నాయన జంబసురిడికి పుట్టిన అంబాసుర......................
ఈ కాలంలో ఆహారంలో చాలా మార్పులు వచ్చినవి. తెల్లగా వుండే నాలుగు పదార్దాలను విడువుట మంచిది. అవి పంచదార, తెల్ల బియ్యము, పాలు, వుప్పు. పంచదార వైట్ పాయిజన్. దీనివలన శరీరము ముడతలు పడతాయి. ఈనాటి కాలంలో మానాలి అంటే కష్టం. సాద్యం అయినంత వరకుతగ్గించడం మంచిది. పాలలో ఆవు పాలు మంచిది. ఆవు గురించి అందరికి తెలిసిందే. వుసిరి కాయలు తప్పనిసరిగా రొజూ తినాలి. వుసిరి వలనముసలితనం తొందరగా రాదు. రోగాలు రావు. మాంసాహారము తప్పనిసరిగా విడవాలి. సాత్విక ఆహరాని తినాలి. మనం తినే ఆహరం భట్టి మన మనసు వుంటుంది. గుణము కన్నా మంచి మనసు గొప్పది. మంచి మనసు లేని మంచి గుణము వ్యర్ధము. భగవంతుడు మెచ్చేది స్వార్డ రహిత మనసుతో కూడిన భక్తిని.
కుండలనిశక్తి
సూర్యునిలో రెండు వేలకిరణాలు వున్నాయి. ఒకొక్క కిరణము ఒక్కో శక్తిని కలిగి వుంటాయి. అవి భూమి మీద ప్రతీ జీవరాశికి వుపయోగపడుతున్నవి.అలాగే మన శరీరంలో షట్ చక్రాలు కలవు. అవి ములాదారచక్రము, స్వా దిస్తాన, మణిపూరక, సనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార. ములాదారచక్రము గుదము వద్ద వుంటుంది. అక్కడ కుండలిని శక్తి పాము వలె చుట్టుకుని వుంటుంది. ద్యానము ద్వారా దానిని మేలుకొలిపి సహస్రరచక్రము వద్దకు తీసుకు రావాలి. అలాచేయడానికి చాలా కాలం పడుతుంది. ఆ సమయంలో కుండలనిశక్తి భుసలు కొట్టుకుంటూ సహస్రార వున్నశిరస్సు వద్దకు చేరుకుంటుంది. అక్కడ బ్రహ్మ రంద్రము వుంటుంది. అక్కడ నుండి ప్రాణము పోతుంది. అప్పుడు దైవ సాక్షాత్కారం కలిగి మోక్షం కలుగుతుంది. కాని అంత సులభం కాదు. రోజు కనీసం గంట సేపు ద్యానం చేస్తే మణిపూరక చేరడానికి ఐదు నుండి పది ఏళ్ళు పడుతుంది. చాలా మంది ఋషులు, యోగులు సాధించారు. ఆదిశంకరాచార్యులు , రామకృష్ణపరమహంస, రమణమహర్షి చాలా మంది సాధించారు.
No comments:
Post a Comment