అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు !
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా
సంవత్సరంలో పదకొండు మాస శివరాత్రులు వస్తే ఆ పదకొండింటి కంటే గొప్పదైన ఈ
శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం
వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని
జరుపుకోవాలి) అవుతోంది .
ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం
రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని
రక్షించే శంకరుడు రాత్రి దేవుడు .తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే
మొదలవుతుంది.చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది.
చలి ,మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని
కప్పుకుని వుండగా - పిశాచ ,భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన
శంకరుడు,నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల
పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం
ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ
దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే
వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో
పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు
తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ
భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ
చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు
తెలుపుతున్నాయి.
No comments:
Post a Comment