What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 17 February 2015

మహాశివరాత్రి రోజున అభిషేకాలు చేయిస్తే..?



మహాశివరాత్రి రోజున అభిషేకాలు చేయిస్తే..?

పరమ శివుడు మహాశివరాత్రి నాడే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. పరమ పవిత్రమైన శివరాత్రి నాడు శివ పూజ చేస్తే ఈతిబాధలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

అందుచేత శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివనామస్మరణలో నిమగ్నమయ్యే వారికి పరమశివుడు తప్పక కరుణిస్తాడని విశ్వాసం. శివరాత్రి రోజు ఉపవాసం, రాత్రిపూట జాగారం చేస్తే మరింత పూజాఫలం దక్కుతుంది.


ఇక శివ పూజా విధానాన్ని గమనిస్తే, ఆయనకు అభిషేకాలు, బిల్వ పత్రాలు, భస్మం (విభూది) అంటే అమిత ఇష్టం. శివలింగానికి నీరు, పాలు, తేనె, నెయ్యి, పెరుగు తదితరాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వ పత్రాలు, విభూదితో అలంకరించి, ధూప దీపారాధన, నైవేద్యం పెడితే చాలు, కష్టాల్లో శివుడి అండ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML