What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 28 February 2015

ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును.



ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును. అతను అందరికి గురువు అవుతాడు, సకల మంత్రాలు తెలిసినవాడవుతాడు. ఈ మంత్రములతో హవనము, అర్చన చేయవలెను.

ఈ ఉపనిషద్ ను సంధ్య సమయమునందు పఠించిన బ్రాహ్మణుడు ఆ దినమంతయు చేసిన పాపముల నుండి విముక్తుడగును. అపరాహ్న వేళ పఠించినచొ, 6 జన్మల నుండి చేసిన పాపములు తొలగిపోవును. ఇరు సంధ్యా సమయములందు పఠించిన జన్మ జన్మ ల సంచిత పాపములన్నీ నశించును. ఆరువేల కోట్ల గాయత్రీ జపము చేసిన ఫలితము దక్కును.


బ్రహ్మ హత్యా పాతకము, కల్లు సేవించిన పాపము, హిరణ్యమును ( బంగారము ) ను అపహరించిన పాపము, గురు పత్ని తో సంగమము చేసిన పాపము, భ్రష్టుని తో సంభాషించిన పాపములు కూడా రుద్రాక్ష ఉపనిషద్ ను చదివినచొ తొలగి పోవును.

అన్ని పుణ్య క్షేత్రములు దర్శించిన ఫలితము, అన్ని ‪#‎పుణ్య‬ తీర్దములలో మునిగిన ఫలితము పొంది, అంతిమ కాలమున శివ సాయుజ్యము పొంది, మరు జన్మ అన్నది లేనివాడై మోక్షమును పొందును.

ఓం నమః శివాయ.
స్వామి శివానంద

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML