ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును. అతను అందరికి గురువు అవుతాడు, సకల మంత్రాలు తెలిసినవాడవుతాడు. ఈ మంత్రములతో హవనము, అర్చన చేయవలెను.
ఈ ఉపనిషద్ ను సంధ్య సమయమునందు పఠించిన బ్రాహ్మణుడు ఆ దినమంతయు చేసిన పాపముల నుండి విముక్తుడగును. అపరాహ్న వేళ పఠించినచొ, 6 జన్మల నుండి చేసిన పాపములు తొలగిపోవును. ఇరు సంధ్యా సమయములందు పఠించిన జన్మ జన్మ ల సంచిత పాపములన్నీ నశించును. ఆరువేల కోట్ల గాయత్రీ జపము చేసిన ఫలితము దక్కును.
బ్రహ్మ హత్యా పాతకము, కల్లు సేవించిన పాపము, హిరణ్యమును ( బంగారము ) ను అపహరించిన పాపము, గురు పత్ని తో సంగమము చేసిన పాపము, భ్రష్టుని తో సంభాషించిన పాపములు కూడా రుద్రాక్ష ఉపనిషద్ ను చదివినచొ తొలగి పోవును.
అన్ని పుణ్య క్షేత్రములు దర్శించిన ఫలితము, అన్ని #పుణ్య తీర్దములలో మునిగిన ఫలితము పొంది, అంతిమ కాలమున శివ సాయుజ్యము పొంది, మరు జన్మ అన్నది లేనివాడై మోక్షమును పొందును.
ఓం నమః శివాయ.
స్వామి శివానంద
No comments:
Post a Comment