హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేదం చెబుతున్నది .
కొంచెం, పలుచగా ఉండి త్వరగా జీర్ణం అవుతుంది .
గోక్షీరం పసి బిడ్డలకు తల్లిపాలతో సమానం.
ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు నశించును.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విటమిను 'ఎ' అధికంగా కలిగిన 'కెసీన్' అనే ఎంజైమ్ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
ఆవుపాలు సర్వరోగ నివారణి.
ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.
ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక వాడాలి .
ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్డిఎల్ (HDL)కొలెస్టరాల్ను పెంచి చెడుదైన ఎల్డిఎల్ కొలెస్టిరాల్ను తగ్గించును. హెచ్డిఎల్ కొలెస్టరాల్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మనాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది.
సూర్య కిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని 'కెసీన్' అనే ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవుపాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి.
పాశ్చాత్య గోవులైన జర్సీ, హెచ్.ఎఫ్ వంటి గోవులకు మూపురం ఉండదు.
అవి సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల ప్రదేశంలో చలికి తట్టుకొనే విధంగా పరిణామం చెందినవి. వీటికి మన దేశీయ ఆవుల వలె సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉండదు.
అందు వలన వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక పాల ఉత్పత్తికై యాంత్రిక జీవులుగా మనం భావించ వచ్చును.
భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు మూపురం ఉన్న ఆవు పై ఆధారపడి ఉన్నది. ఈ ఆవుపాలు చలాకితనాన్ని, తెలివిని,జ్ఞాపకశక్తిని, సత్వ గుణమును, బుద్ధిబలమును, ఓజస్సును పెంచును. ఓజస్సు మనిషి తెలివికి, ఆకర్షణ శక్తి కి వ్యాధి నిరోధక శక్తికి ప్రధాన కారణం.
ఆవునెయ్యి ఆరోగ్యకరమైన మంచి ఎముకలను, మంచి రక్తాన్ని ఉత్పత్తి చేయు మూలుగును, మంచి వాక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్ధిబలాన్ని పెంచును. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచును. రక్తంలో చెడు కొలెస్టరాల్ అయిన LDL Cholesterol పెరగనివ్వదు.
ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తం మంచి మూల కణ ములు (Stem cells) ఉత్ప త్తి అయి వ్రతిశరీర అవయ వమును శక్తివంతంగా ఉంచి వ్యాధి కారక క్రిములను Aidsను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపివేసి, ఆరోగ్యమును కలుగచేయును.
స్త్రీలలో ఎము కలు బలహీనమై Osteoporosis Arthritis అనే వ్యాధి రాకుండా ఉండు టకు, వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు-కాల్షియం మాత్రల కన్నా ఆవునెయ్యి ఎంతో శ్రేష్ఠమైనది.
స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.
ఈ జన్మలో నిత్యం తీసుకొనే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి సూక్ష్మ అంశతో ఏర్పడే 'మనస్సు బుద్ధి' రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment