What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 12 October 2013

శ్రీ లక్ష్మిదేవ్యై నమో నమః!

లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్సిస్తు , గజరాజు సేవిస్తు ఉండగా, శ్రీమన్మహాలక్ష్మి దర్శనమిస్తుంది.ఐష్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమీష్ట రూపమే మహాలక్ష్మి దేవి!

ఈమే క్షీరాబ్ది పుత్రిక. డోలారుడు అనే రక్ష్షుదిని సమ్హరించిన దేవత. శక్తి త్రయం లో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాశన చేస్తే ఫలితాలు సీగ్రముగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

శర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో , ఆ శక్తే "లక్ష్మీ"!!!!!!! లక్ష్యతే మీయతే అనయా ఇతి లక్ష్మి అని అనారు," లక్ష్మణాత్ లక్ష్మి"! ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ.

భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ' ఇవి నా విభుతులూ అని విభుతి యోగం లో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపలే.
ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెల్సు కనుక , విద్యాగంధం లేని వాడు అఙ్ఞవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను
మూటకట్టుకుంటాడు అనే ఉద్దేసంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐష్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐష్వర్య ప్రదాయిని అని అన్నారు!

సూర్య, చంద్ర , అగ్ని, వాయువు, భూమి మోదలు అయినవి అన్నీ ఐష్వర్యాలే ! ఈ ఐష్వర్యాలకు కారణమైన పర బ్రహ్మ శక్తి , ఐష్వర్య రూపిణి లక్ష్మి దేవి!

త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా
త్వయైత ద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం

ఓ లక్ష్మి! ఆన్ని లోకాలకు తల్లివి నీవు. దేవదేవుడు అయిన విష్ణువే తండ్రి. నీ చేత, విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇంద్రుడు లక్ష్మి దేవిని స్తుథించాడు. అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి, హృదయం నిండుగా భావన చేస్తే, అమంగళాలకు చోటు ఉందదు! డబ్బుకు లోటు లోటు ఉండదు . ఛిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి...

'శ' అంటే పరాక్తి.....' ఈ' అంటే పరమేశ్వరుడు, 'ఋ అంటే అగ్ని బీజం. అగ్ని ఐష్వర్యకారకుడు. పరమేశ్వర సహితమూయిన,ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మి అని "శ్రీ" కి
నిర్వచనం. అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకు తగినట్లుగా మసులుకుంటే, ఏ సమస్యలు దరికి రావు.

శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైనవాటిల్లె లక్ష్మి కొలవు అయ్యి ఉంటుంది.

ఆవనెయ్య తో గాని, సువర్ణ జలం తో కాని లక్ష్మి దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్యప్ర్రప్తి కలుగుతుంది!
యా దేవి సర్వ భూతేషి లక్ష్మి రూపేణ సంస్తిథ అంటే అన్నీ జీవులలోను ఉండే లక్ష్మి స్వరూపము దుర్గా దేవి అని చండిసప్త సతి చెప్తోంది!

కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మి జి పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి.

ఈ రోజున అమ్మవారికి పూర్ణాలు నివేదన చెయ్యాలి.

తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, లక్ష్మి అష్టొత్తరం పఠించాలి

శ్రీ లక్ష్మిదేవ్యై నమో నమః!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML