OLD VIMANA (AIRCRAFT) FOUND IN AFGHANISTAN . Its the same aircraft Mentioned in "MAHABHARATA" - Russian Foreign Intelligence

- http://reinep.wordpress.com/tag/5000-year-old-viamana-craft-was-found-in-afghanistan/
Read More

రథ సప్తమి :-


రథ సప్తమి :-

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:

రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.

జిల్లేడు(అర్క):

శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ, బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.

రేగు చెట్టు:

(బదరీ) దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా తెలిసికొని ఉపయోగించాలి.)

మాఘప్రశస్తి:

మా+అఘ=పాపంలేనిది - పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా - రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

రధసప్తమినాటి శిరస్నానం వేళ

పఠించవలసిన మంత్ర శ్లోకం:

య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!
 
 
 
 
Read More

మౌనం అంగీకారమేనా...?

మౌనం అంగీకారమేనా...?

మతం, అధికారం ముసుగులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రద ర్ అనిల్‌కుమార్ , కూతురు షర్మిల అక్రమాస్తులు కూడబెట్టారంటూ... పలు వివరాలతో ఆరోపణలు చేస్తే... ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పలేదు. తాను ఆరోపణలు చేసి పక్షం రోజులు గడుస్తున్నా... ఎలాంటి సమాధానం చెప్పలేదు... అంటే 'మౌనం అంగీకారమేనా, అవన్నీ వాస్తవాలు అయినందునే మాట్లాడడం లేదా..' మతం, అధికారం ముసుగులో దోచుకోవడం, దాచుకోవడానికి పాల్పడిన అనిల్, షర్మిల అక్రమాస్తులపై త్వరలోనే పార్టీ నేతల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలుస్తాం. వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణను కోరతాం, రాజకీయం గానూ పోరాటం చేస్తాం. మణికొండ భూ భాధితులు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. గవర్నర్ వద్దకు వారినీ కూడా తీసుకెళతాం..'' అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు..@ బహుజన బంధు.


Read More

స్వామి పరిపూర్ణానంద స్వామి వారితో TV 9

ఈ మద్య కాలంలో స్వామి పరిపూర్ణానంద స్వామి వారితో TV 9 వారు ఎన్ కౌంటర్ కార్యక్రమం చేసారు దానిలో చర్చ రథయాత్ర , అమ్మ ఒడి కార్యక్రమాల గురుంచి . ఆ సమయంలో ఒక క్రైస్తవ పాస్టర్ స్వామి వారితో పోన్ లో ఇలా ప్రశ్నించాడు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయు మీ హైందవ సంస్థలు ఇలాంటివి చేయరు . మంచి పనులు చేస్తున్న మాపై బురద ఎందుకు చల్లుతున్నారు అని ఇంకా చాలా అన్నారు దానికి స్వామి వారు ఇలా సమాదానం చెప్పారు , "అసలు భారతదేశంలో ఇతర మతస్తులు అడుగు పెట్టనంత వరకు ఈ దేశంలో పిల్లలకు "తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా! విశ్వదాభిరామ వినురవేమ!" లేదా "తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన శ్రావణకుమారుని కథలు" ఇలాంటివి నేర్పేవారము ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అచార వ్యవహారాలు ,అతిది మర్యాదలు, అన్ని జంతువులను భగవత్ భావనతో చూడటం చేసేవారము. ఎప్పుడైతే ఈ దేశంలోకి విదేశి పైశాచిక మతాల ప్రవేశం జరిగిందో వారు అప్పటి నుంచి హైందవ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు . మాలో మాకు గొడవలు పెట్టారు మతాల వారీగా మమ్మల్ని విడగొట్టారు. కుటుంబ వ్యవస్థను విలువలను పాడు చేసారు. అలా జరగడం వల్ల పిల్లలు తల్లి తండ్రులను గెంటేయడం , సమాజంలో ఎవరి స్వార్దం వారు చూసుకోవడం లాంటివి ప్రవేశించి మీరు సేవ చేయడానికి మనుషులు దొరుకుతున్నారు, కాని ప్రాచీన హైందవ దేశంలో నువ్వు సేవా చెద్దామన్నా నీకు మనిషి కనపడదు నీకే అందరు అతిది సత్కారం చేస్తారు అలాంటి వ్యవస్థను నాశనం చేసి ఏదో సేవ చేస్తున్నాము అని మీరు చెప్పడం ఒక మనిషిని చావబాదుతూ మళ్ళి మందు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. విలువలు లేని జీవితాలు జీవిస్తూ రోగం వచ్చాక మందు రాసుకునే వారు మీరు, రోగాలు లేకుండా జీవించే వాళ్లం మేము అని చాలా అద్బుతంగా అతనికి సమాదానం చెప్పారు మన స్వామి వారు.
Read More

ఇది చూసి గుడి అనుకునేరు మిత్రులారా

ఇది చూసి గుడి అనుకునేరు మిత్రులారా ......ముస్లిం ల చే అక్రమించుకోబడిన గొప్ప బోజరాజు కట్టించిన వాగ్దేవి గుడి ..నేటి మసీద్
మన దేశం లో బొజ రాజు చరిత్ర తెలియని వారు అరుదే ...కాని కొంత తెలుసుకోవాలి....బొజ రాజు అద్బుత మేధావి...మంచి పరిపాలకు...సరస్వతి దేవి ని కొలుస్తూ ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని పంచాడు . అతని హయాము లో ఒక అద్బుత వాగ్దేవి దేవాలయం కట్టించాడు....దానిని అన్ని రకాలుగా విజ్ఞాన కేంద్రం గా అబివృద్ది చేసారు...

కాని విదేశీ తురుష్కులు దానిని ఆక్రమించుకుని ....ఉన్న గుడిలోనే మసీద్ ఏర్పాటు చేసారు...ఇప్పుడు గుడి లోనే నిర్దాక్షినం గా మసీద్ నడుపుతున్నారు ...కాని వారం లో ఒక్క రోజు హిందువులకు అనుమతిస్తూ ...అవమానాల కు గురి చేస్తున్నారు...
Bala Krishna Cherupally


Read More

కోహినూర్ మాదే..

కోహినూర్ మాదే...

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన 105 క్యారెట్ల కోహినూర్ ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శనలో ఉంది. కోహినూర్ వజ్రాన్ని 1850 సంవత్సరంలో నాటి గవర్నర్ జనరల్ డల్ హౌసీ బ్రిటిష్ రాణి విక్టోరియాకు బహూకరించారు. దీన్ని ప్రస్తుత ఎలిజబెత్ మహారాణి తల్లి తన కిరీటంలో పొదిగించుకున్నారు. మహాత్మాగాంధీ మనవడితో సహా భారతీయులంతా ఎప్పటి నుంచో కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత దేశానికి బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 1997లో ఉత్సవం చేసుకున్నప్పుడు రెండో ఎలిజబెత్ మహారాణి భారత్ రాగా, ఆ వజ్రాన్ని తిరిగివ్వాలని అనేకమంది భారతీయులు ఆమెను డిమాండ్ చేశారు.
ఇప్పుడు భారత ప్రయాటనలో ఉన్న బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కోహినూర్ వజ్రం తమదేనని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు తిరిగిచ్చేది లేదనిస్పష్టం చేశారు..@ బహుజన బంధు.


Read More

అంబేడ్కర్- Golden words

@gunda mallikaarjun,హిందూ అంటే స్వచ్చాజీవన విధానం
నేను క్రైస్తవం స్వీకరిస్తే ఈ దేశసంస్కృతిని మరచిపోతా
నేను ఇస్లాం స్వీకరిస్తే ఈ దేశాన్నే మరిచిపోతాను
అందుకే ఈ దేశం , సంస్కృతిని ప్రతిబింబించే భౌద్థాన్ని స్వీకరిస్తాను- అంబేడ్కర్
Read More

దేశ సంస్కృతిని అర్ధం చేసుకోలేని వారు

వితండ వాదం ...బాగా అలవాటు అయ్యింది...దేశ సంస్కృతిని అర్ధం చేసుకోలేని వారు....ఈ దేశం లో హిందువు అన్న పదం ఒక్క మతానికి చెందింది కాదు....అని విదేశీయుడు వచ్చి దీని ప్రచారం కలిపించాడు ....
ఈ దేశం లో వున్నవాడు హిందుస్తానీ అని అంటారని నువ్వు చెప్పిన తురకొల్లు ..హింద్ అని వాడుకున్నారు...
నీకు తురకొల్లు ,కిరస్తానోల్లు తెలుసా....ఎలా తెలుసు...ఎక్కడి నుండి వచ్చారు....మనలని దోచుకున్తానికి వచ్చినాడు...బెదిరింపులకు,డబ్బు ఆశపడి మారినవారు...వూరికి పిడికెడు కూడా లేని వారు నీకు తెలుసు...మన మద్యలో ఉన్న వారు నీకు తెలియదు...నీకు తెలిసిన కిరస్తానోడు..ఇక్కడి పోచమ్మ ప్రసాదం పెట్టి చూడు....నీవు చుసిన తురకోడికి మైసమ్మ ఏట మాంసం పెట్టి చూడు ..తింటే అప్పుడు ఇలాంటి ప్రేల్లపణలు వింటారు...అంతే గాని అయన ముట్టుకోనివ్వలేదు ...కాని వాడు నిన్ను నీ తిండిని అంటుకోలేదు....మనవాడు ఇవ్వాళా మారడానికి సిద్దంగా వున్నాడు...నీవు చెప్పినాడు ఎవడు సిద్దంగా లేదు...నేను చెప్పిన పోచమ్మ ,మైసమ్మ ప్రసాదం తినడానికి ...
ప్రతి దానికి ఒకే హిందూ వ్యతిరేకతను నవ్వుకుంటారు...ప్రజలు

ఈ దేశం లో రకరకాల పద్దతులు పాటిస్తారు...వారిని ఒక ఛత్రం లోకి చేసి హిందువులుగా చెప్పిన అంబేద్కర్ నీకు పిచ్చివాడి లాగ కనబడుతున్నడా....ఎప్పుడు హిందూ అనగానే వెర్రి ఎత్తినట్టు వ్యతిరేకించడం మానుకుంటే చరిత్ర తెలిసిన వారుగా అంగీకరిస్తారు...అంబేద్కర్ తన రచనల్లో ఎందుకు హిందూ అన్న పదం వాడారో అతని ఆలోచనలని చదివిన వారికి తెలుస్తుంది....అంబేద్కర్ ని అర్ధం చేసుకోలేని కమ్యూనిస్ట్ బావదారిద్ర సిద్దంతపు పైత్యపు పుస్తకాలు చదివి...దళితులూ ,గిర్జనులు హిందువులు కాదు ఐతే రాజ్యాంగం ను వ్యతిరేకిస్తూ...అంబేద్కర్ ని గోరవిస్తావో....లేక కమ్యూనిస్ట్ దళిత ఆలోచనలను అంగీకరిస్తావో తేల్చుకో....
దేశం లో కొంత మంది ప్రేలాపనలు దళిత బహుజనులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు....

హిందూ ధర్మ జీవన విదానం అంటే ఒక మతానికో ,,,వర్గానికో చెందింది అని ఎవరు చెప్పారో వారికి ....మీరు ప్రశ్న వేయండి....ఈ దేశం లో అనేక జీవన విదానాలు కలిస్తే హిందుజీవనవిదానం అని చెప్పిన అంబేద్కర్ మీకు ఆదర్శప్రాయుడు కాదని చెప్తే ...ఇక ఎవడు మిమ్మలిని అడగడు...
హిందుదర్మం అర్ధం చేసుకోలేని వాడు దేశాన్ని అర్ధం చేసుకోలేడు....దేశం లోని సాంస్కృతిక జీవన విలువలను దెబ్బ తీయడానికి విదేశీ మతసంస్క్రుతులు వేగంగా చొచ్చుకొస్తున్నాయి....అవి నీవు చెప్పిన గ్రామా దేవతలను,గ్రామసంస్క్రుతులను,దళిత దేవుళ్ళను బైండ్ల చరిత్రను నాశనం చేయడానికి వారి కుల చరిత్రను మరిచేలా చేసి వారి ఘనమైన గత చరిత్రను కేవలం నీచమైనదిగా చెబుతూ వారిని గతమే లేని సాంస్కృతిక జీవన విలువలు నశించి బావదరిద్రపు విదేశీ సంస్కృతిని స్వీకరించలేక మల్లి మోద నమ్మకాల వైపు పయనిస్తున్నారు...వీలైతే మతం మారిన దళిత ప్రజల జీవనవిదానం చూడు బ్రదర్....మొండి ఆలోచనలతో వ్యతిరేకిస్తే మన చరిత్రను మనం దిగాజార్చుకున్నట్లే..
.
నేను ఇలయ్య ను అబిమానిస్తా..ఎందుకంటే అతను బహుజన ప్రజల వెతలను ప్రతిబిమ్బచేసినందుకు ...కాని గమ్యం లేని ప్రయాణం ...ఎటుతీసుకెళ్ళ లేదు ...దానికి సాక్షం ఇలయ్య గారు ...వారే ఒక వ్యాసం లో ఈ సమాజం లో అసమానతలు పోవాలంటే హిందూ స్వామిజి లు నడుముకట్టి దానిని తొలగించాలని పిలుపు ఇచ్చాడు...అలాగే నేటి హిందూ సంస్కృతిని శతాబ్దాలుగా దళిత బహుజనులే దాని సంరక్షిస్తే ...దానిలో వివక్షతను గురి అవుతున్నారు....అందుకే వివక్షతను ప్రదర్శిస్తున్న పిడికెడు మందిని మెజారిటీ ప్రజలు సొంత దేవాలయాలు కట్టుకొని వారి ని బహిష్కరించాలి అప్పుడు వివక్షత అంటే తెలుస్తుంది అన్నాడు....అతని మార్గం ఏమిటో ....అతను పూర్తిగా వేరుచేయలేకుండా ఉన్న దళిత బహుజన హిందూ ప్రజలకు ఒక మార్గం చూపాడు కాని మీలా తికమక బాషలో మాట్లాడలేదు....
అందుకే హిందుత్వాన్ని తిట్టడం కంటే దానికి ఆదిపత్యం వహించి....సంస్కరించుకోవాలి ..కాని దూరం గా పారిపోతే ఎప్పుడు అర్ధం కాదు సమస్య తీరదు...
Bala Krishna Cherupally
Read More

జాతికి దిశానిర్దేశం లేని రాజకీయాల వల్లే ముప్పు...!!

జాతికి దిశానిర్దేశం లేని
రాజకీయాల వల్లే ముప్పు...!!

నేటి భారతీయ సమాజంలో మతతత్వానికి, జాతీయవాదానికి, సెక్యులరిజానికిం మధ్య ప్రస్తుతం ఘర్షణ జరుగుతుంది. ఇది తరువాత రోజుల్లో సామాజిక సంక్షోభానికి, రాజకీయ అనిచ్చితికి దారి తీస్తుంది. తద్వారా ఏర్పడే రాజకీయ అనిచ్చితి వల్ల భవ్యషత్తులో భిన్నసంస్కృతుల సహజీవనం, విభిన్న భవజలాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ చెదిరిపోతున్న స్వప్నాలుగా మిగిలిపోతాయి.
నేడు భారతీయ రాజకీయ వ్యవస్థలో, జాతీయవాదం, లౌకిక వాదం ముసుగులో కొన్ని వర్గాలు నిరంకుశ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.
దేశ లౌకికవాద పునాదులను పటిష్ఠ చేసేకన్నా, తమ ఓటు బ్యాంకులను సంఘటితం చేసుకోవడమే ముఖ్యమని ప్రభుత్వాలు, పార్టీలు పనిచేస్తున్నాయి. ఏదైన ఒక మతవర్గం దూర్మౌతున్నట్లు కనిపిస్తే, దాన్ని చేరదీయడమే ధ్యేయంగా మారింది. అధిక సంఖ్యాకవర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని భావించినప్పుడు, అల్ప సంఖ్యాక వర్గాలపై కొంత కాఠిన్యాన్ని ప్రదర్శించడం. అల్ప సంఖ్యాక వర్గాలను మచ్చిక చేసుకోవడనికి మెజరిటీ ప్రజల విశ్వాసాలపై కొంత చూలకనగా మాట్లాడటం' లాంటివి జరుగుతున్నాయి.
ప్రజల విశ్వాసాల విషయంలో ఒక నిర్ధిష్టమైన విధానం లేక పోవడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే. ఈ ఓటు బ్యాకు రాజకీయాల వల్ల దేశంలో సామాజిక, రాజకీయ పరిస్థితి అదుపుతప్పి ఆంధోళనకర వాతవరణం ఏర్పడుతుంది. దీని వల్ల నిజమైన లౌకిక వాదం, లౌకిక వ్యవస్థ నాశనమౌతుంది.
నేడు దేశ లౌకిక వ్యవస్థ ప్రమాదం వైపు పయనిస్తుంది అని చెప్పడానికి ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే కారణాలు. ఉదాహరణకు మరణ శిక్షలు..బియాంత్ సింగ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన బబ్బర్ ఖాల్సా ఉగ్రవాది బల్వంత్ సింగ్ రజోనా విషయంలో పంజాబ్ అకాలీదళ్ వ్యతిరేకించడం, రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణ శిక్ష పడిన తమిళ ఉగ్రవాదులను ఉరితీయరాదంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయడం, అఫ్జల్ గురు ఉరి శిక్ష విషయంలో కాశ్మీర్ రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం జరిగాయి.
దేశ ఉన్నత న్యాస్థానం ఖరారు చేసిన శిక్షలను అమలు చేకుండా తీర్మానాలు చేయడం, వ్యతిరేకించడం, అల్లర్లను రేపడం లాంటి అలౌకిక చర్యలను ఏరకంగా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనలన్నీ మన లౌకిక ప్రజాస్వామ్యానికి మచ్చలు కాదా? ఇవి లౌకిక వాద సంక్షోభానికి నిదర్శనాలు కాదా?
మత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించినప్పుడే ఈ దురవ్యవస్థ నుంచి బయటపడగలం. భరత జాతిని బలమైన జాతిగా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విభిన్న సంస్కృతుల నెలవుగా మన సమాజాన్ని తీర్చి దిద్దుకోగలం..@ బహుజన బంధు.
Read More

మోడీని ప్రధాని చేద్దాం

మోడీని ప్రధాని చేద్దాం
దాదాపుగా పేరు ఖరారు
అంతర్గత సమావేశాల్లో బీజేపీ నిర్ణయం
సంఘ్ మనోగతమూ అదే
మార్చి తొలి వారంలో కమలం కార్యవర్గం
రాజ్‌నాథ్ టీమ్‌లోకి సంజయ్‌జోషి...
....
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు పార్టీ నేతలు, సంఘ్ పరివార్ పెద్దలు కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మార్చి నెలాఖరులో దీనిపై బీజేపీ ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మోడీ అభ్యర్థిత్వంపై ఇప్పటికే ఒక నిర్ణయం జరిగినందువల్ల మార్చి 1 నుంచి 3 వరకు ఢిల్లీలోని తలకటోరా స్టేడియంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాత్రం చర్చ జరిగే అవకాశాలు లేవని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
జాతీయ కార్యవర్గ మండలి సమావేశాల్లో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తన ఆఫీసు బేరర్ల టీమ్‌ను ప్రకటించనున్నారు. నిజానికి మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రకటించి రంగంలోకి దించాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ పార్టీ, సంఘ్ అగ్రనేతలు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని, ప్రకటిస్తే ఆయనను ప్రధాని అభ్యర్థిగానే ప్రకటించాలని చెప్పారని తెలిసింది. కాగా, మాజీ ప్రధాన కార్యదర్శి సంజయ్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, రాజ్యసభలో మాజీ డిప్యూటీ నేత అహ్లూవాలియా, రాజస్థాన్ సీనియర్ నేత ఓంప్రకాశ్ మాథుర్, గుజరాత్ నేత, మోడీ సన్నిహితుడు అమిత్‌షా, ఒడిసా నేత జ్యుయల్ ఓరమ్, మాజీ కేంద్రమంత్రి అశోక్ ప్రధాన్ తదితరులు రాజ్‌నాథ్ సింగ్ టీమ్‌లో ఉండే అవకాశాలున్నాయి.
మేనకాగాంధీ కుమారుడు, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ, స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యవస్థాపకుడు పి. మురళీధర్‌రావులను ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తారని తెలిసింది. రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రామ్‌దాస్ అగర్వాల్‌ను కోశాధికారిగా నియమించవచ్చు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి, అహ్లూవాలియాలను ఉపాధ్యక్షులుగా నియమించే అవకాశాలున్నాయి. రాజ్‌నాథ్ టీమ్‌లో మాజీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి కీలక బాధ్యతలు అప్పజెప్పవచ్చు. అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా తన పాత్రను నిర్వహించిన రాష్ట్రానికి చెందిన నిర్మలా సీతారామన్‌కు కూడా ముఖ్య బాధ్యతలు అప్పచెబుతారని పార్టీవర్గాలు చెప్పాయి.
Read More

రామ రామ ఏమి సేతు ? దేశమంతా డబ్బుపోటు రాజకీయపు విషపు కాటు
........................................................................................

భారత్-శ్రీలంక దేశాల మధ్య రామేశ్వరం మరియు శ్రీలంక దీవులును కలుపుతు సేతువు లాంటి సున్నపు రాతి ఆకారం. దీనిని 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని కూడ అంటారు. ఇది పాక్ జలసంధిలో ఉన్నది. సేతువులను 'షోల్స్' లేక 'సాండ్ బార్స్' అని కూడా అంటారు.(http://en.wikipedia.org/wiki/Shoal ) అక్కడ ఒక వైపు వున్న పాక్ జలసంధి గుండా కాలువ తవ్వి మరోవైపున గల మన్నార్ సింధు శాఖతో కలుపుతూ కాలువ మార్గం ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో నలుగుతున్నాయి.

ఇది పగడపు దిబ్బనే అని శాస్థ్రావేత్తలు వివరిస్తున్నారు. ఎప్పటిదో మానవనిర్మితమని కొందరు నమ్ముతున్నారు.

ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు ? సుయజ్‌ కెనాల్‌, పనామా కాలువ లాంటివి భారీ నౌకలకు వేలాది మైళ్ళ దూరాన్ని తగ్గించి, వందల గంటల సమయాన్ని ఆదాచేశాయని. అటువంటి ఆర్థిక లాభాల కోసమే దీన్ని పగలగొట్టేసి నౌకామార్గం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుందని అందువల్ల దేశ తూర్పు పశ్చిమ తీరాల మధ్య దూరంలో 424 నాటికల్ మైళ్లు అంటే 780 కిలోమీటర్ల దూరం కలిసొస్తుందని. సుమారు 30 గంటల సమయం ప్రయాణంలో కలిసి వస్తుందని ఈ పనికి పూనుకోవాలని చూస్తున్నట్లు చెపుతున్నారు.
అంతర్జాతియ నౌకా రవాణాలో మరింత సౌలభ్యం వుంటుందనీ చెబుతున్నారు. మరికొన్ని నిజాలు చూద్దాం.

►2005 జూలై 2 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌న శంకుస్థాపనచేశారు. 2007 సెప్టెంబరులో సుప్రింకోర్టు దీనిపై నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసింది.

ఇది కేవలం ఆర్ధిక అంశమే కాదు. ముఖ్యంగా పర్యావరణపరమైన కారకాలను, మత పరమైన అంశాల వల్ల ఏర్పడిన సున్నిత మనో భావాలనూ కూడా పరిగణలోకి తీసుకోవాలి.

►అధికారిక నివేదికలే ఇది అనవసం అంటున్నాయి : ప్రఖ్యాత శాస్త్ర్రవేత్త RK పచౌరీ సారధ్యంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుత రూపంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేఖిస్తూ నివేదిక సమర్పించింది.

►దీని ఖర్చు : ప్రాధమిక అంచనాల ప్రకారమే 24,700 కోట్ల రూపాయిలు, తాజా అంచనాల ప్రకారం 45,000 కోట్లకు పెరిగింది.

►ఉపయోగ పరిధి : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 60,000 DWT ( డెడ్ వెయిట్ టన్నేజి ) రవాణా నౌకలు సంచారం పెరిగింది. కానీ సేతు కాలువ ద్వారా కేవలం 32,000 DWT మించిన రవాణా నౌకలు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఆర్ధికంగా పెద్ద లాభదాయకం కాదు.

►పర్యావరణం : మన్నార్ సింధు శాఖలో అరుదైన జీవవృక్షజాతులు 3600 వరకూ వున్నాయని, వైవిధ్య భరిత క్షీరదాలకు ఇది అనుకూల ఆవాస ప్రాంతం గా ఉపయోగ పడుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటిలో ఆమ్లీకరణ పెరుగుతుంది. చమురు తెట్టుల వంటి కాలుష్యం ముసురు కోవడం వల్ల వీటికి నష్టం ఏర్పడుతుంది.

►జీవన భృతి : లక్షలాది మంది ఇక్కడ లభించే మత్ససంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 లక్షల మంది మత్య్సకారుల జీవనం జీవికలు కోల్పోతారు. ప్రత్యామ్నాయ జీవికలను వారు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది.

►ప్రకృతి వైపరీత్యాలు : కెనడాలోని అట్టావా విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టాడ్ ఎస్ మూర్తి వెల్లడించిన పరిశీలనల ప్రకారం 2004 నాటి సునామీ కేరళపై విరుచుకు పడకుండా రామసేతు అడ్డుకుందన్నారు. రామసేతును తొలగిస్తే భవిష్యత్తులో సునామీల వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకునే ఈ సహజమైన గోడను కోల్పోయినట్లే అంటున్నారు. ( ఒకప్పుడు కలివికోడి కోసం తెలుగు గంగ దారి మార్చటం మన రాష్ట్రంలోనే జరిగింది )

►మనోభావాలు : పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు. దీన్ని కూల్చటం అంటే వీరందరి మనోభావాలను కూల్చటమే అనిది మరో అంశం. ఇది కూడా సులభంగా కొట్టిపారేసే చిన్న అంశం కాదు.

బీజేపి కూల్చొద్దంటోంది కాబట్టి దాన్ని కూల్చేద్దాం అంటే సెక్యులర్ అనుకుంటారా ? జయలలిత దీనిని జాతియ కట్టడంగా ప్రకటించ మన్నారు కాబట్టి ఆమె రాజకీయ వ్యతిరేఖులు అది వృధా నిర్మాణమని ఊరుకోవంటం సరైందా?

నిజాల వెలుతురులో విషయాలను చూడటం నాదేశానికి అబ్బితే ఎంతబాగుండును.
http://en.wikipedia.org/wiki/Sethusamudram_Shipping_Canal_Project.

http://sethusamudram.gov.in/
-Katta Srinivas.



Read More

Taj Mahal Review


Read More


Read More

Quation of Mother Theresa


Read More

మోడీ... నరెంద్ర మోడీ...

మోడీ...
నరెంద్ర మోడీ...

మోడీ కరడుగట్టిన హిందుత్వవాది అన్న సర్వసాధారణ విమర్శ మొదలు, దేశంలో అతి పెద్దముస్లిం అన్న తీవ్ర విమర్శలు వినపడతాయి. కొందరికైతే ఆయన ‘హిందూ హృదయ సమ్రాట్’.
అయోధ్య ఆందోళనతో మొదలైన విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆవిమర్శల ఎదురుగాలిలోనూ నాయకత్వ పటిమకు పదును పెట్టుకున్నవాడు మోడీ. ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీయే అన్నంతవరకు ఆయన ప్రస్థానం సాగింది. సెప్టెంబర్ 7, 1950లో వాద్‌నగర్‌లో పుట్టిన మోడీ జీవితం, ఆలోచన, రాజకీయాలే ఆయన్ను నడుపుతున్నాయన్నమాట వాస్తవం.ఓబీసీల నుంచి వచ్చిన మోడీ చిన్ననాడే ఆ సంస్థ పట్ల ఆకర్షితుడై, అరవై దశకంలో ఇండోపాక్ యుద్ధం వేళ రైల్వే స్టేషన్‌లలో సైనికులకు స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఏబీవీపీలో ఉన్నపుడే రాష్ట్రంలో నవనిర్మాణ్ ఆందోళన వచ్చింది. అరవై దశకంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యువజన నిరసనల పరంపరకు 1974 నాటి నవనిర్మాణ్ ఆందోళన కొనసాగింపు అనిపిస్తుంది.
నెహ్రూ కుటుంబత్యాగాలకి దేశం బలికావలసి వచ్చిందని కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశాల వేదిక మీద నుంచి ఆయన సంధించిన బాణం వెనుక శక్తి,....దానికి ముందెప్పుడో, ఓ ముస్లిం ప్రతినిధి బృందం ఆలింగనం చేసుకుని లేసు టోపీ పెట్టబోతుంటే నిండు సభలోనూ నిరాకరించడం వెనుక ఉన్న హిందుత్వ భక్తి ఆ ప్రయాణానికి చోదకశక్తులే. మోడీ(త్వ) హిందుత్వను విమర్శించే వారు ఎందరో, ఆయన రాజకీయ సంకల్పాన్ని ప్రశంసించేవారూ అంతమంది ఉన్నారు. రహదారుల విస్తరణలో అడ్డం వచ్చిన దేవాలయాలను కూలగొట్టించాడని వీహెచ్‌పీ అలిగినా మోడీ తొణకలేదు. మోడీకి వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ వచ్చినా జాతీ యమీడియా పనిగట్టుకు ప్రచారం చేసినా బెసకలేదు. నాలుగోసారి (2012) ముఖ్యమం త్రి అయ్యారు. ఆ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి ఆయనే.
మోడీ తన ఆరెస్సెస్ మూలాలను ఏనాడూ దాచలేదు.
అక్టోబర్ 7, 2001లో మోడీ అధికారం చేపట్టారు. నాలుగు మాసాలకే- ఫిబ్రవరి, 2002లో గోధ్రా, అనంతర ఊచకోత జరి గాయి. ఈ పదేళ్లలో మోడీ మీద వచ్చిన కేసులు, తీర్పులు, కమిషన్లు అసంఖ్యాకం. హింసాకాండలో మోడీ పాత్ర ఉన్నదని బహిరంగ ఆరోపణ. దీనిని కాంగ్రెస్, బీజేపీ తమ కు అనుకూలంగా మలుచుకోదలచి రెండూ బొక్కబోర్లాపడ్డాయి. అయినా మోడీ రాష్ట్రం లో తిరుగులేని నాయకుడు. అభివృద్ధే ఆయన మంత్రం. రాజనాథ్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన తరువాత మోడీ ప్రధాని అభ్యర్థిత్వం అంశం ఊపందుకుంది. అద్వానీ సహా నాయకులంతా ఆ పేరే స్మరిస్తున్నారు..@ బహుజన బంధు.

 
 
Read More

Powered By Blogger | Template Created By Lord HTML