తిరుమల నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు. ఎందువలన?
తిరుమల
నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా
చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు.
ఎందువలన?
తిరుమల నడకదారిలో యాత్రికులు మార్గానికి ఇరువైపులా
రాళ్ళను ఒక దానిపై మరొకటి పేర్చి పెట్టడం మనందరం చూసే వుంటాము. దీని వెనుక,
మనందరికీ తెలియనిది, చాలా యేళ్ళుగా మన పెద్ద వారందరూ ఆచరించి సత్ఫలితాలను
పొందిన, ఒక విచిత్రమైన మరియు అత్యంత బలీయమైన నమ్మకం వున్నది. చూడడానికి ఇది
ఒక తమాషాఐన విషయంగా కనపడినా ఇందులో పూర్తి నిజం వున్నది. (నేను కూడా
స్వయంగా ఆచరించి ఫలితం పొందాను).
నడకదారిలో రాళ్ళను ఒకదానిపై మరొకటి
పేర్చి ఇల్లులాగ కడితే వారికి శ్రీవారి అనుగ్రహం వలన అతి త్వరలో ఒక ఇంటి
వాడు (భక్తుడు ఒక ఇల్లు కట్టడం జరుగుతుంది) అయ్యే అదృష్టం కలుగుతుందని
భక్తుల విశ్వాసం. ఒకసారి తిరుమలకు నడిచి వెళ్ళేటప్పుడు నేనుకూడా సరదాగా
రాళ్ళతో ఒక ఇల్లు కట్టడం జరిగినది. ఆ విషయం నేను మరిచి పోయాను. నేను
మరిచిపోయినా అతి పవిత్రమైన సాలగ్రామ పర్వతమైన 'వేంకటాచల పర్వత ' మహిమ వలన
మరియూ శ్రీవారి అనుగ్రహంతో, సరిగ్గా 9 నెలలో నేను నా ఇంటి లో ఒక భాగాన్ని
ఆధునీకరించడం జరిగినది. ఇంకా అనేకమంది భక్తుల అనుభవంలో కూడా ఇలాగే
జరిగింది.
ఇలా మనకు తెలియని ఎన్నో ఎన్నెన్నో వింతలు, కలియుగ ప్రత్యక్ష
దైవమైన వేంకటేశ్వరుడి క్షేత్రంలో కోకొల్లలుగా వున్నాయి. వీటన్నింటినీ
తేలుసుకోవాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదేమో!
ఓం నమో వేంకటేశాయ!
No comments:
Post a Comment