What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 March 2015

కాకికి అన్నం పెట్టండి, గయక్షేత్ర మహాత్మ్యం :



కాకికి అన్నం పెట్టండి

కాకి శనైశ్చరుని వాహనం అనితేలుసు కాని పితృదేవతల ఆరాధనలో కాకికి ముఖ్యత్వం వుందనేది తెలుసా కాకి యమలోక ద్వారం వద్ద వుంది యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవ్యహరిస్తుంది కాకికి అన్నం పెడితే యమలోకమందు వుండు పితరులకు ఆకలి తీరుతుంది మన పితరులకు శాంతి చేకూరి మనకు ఆశీస్సులు లభిస్తుంది కాకి మనం పెట్టిన అన్నం ముత్తకున్దాపోతే మన పితరులకు మనపైన నిరాశ నిస్పృహ కలిగింది అని మనం తెలుసుకోవాలి గయ క్షేత్రంలోని శిలకు కాకశిల అనికూడా పేరు కలదు ఆ శిలపైనే మనము పిండము వుంచి పితరులను ప్రార్తిస్తాము


గయక్షేత్ర మహాత్మ్యం : మన సంప్రదాయంలో ప్రయాగ కాశి గయలో పితరులకు పిందదానాదులు చేయడం ఒక పరిపాటి. మనం ఇంటిలో చేసే పార్వణ స్రాద్ధములో అక్షయవటం గయ క్షేత్రం అనేది తరచూ వింటూ ఉంటాము అక్షయ వటం అనే మఱ్ఱిచెట్టు గయలో వుంది దాని మూలవేరు ప్రయాగాలోను మంధ్య భాగం వారణాసిలోను వ్యాపించి వుంది ఈమూడు స్థలములను వటవృక్షము ఒకటిగా కలుపుతుంది గయలో అన్నశ్రాద్ధం పెట్టడం చాల ప్రశస్తం గయాసురుడు అనే రాక్షసుడు బ్రంహవద్ధ వరం కోరుకుంటాడు తన దేహమును ఎవరు స్ప్రుసిస్తారో వారందరికీ స్వర్గం ప్రాప్తించాలని అతను వరం ఇవ్వడంతో అందరు స్వర్గమునకు వెళ్ళడం ప్రారంభం అయ్యింది మంచి చెడ్డ పాప పుణ్యం ఎమిలేకుండా వెళ్ళు చుండిరి ఇది చూసి దేవతలు మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు గయాసురుని తలపైన తన పాదము పెట్టి పాతాలలోకమునకు పంపివేసెను విష్ణుపాదం తగలడంతో పునీతుడైన గయాసురుడు విష్ణువును వరంకోరుకుంటాడు

ప్రపంచములో అందరు తమ తల్లితండ్రులు బ్రతికి ఉన్నంత వరకు అభిమానం ప్రేమతో చూసుకొని తర్వాత వారికి తర్పనాదులు శ్రాద్ధాదులు క్రమముగా ఇవ్వడానికి బుద్ధిని ప్రేరేపిమ్పచేయాలని కోరుకుంటాడు తన శరీరమైన గయకు వచ్చి విష్ణుపాదం వటవృక్షం ఫల్గుణి నడిప్రాంతంలో పితరులకు శ్రాద్ధాదులు ఇవ్వడం చేయాలని కోరుకుంటాడు .




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML