ఆలయంలోని మూలమూర్తికి ధూపదీపనైవేద్యాది సకలోపచారాలు సమర్పించాక, ఆ విగ్రహాన్ని ‘పాదాది శిరఃపర్యంతం’ వీక్షించటానికి అర్చకులు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. మన ఇండ్లలో చేసుకునే పూజలలో కూడా భగవంతునికి హారతి సమర్పించడం పరిపాటి. ‘హారతి అంటే హరించుకుపోవడం’ అని అర్థం.‘పవిత్రమైనది’ అనే అర్థం కూడా ఉంది. భగవంతునికి మనకి మధ్య ఉన్న చీకటిని పారద్రోలేది కూడా (ఈ) హారతేనని ఆధ్యాత్మిక ప్రవచకులంటారు. హారతినే కర్పూర నీరాజనం అని కూడా అంటారు. నీరాజనం అంటే మిక్కిలి ప్రకాశింపచేసేది అని అర్థం.
మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థ్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినిమ్మని భగవంతుని ప్రార్థిస్తూ, హారతి ఇవ్వడం ఆచారం. ఆలయంలోని మూలమూర్తిని విద్యుద్దీపాల వెలుగులోగాక, హారతి ద్వారా దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడం ఇందులోని అంతరార్థం కావచ్చు. ఆయన దర్శనం మంగళప్రదమైనది కాబట్టే దానిని మంగళహారతి అని కూడా అంటారు.
No comments:
Post a Comment