రాముడు పుట్టకముందు సంగతి. వరతంతు మహర్షి దగ్గర
14 ఏళ్ళు విద్యాభ్యాసం చేసిన కౌత్సుడు, తన గురువుగారికి అనేక విధాలుగా
సేవలు చేస్తాదు. విద్యాభ్యాసం ముగిశాకా గురుదక్షిణ ఇస్తానని కౌత్సుడు
అదిగినా, ఆయన గురుశుశ్రుషకు మెచ్చిన వరతంతు మహర్షి, కౌత్సుడు
వద్ద నుంచి గురుదక్షిణ పుచ్చుకోవడానికి ఇష్టపడడు. కాదు, తీసుకోవలసిందేనని
పట్టుబడతాడు కౌత్సుడు, బలవనతపడతడు. దాంతో గురువు, తన వద్ద 14 ఏళ్ళు
వుద్యాభ్యాసం చేసినందుకు ప్రతిగా 14 కోట్ల బంగారు నాణేలు దక్షిణ అడుగుతాడు.
వాటి కోసం కౌత్సుడు రఘుమహారాజును ఆశ్రయిస్తాడు. కౌత్సుడు రఘుమహారజును ఆశ్రయించే సమయానికి, రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి, మొత్తం రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తాడు. ఆయన ఇంద్రునిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఇంద్రుడు భయపడి సంపదను కురిపించమని కుబేరుడిని ఆజ్ఞాపించడంతో జమ్మి చెట్లున్న చోట కనకవర్షం కురిపిస్తాడు కుబేరుడు.
14 కోట్లకు మించి కురిపించినా, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఆశించడు కౌత్సుడు. తాను బ్రహ్మచారినని, తనకు డబ్బు అవసరంలేదని చెప్పి, ఆ 14 కోట్ల బంగారు నాణేలను వర్తంతు మహర్షికి సమర్పిస్తాడు. మిగిలిన ధనం రఘుమహారాజు ముట్టుకొడు. అది తనది కాదని, కౌత్సుడి కోసం కుబేరుడు కురిపించాడని, అందువల్ల తాను స్వీకరించనని చెప్తాడు. ఇది భారతీయుల త్యాగబుద్ధికి, ధర్మనిరతికి సంకేతం. దాంతో మిగిలిన ధనాన్ని ప్రజలకు పంచేస్తారు.
~ పాండవులు 13 సంవత్సరాల వనవాసం తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళె ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచి, అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి ఈ చెట్టును పూజించి, దాని మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు. వారు ఆ జమ్మి చెట్టును పూజించింది విజయదశమి రోజున. ఆ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు ఆ దారిని వెళ్ళెవారికి పాముల్లా కనిపించేవి.
~ జమ్మిచెట్టును పూజించడం వెనుక రెండు యుగాలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలు మనకు కనిపిస్తాయి.
ఈరోజు శమివృక్షం వద్ద చదవలసిన శ్లోకం :
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః||
జమ్మి చెట్టును ఈరోజున ఆరాధించడం చేత పాపం నశిస్తుందని,శత్రువులు నాశనమవుతారని అంటొంది శాస్త్రం.
వాటి కోసం కౌత్సుడు రఘుమహారాజును ఆశ్రయిస్తాడు. కౌత్సుడు రఘుమహారజును ఆశ్రయించే సమయానికి, రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి, మొత్తం రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తాడు. ఆయన ఇంద్రునిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఇంద్రుడు భయపడి సంపదను కురిపించమని కుబేరుడిని ఆజ్ఞాపించడంతో జమ్మి చెట్లున్న చోట కనకవర్షం కురిపిస్తాడు కుబేరుడు.
14 కోట్లకు మించి కురిపించినా, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఆశించడు కౌత్సుడు. తాను బ్రహ్మచారినని, తనకు డబ్బు అవసరంలేదని చెప్పి, ఆ 14 కోట్ల బంగారు నాణేలను వర్తంతు మహర్షికి సమర్పిస్తాడు. మిగిలిన ధనం రఘుమహారాజు ముట్టుకొడు. అది తనది కాదని, కౌత్సుడి కోసం కుబేరుడు కురిపించాడని, అందువల్ల తాను స్వీకరించనని చెప్తాడు. ఇది భారతీయుల త్యాగబుద్ధికి, ధర్మనిరతికి సంకేతం. దాంతో మిగిలిన ధనాన్ని ప్రజలకు పంచేస్తారు.
~ పాండవులు 13 సంవత్సరాల వనవాసం తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళె ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచి, అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి ఈ చెట్టును పూజించి, దాని మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు. వారు ఆ జమ్మి చెట్టును పూజించింది విజయదశమి రోజున. ఆ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు ఆ దారిని వెళ్ళెవారికి పాముల్లా కనిపించేవి.
~ జమ్మిచెట్టును పూజించడం వెనుక రెండు యుగాలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలు మనకు కనిపిస్తాయి.
ఈరోజు శమివృక్షం వద్ద చదవలసిన శ్లోకం :
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః||
జమ్మి చెట్టును ఈరోజున ఆరాధించడం చేత పాపం నశిస్తుందని,శత్రువులు నాశనమవుతారని అంటొంది శాస్త్రం.

No comments:
Post a Comment