What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 4 December 2022

*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.

 *రామాయణంలో మహర్షులు.*

        ➖➖➖


*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.*


*‘షోడశగుణ పూర్ణుడైన మానవుడు          ఈ లోకంలో.. ఈ కాలంలో ఉన్నాడా?’ అని.. తపోధనుడైన వాల్మీకి.. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన దేవర్షి నారద మహర్షిని అడిగాడు.*


*దానికి నారదుడు.. “ఇక్ష్వాకు వంశంలో రాముడను పేరుతో ప్రసిద్ధి చెందిన, లోకంలోని వారందరిచే ప్రశంసింపబడుతున్న మానవుడు కలడు’’ అని బదులిచ్చాడు.*


*అలా శ్రీ రామాయణావతరణకు నారద వాల్మీకి మహర్షులే మూలకారకులు.*


*శ్రీ రామాయణ గ్రంథారంభం నుండి శ్రీరామపట్టాభిషేక ఘట్టం వరకు గల అనేక ముఖ్య సందర్భాలలో కీలకపాత్రను పోషించిన వశిష్ఠ మహర్షి     ఇక్ష్వాకు వంశానికి కులగురువు.*


 *బ్రహర్షియైున వశిష్ఠుని ఆజ్ఞకు రఘు వంశ రాజులు ఏనాడూ ఎదురు చెప్పలేదు.*


 *దశరథ మహరాజు నిర్వహించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు, దశరథ నందనుల నామకరణం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను పంపించడానికి దశరథుని ఒప్పించడం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యాలను నిర్వహించింది వశిష్ఠ మహర్షే.*


*అలాగే..  విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి.. దశరథుని ఆహ్వానం మేరకు ‘పుత్రకామేష్టి’  అనే బృహద్యాగంలో పాల్గొని ఆశీస్సుల నందించి యాగ సాఫల్యానికి కారకుడయ్యాడు.*


*శ్రీరాముని శక్తిని, శ్రీరామతత్త్వాన్ని లోకానికి ముందుగా తెలియపరిచినవాడు విశ్వామిత్ర మహర్షి.*


*తన వద్దనున్న బల, అతిబల విద్యలను జృంభక మొదలైన అస్త్రాలను రామలక్షణులకు ఉపదేశించాడు.*


 *తన యాగాలకు అడ్డంకులు కల్పిస్తున్న తాటక, సుబాహువుల సంహారం ద్వారా..  దుష్టశిక్షణకు,  శిష్ట రక్షణకు అవతరించిన సత్య పరాక్రమవంతుడైన మహాత్ముడే శ్రీరాముడు అని లోకానికి చాటి చెప్పాడు.*


*ఆ తర్వాత రామలక్షణులను జనకుని కొలువుకు తోడ్కొని వెళ్లి, శివ ధనుర్భంగం చేయించి, సీతాదేవితో వివాహం జరిపించి, రావణవధకు బీజం వేసి లోక క్షేమానికి దోహదపడిన మహనీయుడు విశ్వామిత్ర మహర్షి.*


*వనవాస దీక్షలోనున్న సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది, చిత్రకూటము ఆశ్రమ నిర్మాణమునకు అనుకూల ప్రదేశమని తెలిపింది.. భరద్వాజ మహర్షి.*


*రావణ వధానంతరం తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరామునికి రెండు వరాలను ఇచ్చింది కూడా భరద్వాజ మహర్షియే.*


*విరాధుడు చెప్పిన ప్రకారం శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘నేను చేసిన తపముతో ఎన్నెన్నో పుణ్యలోకాలు, మరెన్నో పుణ్యఫలాలు నాకు వశమయినాయి.*


*చిత్ర విచిత్రములైన సుఖాలను కలిగించే ఆ పుణ్యఫలాలను సమర్పిస్తానని శరభంగ మహర్షి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు.*


*‘ఈ అడవిలో నివాసయోగ్యమైన,  ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని తెలపండి చాలు’ అని శ్రీరాముడు కోరగా.. సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు పంపాడు.*


*ఇక.. శ్రీరామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, రావణవధకు సహకరించిన తపోసంపన్నుడు.. అగస్త్య మహర్షి.*


*ఇలా ఎందరో మహర్షులు రాముని తీర్చిదిద్ది..  ఆ అవతారపురుషుని చరితను  జనులకు  శాశ్వతంగా అందించి, తరించడానికి కారకులయ్యారు.*


*అట్టి మహర్షులందరినీ నిత్యం తలుచుకుని వందనం చేయాలి.. ముందు తరాలకు ఈ చరిత్రలు బాసటగా నిలవాలి... *

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML