వైకుంటము చేరుటకు గరుడ వాహనము అన్నియు సిద్ధమై ఉండగా... కలియుగమున తన బిడ్డలు పడుచున బాధలు చూసి కన్నెర్ర చేసింది పద్మావతి... దేవి! పద్మావతి..నీవు కన్నెర్ర చేయరాదు ఇది కలియుగము ఈ యుగము ధర్మమూ ఇలానే ఉండుట బ్రహ్మ లికితము దైవము కూడా మౌనమై ఉండవలె అనెను శ్రీనివాసుడు. ప్రభు!! నేను మాతని నా ప్రేమకి యుగ ధర్మానికి సంభంధం లేదు... మీ భక్తులు- నా బిడ్డలు ఇలా పాప పంకిలమున పడి గోశిస్తుంటే నేను వైకుంటము ఎటుల సంతోషముగా ఉండేదా... కావున ప్రభు! తమరు నాకు ఒక్క వరమును ఇవ్వవలె... తమరు కలియుగాంతం వరకు నాతో ఇక్కడే పృధివి మండలమున నివసించవలెను.. భక్తుల కష్టాలు తిర్చలేకపోయిన వారికి శాంతిని నోసగుటకు... సంపదలు ఇవ్వకపోయినా ఆరోగ్యమున ఇవ్వుటకు... ఎదురు పడి సహాయము చేయకపోయినా..వారికి ఎప్పుడు రక్షణగా ఉండుటకు మనము ఇరువరుము ఇక్కడే నివసుచున్నట్లు వరము ఇవ్వండి నాద అని పద్మావతి కోరినది. అటులనే దేవి నీ అజ్ఞాగా భావిస్తాను నేను ఇక్కడే తిరుమల గిరులపై ఉండేదా... నీవు నీ భక్తుల చెంత అనగా తిరుమలగిరి కింద శుక మహర్షి పట్నమున(తిరుచానూరు) నివసింపు అనెను శ్రీనివాసుడు. శ్రిపద్మవతి సరోవర స్నానము చేసిన వారికి ఆ తల్లి తన చేతులతో కర్మలను తొలగించి స్వచమైన హృదయులుగా మలచి కలి భాధలనుండి రక్షణగా నిలుస్తుంది... స్వామి పై అలుగుటకు కారణమూ కూడా తన భక్తులు కోరిన వరములు ఇవ్వలేదనే ఆమెకి అలమేలు మంగా పేరు వచ్చినది. హరి అంత రంగా శ్రీ పద్మావతి దేవి మనలను సదా సర్వదా రక్షణగా ఉండాలని ప్రార్ధిస్తూ. ఓం నమో భగవతి హరివలభే!!
రచన : శ్రీ గంగ చౌదరి
రచన : శ్రీ గంగ చౌదరి
No comments:
Post a Comment