What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015

త్రిలోక సంచారంచేసే పరమభాగవతుడు నారదుడు



త్రిలోక సంచారంచేసే పరమభాగవతుడు నారదుడు


నారదుడు నిరంతర హరినారాయణస్మరణచేస్తూ త్రిలోక సంచారంచేసే పరమభాగవతుడు నారదుడు. ఈయన విధాత (బ్రహ్మ) మానసపుత్రుడు. బ్రహ్మ ఇతర మానసపుత్రులంతా సృష్టికార్యాన్ని స్వీకరించగా, నారదుడు మాత్రం ఆ కార్యాన్ని తిరస్కరించి బ్రహ్మకోపానికి గురయ్యాడు. ఫలితంగా నారదుడు త్రిలోకసంచారి అయ్యాడు. అంతేకాక, పురాణాలప్రకారం వివిధ లోకాల సమాచారములు అందరికీ అందిస్తూ ఉండేవాడు. ఋగ్వేదంలోని ఎనిమిది, తొమ్మిది మండలాల మంత్రద్రష్ట నారదుడే. ఈయనకు కలహప్రియుడని, కలహాశనుడని పేర్లు. దేవ, దానవ, యక్ష, గరుడ, కిన్నర, కింపురుష, మానవాదులు అంతా ఈయనను గౌరవిస్తారు. ఎన్నో విద్యలకు ఆచార్యుడై నారదుడు భక్తి ప్రచారకుడు. వీరి నారద భక్తిసూత్రాలు ఎంతో విశిష్టమైంది. భగవంతుని మనస్సే నారదుడు. నారాయణస్మరణమే నారదుని ఊపిరి. అందుకే పరమభాగవతుల్లో ద్వితీయస్ఠానం పొందగలిగాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML