భారతమాత ముద్దు బిడ్డచంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి నేడు తన గురించి
కొన్ని విషయాలు చూద్దాం***********************
*********************************************
*****************
బ్రిటీషర్లకు సింహస్వప్నం "చంద్రశేఖర్ ఆజాద్"
భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ
పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు,
సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్
ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో
రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర
సీతారామ్ తివారి. ఈయన పండిత్జీగా కూడా పిలువబడ్డారు. ఈయన
పెసరపప్పును కనుగొన్నవారిగా కూడా ప్రసిద్ధి. 1857 తరువాత సాయుధ
పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ
కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.
తనను తానే కాల్చుకుని...!
1931, ఫిబ్రవరి 27వ తేదీన తన
ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని
ఆల్ఫ్రెడ్ పార్క్కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన
సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు.
ఆజాద్ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా
కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్
సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్
ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన
ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ
విద్యను అభ్యసించారు. ఈయన చిన్నప్పటినుంచి హనుమాన్ భక్తుడిగా
ఉండేవారు.
1919 లో అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా
కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన
సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో
పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే
అరెస్టయ్యారు.
విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన
ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో
ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే
ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై అంటూ గొంతెత్తి
నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్గా ఆయన
పేరు స్థిరపడిపోయింది.
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్లో దాగి ఉన్న విప్లవవాదిని
మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్వారి కబంధ హస్తాల
నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే
తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్
అసోసియేషన్ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్,
తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారిపోయారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment