What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 29 October 2015

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది. ఈ నది ఎన్నో వేల వైశాల్యం కలిగి, ఎముకలు,చీము,రక్తము మరియు బురద కలిగిన మాంసము తో నిండి ఉంది. ఈ నది నిండా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, విశ్వం లో మాంసాహారం భుజించే సకల జీవాలు అందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. దోవ అంతా దుర్గందపూరితం గా ఉంది. దానిని భరించలేక ధర్మరాజు మూర్చపోయాడు. జన్మలో ఎటువంటి తప్పు చెయ్యని నాకు ఈ దురవస్థ ఏమిటని ధర్మరాజు ఇంద్రుని అడిగాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజు తో ‘కురుక్షేత్ర సంగ్రామాన, అశ్వద్ధామ హత: అని బిగ్గరగా పలికి, కుంజర: అని హీన స్వరం తో పలికి గురుదేవుని వంచించిన ఫలితమిది’ అని చెప్పాడు. అబద్దం ఆడిన వారికే నరక దర్శనం తప్పకపోతే ఇక పాపాలు చేసే వారి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML