అగ్ని నక్షత్రం..(రోహిణికార్తి ).....!!
ప్రాతఃకాలాన ఇంద్రాది దేవతలు , మధ్యాహ్నవేళలో వాయుభగవానుడు,
సాయంసంధ్యాసమయా వరుణదేవుడు , చంద్ర భగవానుడు ,రాత్రి అర్ధజామమున కుబేరుడు తెల్లవారుఝామున
త్రిమూర్తులు సూర్యనారాయణుడిని
దర్శిస్తారు.
కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు.
ప్రత్యాధి దేవత అగ్ని దేవుడు.
చైత్రమాసంలో
సూర్యుడు ఉఛ్ఛంలో వున్న సమయాన కృత్తికా నక్షత్రంతో కలిసినందువవన దహించుకుపోయే ఎండలు కాస్తాయి.
ఆ వేసవి దినాలను
రోహిణీ కార్తె లేదా అగ్ని నక్షత్రం గా చెప్తారు.
ఈ అగ్ని నక్షత్రానికి సంబంధించిన ఒక పురాణ గాధ యిలావుంది :
ఒకానొక సమయంలో అగ్ని
దేవుడు యజ్ఞ యాగాదులలో సమర్పించే నేయిని త్రాగి త్రాగి గుణపర్చడానికి వీలులేనంత అజీర్తి వ్యాధితో బాధ పడ్డాడు.
దేవతలంతా కూడా ఆయన వ్యాధిని నిర్మూలించే విధానం తెలియక వ్యాకుల పడ్డారు .
అగ్ని దేవుని అజీర్తివ్యాధి నిర్మూలనకు శ్రేష్టమైన వనమూలికలు గల దట్టమైన
అడవులను దహించడమొక్కటే మార్గము అని బ్రహ్మదేవుడు సూచిస్తాడు.
అగ్ని దేవుడు అలాటి వనమూలికలు గల దట్టమైన అడవులను వెతుకుతూ,
యమునాతీరాన వున్న
ఖాండవ వనానికి వచ్చి అక్కడ పచ్చగా, మూలికలతో
సమృధ్ధిగా నిండి వున్న ఆ వనాన్ని చూసి ఆనందంగా , ఆ వనాన్ని భక్షించేందుకు సంకల్పించాడు.
విషయాన్ని తెలుసుకున్న ఖాండవ
వనంలోని జీవులు, తరువులు తమని కాపాడమని వరుణ దేవుని వేడుకున్నాయి.
ఇంద్రుని పరి రక్షణ లోవున్న ఆ మూలికావనం ఎల్లప్పుడూ పచ్చగా వుంటుంది. వైద్యానికి అవసరపడే వనమూలికల అభివృధ్ధి కై ఇంద్రుడే
వానలను సకాలంలో వర్షింప చేస్తాడు.
అందుకే ఇంద్రునికి "ఖాండవవనుడు"
అనే పేరు కూడా వుంది.
విషయం తెలిసిన దేవేంద్రుడు తన వనంలోకి అగ్ని దేవుని
ప్రవేశాన్ని నిరోధిస్తూ తీవ్రమైన వానలు కురిపించాడు.
అగ్నిదేవుడు ఎన్ని విధాలుగా ఖాండవ వనంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా ఫలించలేదు.
మారువేషంలో ఒక వేదపండితునిలా యమునా తీరమున సంచరిస్తూండగా
కృష్ణార్జునుల రూపంలో నరనారాయణులు ఎదురు
పడతారు.
అగ్ని వారిని చూసి తన నిజరూపందాల్చి తన ఆరోగ్య సమస్య తీరడానికి ఖాండవవన దహనంలో తగు
సహాయం చేయమని శ్రీ కృష్ణుని కోరాతాడు
శ్రీ కృష్ణుడు ఇరవై ఒక్క రోజులపాటు అగ్నిదేవునికి ఇంద్రుడు అడ్డుపడకుండా తాము సహాయం చేస్తామని , ఆ గడువులోపల దహనకాండను పూర్తి చేయాలని శ్రీ కృష్ణుడు ఆదేశిస్తాడు.
శ్రీ కృష్ణుని ఆదేశం మేరకు అగ్నిదేవుడు ఖాండవవనంలో ప్రవేశించి దహించడం
ఆరంభించాడు. ఇది చూసిన ఇంద్రుడు వానలు కురుపించాడు.
ఆ వాన అగ్నిపై పడకుండా అర్జునుడు , తన బాణాలతో ఒక పెద్ద గుడారంనిర్మించాడు.శ్రీ కృష్ణుని కరుణతో, అర్జునుని సహాయం వలన అగ్ని తన ఏడు నాలుకలతోను
ఖాండవ వనాన్ని అంతా దహించ సాగాడు.
మొదటి ఏడురోజులు భూమికి అడుగున వున్న మూలికలను దహించాడు. ఆ సమయంలో
వాతావరణం వేడి ఎక్కడం ప్రారంభమయింది.
ఆ తరువాత వచ్చిన ఏడురోజులలో భూమిపైనున్న వృక్షాలను దట్టమైన అడవిని దహించాడు.
ఉష్ణోగ్రత బాగా పెరిగింది. ఆఖరి ఏడు
రోజులు రాళ్ళను దహించాడు.తరువాత వేడి తీవ్రత క్రమ క్రమంగా తగ్గి ఎండ మాత్రము కాయడం ప్రారంభించింది.
ఆ విధంగా ఖాండవ వనాన్ని అగ్ని దేవుడు దహించిన ఇరవై ఒక్క రోజుల నే "అగ్ని నక్షత్రం" లేదా రోహిణీ
కార్తెలు అంటారు.
రోహిణీకార్తె ఎండలకు రోళ్ళు కూడా పగిలిపోతాయని నిరూపిస్తాయి. నేటికీ వేసవి కాలపు వేడి తీవ్రత
అదే విధంగా వుండడం మనకు బాగా తెలిసిన విషయమే.
ఈ అగ్ని నక్షత్ర కాలంలో
భక్తులు అమ్మవారి ఆలయాలలో,
భరణి జన్మ నక్షత్రమైన
దుర్గాదేవిని ఆరాధించి
పూజించి , అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు.
గృహాలలో కూడా అగ్ని నక్షత్ర
తీవ్రత తగ్గించేందుకు తమ పూజా గదిని శుభ్ర పరచి, సూర్యభగవానుని అర్చించి , ఆదిత్య హృదయం స్తోత్రాలు పారాయణ చేయాలి.
విసినికఱ్ఱలు , మజ్జిగ, పానకం వంటి శీతల ద్రావకాలు, వస్తువులు సూర్యదేవుని ముందు పెట్టి దీపారాధన చేసి భక్తితో పూజిస్తే సూర్యదేవుడు కొంత కరుణించి శాంతిస్తాడు...స్వస్తి...🙏
No comments:
Post a Comment